Telangana

News August 31, 2025

SRSP UPDATE: తగ్గుముఖం పట్టిన ఇన్ ఫ్లో.. ఔట్ ఫ్లో

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో, ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో తగ్గుముఖం పట్టింది. నిన్న ఇన్ ఫ్లో 6 లక్షలు, ఔట్ ఫ్లో 5.50 లక్షల క్యూసెక్కులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇన్ ఫ్లో 3.70 లక్షలు, ఔట్ ఫ్లో 3,26,853 క్యూసెక్కులకు తగ్గింది. కాగా ప్రాజెక్టులో తాజాగా 1088 (69.85TMC) అడుగులకు నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

News August 31, 2025

మోమిన్‌పేటలో భర్తను చంపేసిన భార్య

image

మోమిన్‌పేట మండలం కేసారంలో దారుణం చోటుచేసుకుంది. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన కురువ కుమార్ (36), రేణుక (34) భార్యభర్తలు. కేసారంలోని ఒక వెంచర్‌లో పని చేస్తున్నారు. రోజూ మద్యం తాగి భార్యను వేధిస్తున్న కుమార్ ఆదివారం మద్యం మత్తులో వచ్చి రేణుకను కొట్టాడు. వేధింపులు తాళలేక ఆమె భర్త కళ్లల్లో కారం కొట్టింది. ఓ వైర్‌ను మెడకు బిగించి హత్య చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 31, 2025

కరీంనగర్‌కి గర్వకారణం.. జాతీయ అవార్డు పొందిన రామకృష్ణ, సునీత

image

ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నేడు AP లోని నర్సరావుపేటలో తెలుగు భాష దినోత్సవం సందర్బంగా తెలుగు భాష, సంస్కృతి, వైభవం, సాహిత్యం తదితరాల్లో విశేష సేవలను అందిస్తున్నందుకు గాను తెలుగు తేజం పురస్కార అందిస్తుంది. ఇందులో భాగంగా SRR కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, చిందం సునీత జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు.

News August 31, 2025

అంకిత భావంతో సేవలందించడం అభినందనీయం : ఎస్పీ

image

ఏఎస్ఐ ఎస్.దిలీప్ (తాంసి, పీఎస్), ఏఎస్ఐ ముంతాజ్ అహ్మద్ (భీంపూర్ పీఎస్) పదవీ విరమణ పొందిన సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం వారిని సన్మానించారు. 35 ఏళ్లకు పైగా పోలీసు సర్వీసులో చిన్న రిమార్క్ కూడా లేకుండా ఇద్దరూ అంకితభావంతో సేవలందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఏఎస్ఐల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

News August 31, 2025

మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజావాణి

image

కలెక్టరేట్‌లో రేపు సోమవారం ప్రజావాణి హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని కలెక్టర్ తెలిపారు. సోమవారం ప్రజావాణి హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. దీనిని ప్రజలు గమనించాలని కోరారు.

News August 31, 2025

జిల్లాలో భారీ నష్టం: మెదక్ కలెక్టర్

image

పకృతి విలయతాండవంతో జిల్లాలో భారీ నష్టం సంభవించినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. నిజాంపేట్ మండలంలో వరదలతో కోతకు గురైన వంతెనలు రోడ్లను పరిశీలించారు. 11 మండలాల్లో వర్షాల వరదలతో నష్టాలు కలగాయని, రెండు మండలాల్లో 300 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం, వరదల ప్రవాహంతో భారీ నష్టం సంభవించినట్లు వివరించారు. 130 గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరించినట్టు వివరించారు.

News August 31, 2025

కాట్రియాల: వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

image

రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈరోజు పర్యటించారు. గ్రామంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గ్రామంలో నీట మునిగిన పొలాలను, కొట్టుకుపోయిన బ్రిడ్జిని, చిన్న చెరువు కట్టను ఆయన పరిశీలించారు. నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి కమ్మరి రమేశ్ ఉన్నారు.

News August 31, 2025

రేపు మన పాఠశాల-మన ఆత్మగౌరవం: మెదక్ ఎంపీ

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం మన పాఠశాల-మన ఆత్మగౌరవం కార్యక్రమాన్ని నిర్వహించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సంగారెడ్డిలో తపస్ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలు ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మన పాఠశాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకుడు మాధవరెడ్డి పాల్గొన్నారు.

News August 31, 2025

మెదక్: రేపు మహాధర్నాకు అధిక సంఖ్యలో తరలిరావాలి: పీఆర్టీయూ

image

రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద పీఆర్టీయూ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాకు మెదక్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలిరావాలని ఆ సంఘం మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల శ్రీనివాస్, సామ్యా నాయక్, మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓపీఎస్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

News August 31, 2025

KNR: నిజాయితీకి చిరునామా.. ఆటో డ్రైవర్ రాజేందర్

image

కరీంనగర్‌లోని పొలంపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాజేందర్, గీతాభవన్ వద్ద ఓ ప్రయాణికుడు మరచిపోయిన బ్యాగును తిరిగి అందజేశాడు. ఆ బ్యాగులో నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ప్రయాణికుడు దిగిన చోటికి వెళ్లి బ్యాగును సురక్షితంగా అప్పగించాడు. రాజేందర్ నిజాయితీని స్థానికులు, ప్రయాణికులు అభినందించారు.