Telangana

News August 31, 2024

నిజామాబాద్ జిల్లాలో FM స్టేషన్లు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎఫ్ఎం స్టేషన్లను ప్రవేశ పెట్టేందుక కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో జిల్లాలో ఎఫ్ఎం రేడియో సదుపాయం రానుండటంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఒక్కో స్టేషన్ కు 20 నుంచి 30 మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సముదాయాలు, సంఘాలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రజలకు చేరవేయడానికి ఎఫ్ఎం రేడియో ఉపయోగించుకోవచ్చు.

News August 31, 2024

ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు FM స్టేషన్లు

image

ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో ఎఫ్ఎం స్టేషన్లను ప్రవేశ పెట్టేందుక కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో ఉభయ జిల్లాలో ఎఫ్ఎం రేడియో సదుపాయం రానుండటంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఒక్కో స్టేషన్ కు 20 నుంచి 30 మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సముదాయాలు, సంఘాలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రజలకు చేరవేయడానికి ఎఫ్ఎం రేడియో ఉపయోగించుకోవచ్చు.

News August 31, 2024

పెద్దపల్లి: పలు రైళ్ల రద్దు

image

WGL-హసన్‌పర్తి-కాజీపేట ‘F’ క్యాబిన్‌ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సికింద్రాబాద్‌-సిర్పూర్‌కాగజ్‌నగర్ SEP 23 నుంచి OCT 7, కాజీపేట-సిర్పూర్‌టౌన్‌ SEP 26 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. భద్రాచలం రోడ్‌-బళ్లార్ష, బళ్లార్ష-కాజీపేట వరకు SEP 29 నుంచి OCT 8 వరకు అంతరాయం కలగనుంది.

News August 31, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆}మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓటర్ సర్వే
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News August 31, 2024

వరంగల్: పలు రైళ్ల రద్దు

image

WGL-హసన్‌పర్తి-కాజీపేట ‘F’ క్యాబిన్‌ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. గుంటూరు-సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ SEP 23- OCT 8, విజయవాడ-సికింద్రాబాద్‌ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ SEP 25 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్ SEP 23 నుంచి OCT 7 వరకు అంతరాయం కలగనుంది.

News August 31, 2024

బ్యాంకు అకౌంట్ తప్పిదాలను సరి చేసుకోవాలి: AO

image

ఆధార్ కార్డు, బ్యాంక్ రుణం అకౌంట్‌లో తప్పిదాలతో రుణమాఫీ కాలేదో అలాంటి రైతులు బ్యాంకుకు వెళ్లి సరి చేసుకోవాలని సిర్గాపూర్ AO శశాంక్ తెలిపారు. ప్రతి బ్యాంక్‌లో ఒక నోడల్ అధికారికి కరెక్షన్, ఎడిట్ ఆప్షన్ ఇచ్చామన్నారు. రైతులు సెప్టెంబర్ 7 వరకు బ్యాంక్‌కు వెళ్లి తమ ఆధార్ కార్డుపై ఉన్న బ్యాంక్ అకౌంట్ పేరు ఉండేలా కరెక్షన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 31, 2024

ఖమ్మంలో నాలాలూ కబ్జా!

image

ఖమ్మం జిల్లాలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు మాత్రమే కాదు, నాలాలను ఆక్రమించారని స్థానికులు అంటున్నారు. దీంతో కొన్ని కాలువలు ఆనవాళ్లు కోల్పోగా, మరికొన్నింటికి ఇరువైపుల కట్టడాలు పూర్తయ్యాయి. దీంతో వరద చెరువుల్లోకి వెళ్లడం లేదు. దీంతో పలు ప్రాంతాలు కుంటల్లా మారుతున్నాయి. చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో అవి కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

News August 31, 2024

హైదరాబాద్‌లో వర్షం.. జాగ్రత్త!

image

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్నాయి. రాజధాని రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. నేడు, రేపు భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు. తడి రోడ్ల మీద వాహనాలను నెమ్మదిగా నడపాలని ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎదైనా అత్యవసరమైతే 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
SHARE IT

News August 31, 2024

హైదరాబాద్‌లో వర్షం.. జాగ్రత్త!

image

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్నాయి. రాజధాని రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. నేడు, రేపు భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు. తడి రోడ్ల మీద వాహనాలను నెమ్మదిగా నడపాలని ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎదైనా అత్యవసరమైతే 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
SHARE IT

News August 31, 2024

కరీంనగర్: రూ.2.75 కోట్ల సొమ్ము రికవరీ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైబర్ నేరగాళ్ల వలలో పడి చాలా మంది డబ్బు నష్టపోతున్నారు. దీంతో పోలీసులు విలువైన సమాచారాన్ని అందించారు. నష్టం జరిగిన మొదటి గంటలోపు ఫిర్యాదు చేసినా (డైమండ్ అవర్), నిమిషంలోపు ఫిర్యాదు చేసినా (గోల్డెన్ అవర్) సంబంధిత సొమ్మును రికవరీ చేయవచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో రూ.2.75 కోట్లు రికవరీ చేశారు. గంటలోపే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.