India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార బ్యాంకు జీఎం నర్మదపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సహకార డైరెక్టర్, రిజిస్ట్రార్ ఉత్తర్వులను వెలువరించారు. ఖమ్మం జిల్లాలో బ్యాంకు రుణమాఫీ విషయంలో జరిగిన ఆరోపణలపై విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం జీఎం నర్మద ఖమ్మం నుంచి నల్గొండకు బదిలీపై వచ్చిన విషయం తెలిసిందే.

ఉత్తర తెలంగాణలోని పేరు పొందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.7,600 రికార్డు ధర పలికింది. మార్కెట్ యార్డుకు విడి పత్తి విక్రయానికి తీసుకువచ్చారు. ప్రైవేట్ ట్రేడర్స్ బహిరంగ వేలం పాట ద్వారా గరిష్ఠ ధర రూ.7,600 చొప్పున పత్తి కొనుగోళ్లు చేపట్టారు. కనిష్ఠంగా రూ.7300 పలికింది. పత్తికి అధిక ధర పలకడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నేడు నిర్వహించాల్సిన జాబ్ మేళా రద్దు అయినట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జాబ్ మేళాను వాయిదా వేసినట్లు వారు తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో త్వరలో తెలుపుతాం అన్నారు.

పూర్తి స్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ఇన్ ఫ్లో: 54,917 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 38,361 క్యూసెక్కులు
విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా: 29,232 క్యూసెక్కులు
కుడికాల్వ ద్వారా: 8,529 క్యూసెక్కులు
ఎడమ కాల్వ ద్వారా: నిల్
ఏఎమ్మార్పీకి: నిల్
వరద కాల్వకు: 600 క్యూసెక్కులు

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గంలకు మహా చండి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

ఎర్రుపాలెం మండలం మీనవోలులోని వరద ముప్పు ప్రాంతాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పంట పొలాలను పరిశీలించి నష్ట వివరాలను తెలుసుకున్నారు. వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. నష్టపోయిన పంటలను తిరిగి వేసుకోవాలని రైతులకు సూచించారు.

మహిళల భద్రత కోసమే షీ టీమ్ పని చేస్తుందని, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని SP గిరిధర్ హెచ్చరించారు. గురువారం సైబర్ సెక్యూరిటీ DSP రత్నం, షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లామెడికల్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి SP ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆపద సమయంలో డయల్ 100, షీ టీమ్ జిల్లా నెంబరును 6303923211 సంప్రదించాలన్నారు.

ఉపాధ్యాయ వృత్తి సవాల్ లాంటిదని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సహనం, ఓర్పు, సమన్వయంతో పనిచేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయ్యేలా కృషి చేయాలన్నారు.

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్ట్ను నిజామాబాద్ BRS జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కడమేనా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. 9 నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదన్నారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న దిలీప్ను తక్షణమే విడుదల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. నారాయణగూడ IPM బృందం 4 కేసుల్ని నిర్ధారించింది. మాదాపూర్లో నివాసం ఉంటున్న పశ్చిమబెంగాల్కి చెందిన వ్యక్తికి, టోలీచౌకికి చెందిన మరో వృద్ధుడు, హైదర్నగర్కు చెందిన మహిళ, జార్ఖండ్ నుంచి HYD వచ్చిన ఓ మహిళకు ఫ్లూ సోకినట్లు తేల్చింది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ఒళ్లునొప్పులు, తలనొప్పి, వాంతులు లాంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.