India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇందిర మహిళా శక్తి పథకం క్రింద చేపట్టిన వివిధ యూనిట్లను లబ్దిదారులకు అందజేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో ఇందిర మహిళా శక్తి యూనిట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ మండల వారిగా మహిళ శక్తి పథకం కార్యచరణ చేపట్టాలన్నారు.
జిల్లాలో మహిళా భద్రత కోసం షీ టీం యాక్టివ్గా పని చేయాలని ఎస్పీ రూపేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళల భద్రతపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. షీ టీమ్లు డివిజన్ల వారీగా బస్టాండ్, స్కూల్, కళాశాల ప్రాంతాల్లో నిత్యం గస్తీ ఉంచాలని చెప్పారు. సమావేశంలో ఎస్ బీ సీఐ విజయ్ కృష్ణ, నార్కోటిక్ సీఐ రమేష్ పాల్గొన్నారు.
హైదరాబాద్లో మిలద్-ఉన్-నబి ఉత్సవాలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 16వ తేదీకి బదులుగా అదే నెల 19వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు మిలాద్ వేడుకల నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి వేడుకలను దృష్టిలో ఉంచుకుని మిలాద్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ పండగలు కలిసి వచ్చినందున వాటి ఏర్పాట్లపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్లో మిలద్-ఉన్-నబి ఉత్సవాలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 16వ తేదీకి బదులుగా అదే నెల 19వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు మిలాద్ వేడుకల నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి వేడుకలను దృష్టిలో ఉంచుకుని మిలాద్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ పండగలు కలిసి వచ్చినందున వాటి ఏర్పాట్లపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఆదిలాబాద్ పట్టణం శాంతినగర్ లో ఉన్న ఎస్బీఐ వారి ఏటీఎంలో చోరీకి గురువారం రాత్రి యత్నం జరిగింది. వన్ టౌన్ సీఐ సునిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గుర్తుతెలియని వ్యక్తి స్ధానిక శాంతినగర్లోని ఏటీఎం అద్దాలు పగులగొట్టి చోరీ చేయటానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవటంతో వెనుదిరిగాడు. ఈ విషయమై ఎస్బీఐ రీజినల్ బ్యాంక్ ఆఫీసర్ సత్యనారాయణ శుక్రవారం పీఎస్ లో ఫిర్యాదు చేశారని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.
ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్ నెలకు సంబంధించి సదరం స్లాట్ బుకింగ్ ను ఓపెన్ చేసినట్లు జిల్లా అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా దివ్యాంగులు మీసేవ సెంటర్ వద్దకు వెళ్లి సదరం క్యాంపు కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని దివ్యాంగులు గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
పారా ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సాధించిన భారత స్టార్ పార షూటర్ అవని లేఖరాకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ‘X’ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ వేదికగా.. ఆమె బంగారం పతకంతో ఉన్న ఫోటోను జత చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్ పార ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 3 గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిందన్నారు.
నీటిపారుదల ప్రాజెక్టులో ఏకంగా రూ.14 వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని రెవెన్యూ మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టులు కట్టి, వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. పెండింగ్ బిల్లుల్లో పారదర్శకంగా ఉన్నవాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టిందని పేర్కొన్నారు.
> MLG: రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి > MHBD: హైడ్రా తరహాలో మాడ్రాను ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యే > WGL: మార్కెట్లో తగ్గిన పత్తి మిర్చి, ధరలు > MLG: జిల్లాలో పర్యటించిన మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క > HNK: టిమ్స్ ఆస్పత్రి వ్యయం పెంపుపై విచారణకు సీఎం ఆదేశం > MHBD: శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు
@ ధర్మపురి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ ముస్తాబాద్ మండలంలో కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్. @ కరీంనగర్ లో కార్ల షోరూంలో చోరీ. @ జగిత్యాల జిల్లాలో 211 డెంగీ కేసులు నమోదు. @ కరీంనగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ముగ్గురికి జైలు శిక్ష. @ గంభీరావుపేటలో వడ్డీ వ్యాపారిపై కేసు.
Sorry, no posts matched your criteria.