India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
*కరీంనగర్: కలెక్టరేట్ ఏరియాలో భారీగా చేరిన వరద నీరు.
*శంకరపట్నం: అంబాలాపూర్ ఊరు చెరువుకు గండి.
*శ్రీరాంపూర్: నక్కల చెరువులో వ్యక్తి గల్లంతు.
*శంకరపట్నం: మానేరు డ్యామ్లో వ్యక్తి గల్లంతు.
*పెద్దపల్లి: భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం.
*ఎండపల్లి: చర్లపల్లి గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*వీణవంక: మల్లారెడ్డిపల్లి గ్రామంలో కూలిన ఇల్లు.
*రామడుగు: భారీ వర్షాలకు ధ్వంసమైన వంతెనలు.
*గొల్లపల్లి: భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు.
*వేములవాడ: రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు.
*శంకరపట్నం: నీటిలో కొట్టుకుపోయిన బైకు.
*KNR: భారీ వర్షం.. ప్రజావాణి రద్దు.
*ఓదెల: కొమిర గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*గంభీరావుపేట: సింగసముద్రం పెద్ద కాలువకు గండి.
*జగిత్యాల: భారీ వర్షం.. ప్రజావాణి రద్దు చేసిన కలెక్టర్.
*రామగుండం: భారీ వర్షం.. నీట మునిగిన రోడ్లు
*ధర్మపురి: గోదావరి నదిలో పెరిగిన నీటి వరద.
*జమ్మికుంట: పంట పొలాల్లోకి భారీగా చేరిన వరద నీరు.
*కరీంనగర్: నీట మునిగిన ప్రధాన రహదారులు.
*ఎల్లంపల్లి: ప్రాజెక్టు నుంచి నిలిచిపోయిన రాకపోకలు.
*చిగురుమామిడి: రికార్డు స్థాయి వర్షపాతం నమోదు.
*తంగళ్లపల్లి: మండెపల్లి గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*మల్యాల: తెగిన రహదారి రాకపోకలు బంద్.
*సిరిసిల్ల: నీట మునిగిన పాత బస్టాండ్ ఏరియా.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వరద బాధిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
@ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జగిత్యాల కలెక్టర్.
@ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమలు.
@ జమ్మికుంటలో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి.
@ బెజ్జంకి మండలంలో చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు.
@ ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ధర్మపురి మండలాలలో పర్యటించిన జగిత్యాల కలెక్టర్, ఎస్పీ.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.61,932 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.28,817, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.16,340, అన్నదానం రూ.16,775 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
హనుమకొండ 48వ డివిజన్ పరిధిలోని హాజరత్ సయ్యద్ షా ఆఫ్జాల్ బియబాని దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట MLA నాగరాజు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కూడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ, పీఠాధిపతి ఖుస్రో పాషా, మత పెద్దలు తదితరులున్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో వరద ప్రభావిత ప్రాంతాలను స్థానిక ఎంపీ బలరాం నాయక్ పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాల్లో ప్రజలతో ఎంపీ మాట్లాడి ప్రజలకు ధైర్యం చెప్పి నిత్యం అండగా ఉంటామని చెప్పారు. వరదల వల్ల తెగిపోయిన రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని ఎంపీ కోరారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.
పదేళ్లపాటు సిరిసంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిశలగా మారుతోందని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల పట్ల అనుసరిస్తున్న నేరపూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురుతీస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతన్నలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. నేతన్నలకు ఉపాధి కల్పించే చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు.
> దుగ్గొండి: నీటి వరదకు కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం
> మరిపెడ: ఆకేరు వాగులో కారు కొట్టుకుపోయి అశ్విని అనే యువతి మృతి
> కేసముద్రం: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
> మరిపెడ: కూలిన జాతీయ రహదారి.. రాకపోకలు బంద్
> భూపాలపల్లి: సింగరేణికి రూ.35 లక్షల వరకు నష్టం
> తాడ్వాయి: పశువుల మేత కోసం వెళ్లి ఒకరి మృతి
> WGL: పలు ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలు
> MHBD: జిల్లాలో తెగిన పలు చెరువు కట్టలు, రోడ్లు
Sorry, no posts matched your criteria.