India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావుకు ప్రథమ శ్రేణి కోర్టులో ఊరట లభించింది. 2018 ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన కేసును కోర్టు కొట్టేసింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన వెంకట్రావు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లకు నగదు పంపిణీ చేయించారని కేసు నమోదైంది. వెంకట్రావుపై పట్టణ పోలీసులు ఏ-2గా చార్జిషీట్ ఫైల్ చేసి కోర్టులో కేసు వేశారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఇక.. ఇవాల్టి నుంచే విద్యాసంస్థలో ఉచిత విద్యుత్ అమలులోకి వస్తుందని, జీవో కూడా విడుదల చేశామని వెల్లడించారు. విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా నీరజ్ అగ్రవాల్ గురువారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఆర్ఎస్ఈ) 1987 బ్యాచ్కు చెందిన అధికారి. ప్రస్తుత నియామకానికి ముందు ఆయన దక్షిణ మధ్య రైల్వే నిర్మాణ విభాగంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేశారు.

దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా నీరజ్ అగ్రవాల్ గురువారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఆర్ఎస్ఈ) 1987 బ్యాచ్కు చెందిన అధికారి. ప్రస్తుత నియామకానికి ముందు ఆయన దక్షిణ మధ్య రైల్వే నిర్మాణ విభాగంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేశారు.

బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న ప్రచురిస్తామని వెల్లడించారు. గురువారం బీఆర్కేఆర్ భవన్లో ఓటరు జాబితా ప్రక్షాళనపై రూపొందించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న ప్రచురిస్తామని వెల్లడించారు. గురువారం బీఆర్కేఆర్ భవన్లో ఓటరు జాబితా ప్రక్షాళనపై రూపొందించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్ఎండి SI వివేక్ వివరాల ప్రకారం.. KNRలోని గణేశ్ నగర్లో నివాసం ఉంటున్న సత్తు రఘు(48) పట్టణంలోని ఓ హోటల్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఇంటి నుంచి బయలుదేరి ఇందిరా నగర్ గ్రామ శివారులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

∆} ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రులు పర్యటన
∆} ఖమ్మం వరద బాధితులకు నేటి నుంచి నగదు పంపిణీ
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} అశ్వరావుపేట లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యాటన
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కి సెలవు
∆} వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల, పొంగులేటి పర్యటన

ఉపాధ్యాయులు సమాజాన్ని సంస్కరించే వ్యక్తులు అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూల్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. మనిషి తనకు తాను సంస్కరించుకొని సమాజపురోభివృద్ధికి పాటుపడే విధంగా వ్యక్తులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. విద్యార్థులలో నిత్యం ప్రేరణకలిగిస్తూ, వారి తల్లిదండ్రులలోనూ పరోక్షంగా ప్రేరణ కల్పించే విధంగా ఉపాధ్యాయుల బోధన ఉండాలని సూచించారు.

జైనూర్లో జరిగిన ఘర్షణతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జైనూర్ను పూర్తిగా అదుపులోకి తీసుకొని కొత్తవారిని రానివ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మీదుగా వెళ్లే బస్సులను రద్దు చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అడిషనల్ DG మహేశ్ భగవత్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, SP గౌష్ ఆలం, SP శ్రీనివాసరావు, ఇతర అధికారులతో చర్చలు జరిపారు.
Sorry, no posts matched your criteria.