India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్లకోసారి జాతీయ సాధన సర్వే (న్యాస్) నిర్వహిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు జాతీయ స్థాయిలో ఈ ఏడాది నవంబరు 19న ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. మూడు మాదిరి పరీక్షల కోసం ఉమ్మడి జిల్లాకు రూ.4,72,160 లక్షలు మంజూరయ్యాయి.
ఉస్మానియాలో వివిధ విభాగలకు చెందిన ప్రొఫెసర్లు, అసోసియేట్లు, డైటీషియన్, ఆర్ఎంవోలను రాష్ట్రంలోని జిల్లా ఆస్పత్రులకు బదిలీ చేశారు. దీంతో సరైన వైద్యులు, సిబ్బంది లేక రోగులకు అవస్థలు పడుతున్నారు. వారి స్థానంలో కొంత మందిని ఇక్కడకు బదిలీ చేసినా.. ఆసుపత్రిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పడకల్లేక రోగులు నేలపైనే చికిత్సలు పొందుతున్నట్లు చెబుతున్నారు.
వాషింగ్ మెషీన్ బాగు చేయించలేదన్న కోపంతో భార్య సూసైడ్ చేసుకున్న ఘటన రామచంద్రాపురంలో జరిగింది. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన సంగీత ప్రియ(30) భర్త రాజ్కుమార్తో కలిసి BHEL సైబర్ కాలనీలో ఉంటుంది. వాషింగ్ మెషీన్కు రిపేర్ చేయించలేదని, ఇంట్లోకి సరకులు లేవని శనివారం రాత్రి దంపతులు గొడవపడ్డారు. భర్తపై కోపంతో బెడ్ రూంలోకి వెళ్లిన సుప్రియ డోర్ తీయకపోవడంతో పగలగొట్టి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొంది.
ప్రముఖ రియలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్-8 ఆదివారం మొదలైంది. ఇందులో వరంగల్కు చెందిన నబీల్ అఫ్రిది చోటు దక్కించుకున్నాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంతే ఇష్టం. కాగా, నబీల్ వరంగల్ డైరీస్ యూట్యూజ్ ఛానల్తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.
ఇంటర్ 2022-24 విద్యా సంవత్సరంలో ఒకేషనల్ కోర్సులో రాష్ట్రస్థాయి టాపర్గా దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి దోర్నాల సుకుమార్ నిలిచాడు. ఒకేషన్ కోర్సులో సుకుమార్ ఈటీ (ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్) చేశాడు. ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు 994 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయి టాపర్గా నిలిచాడు. ఈనెల 4న హైదరాబాద్లో ఇంటర్ బోర్డు రాష్ట్ర స్థాయి టాపర్లకు నగదు పారితోషికం, అవార్డు అందజేయనున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇందులో భాగంగా మెదక్, సంగారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, జాగ్రత్తగా ఉండాలని మంత్రులు, అధికారులు హెచ్చరించారు. రేపు కూడా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
మణికొండలోని కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
విద్యుత్తు వ్యవస్థను పర్యవేక్షించే ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయాన్ని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రోనాల్డ్ రాస్, దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎస్పీ డీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదివారం సందర్శించారు. విద్యుత్తు అంతరాయాలపై ఫిర్యాదులు స్వీకరించే 1912 కాల్ సెంటర్ వ్యవస్థను పరిశీలించారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను సమీక్షించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి తడిసి 50 వరకు మట్టి మిద్దెలు కూలిపోవడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో వర్షానికి రెండు ఇళ్లు కూలిపోయాయి. NGKLలోని జామా మజీదు వెనక మట్టి మిద్దె కూలింది. GDWLలోని అయిజ, వడ్డేపల్లి మండలం కొంకల, జూలకల్లు, ఇటిక్యాల మండలం షాబాద్లో మట్టిమిద్దె పడిపోయాయి. MBNR అర్బన్, గ్రామీణం మండలాల్లో పలుచోట్ల మట్టి మిద్దెలు కూలిపోయాయి.
విద్యుత్తు వ్యవస్థను పర్యవేక్షించే ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయాన్ని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రోనాల్డ్ రాస్, దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎస్పీ డీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదివారం సందర్శించారు. విద్యుత్తు అంతరాయాలపై ఫిర్యాదులు స్వీకరించే 1912 కాల్ సెంటర్ వ్యవస్థను పరిశీలించారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.