Telangana

News August 30, 2024

ఉమ్మడి NZB జిల్లాలో నేటి HIGHLIGHTS

image

* బోధన్: లాడ్జిలో యువతితో పట్టుబడ్డ కౌన్సిలర్.. బంధువుల దేహశుద్ధి
* NZB: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
* అంతరాష్ట్ర లెండి ప్రాజెక్ట్ పూర్తి చేయడంపై దృఢ సంకల్పంతో ఉన్నాం: జుక్కల్ MLA
* బాన్సువాడ సబ్ కలెక్టర్ గా కిరణ్మయి బాధ్యతల స్వీకరణ
* నసురుల్లాబాద్: ఆటో, బొలెరో ఢీ.. ఒకరు మృతి
* కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్
* బాన్సువాడ: అనుమానాస్పద స్థితిలో నర్సు మృతి

News August 30, 2024

MDK: మండపాలకు పర్మిషన్.. ఇవి తప్పనిసరి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసుల మరో కీలక సూచన.
➤ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న హార్డ్ కాపీని PSలో సమర్పించాలి
➤రూ.145‌‌తో మీసేవా చలాన్ తీసుకోవాలి (అదనపు ఛార్జీ రూ.100)
➤ఎలక్ట్రిసిటీ DD తప్పనిసరి
➤ఆర్గనైజర్ల ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఐదుగురివి జతచేయాలి
➤మండపం చుట్టుపక్కల ఓనర్ల నుంచి NOC తీసుకోండి
వీటన్నింటినీ జతచేసి సంబంధిత PSలో సమర్పిస్తే పోలీస్ అనుమతి పొందవచ్చు.
SHARE IT

News August 30, 2024

మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకం: మంత్రి ఉత్తమ్

image

బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూ డైమెన్షన్ స్కూల్ నీటిపారుదల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

News August 30, 2024

‘రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలి’

image

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలని ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయడంతో పాటు ఏకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, హెల్త్ టూరిజం, జూపార్కు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

News August 30, 2024

KTDM: సింగరేణి కార్మికులకు శుభవార్త

image

సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దాూర్లుగా (శాశ్వత ఉద్యోగులు) క్రమబద్ధీకరిస్తున్నట్టు సంస్థ ఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి వారిని జనరల్ మజూర్లుగా గుర్తించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు రానున్నాయి.

News August 30, 2024

HZB: 4,661 రైతులు రుణమాఫీకి దూరం

image

హుజూరాబాద్ డివిజన్ పరిధిలో రుణమాఫీ కాని రైతుల వివరాలను ఏడీఏ సునీత తెలిపారు. డివిజన్ పరిధిలో మొత్తం 4,661 రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. ఇందులో రేషన్ కార్డు లేని వారు, తదితర కారణాలతో మాఫీ కాలేదన్నారు. ఇంటింటికి సర్వే చేసి వివరాలు సేకరిస్తామన్నారు. రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చిందని, అందులో వివరాలు నమోదు చేస్తున్నామన్నారు.

News August 30, 2024

కడెం ప్రాజెక్టు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏఈ

image

కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్ తెలిపారు. జలాశయం పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశముందని శుక్రవారం రాత్రి వరద గేట్ల నుంచి దిగువకు నీటిని వదిలే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో
నది పరివాహక గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని కోరారు.

News August 30, 2024

రేపు డయల్ యువర్ DM కార్యక్రమం: RM KMM

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్ని డిపోల పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ DM కార్యక్రమం రేపు నిర్వహించాల్సిందిగా రీజినల్ మేనేజర్ సరిరామ్ ఆదేశించారు. రేపు సాయింత్రం 3 నుంచి 4 గంటల వరకు స్థానిక డిపో మేనేజర్లకు కాల్ చేసి సమస్యలను దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరారు…
ఖమ్మం: 9959225958
మధిర: 9959225961
సత్తుపల్లి: 9959225962
భద్రాచలం: 9959225960
కొత్తగూడెం: 9959225959
మణుగూరు: 9959225963

News August 30, 2024

HYD: కరెంట్‌ స్తంభాలపై కేబుల్స్ తొలగించాలి

image

విద్యుత్ స్తంభాల నుంచి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను TGSPCDL మేనేజింగ్ డైరెక్టర్ ముష్రఫ్ ఫరూఖీ శుక్రవారం ఆదేశించారు. తొలగించనివారిపై చర్యలు తీసుకుంటామని, ఆదేశాలు పాటించకుంటే తామే స్వయంగా కేబుళ్లు తొలగిస్తామని విద్యుత్ శాఖాధిపతి తెలిపారు.

News August 30, 2024

అక్రమంగా తరలిస్తున్న 378 తాబేళ్ల పట్టివేత

image

చింతూరు మండలం లక్కవరం అటవీ ప్రాంతం నుంచి వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 378 తాబేళ్లను అటవీ అధికారులు పట్టుకొన్నారు. శుక్రవారం తెల్లవారు జామున పెట్రోలింగ్ చేస్తుండగా పట్టుకున్నట్లు సుకుమామిడి రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరావు తెలిపారు. అనంతరం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.