Telangana

News September 4, 2024

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రికార్డు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు మొక్కజొన్న ధర ఎవరూ ఊహించని ధర పలికి రికార్డు క్రియేట్ చేసింది. కాగా, గత వారం రూ.2,910 ధర పలికి రికార్డు నమోదు చేసిన మొక్కజొన్న నిన్న రూ.2,858కి తగ్గింది. అయితే ఈరోజు మార్కెట్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.2,970 ధర పలికింది. దీంతో మొక్కజొన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News September 4, 2024

దీప్తిని ప్రశంసించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

image

పారిస్ వేదికగా జరుగుతోన్న Paralympics2024లో దేశానికి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన జీవాంజి దీప్తి మనందరికి గొప్ప స్ఫూర్తి అని ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.

News September 4, 2024

నిజామాబాద్: షబ్బీర్ అలీకి తప్పిన ప్రమాదం

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ప్రమాదం తప్పింది. బుధవారం ఆయన నిజామబాద్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. నగరంలోని ఆనంద్ నగర్‌లో ఇటీవల డ్రైనేజీలో పడి మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా అటవీ శాఖ రేంజ్ ఆఫీస్ ముందు కాన్వాయ్‌లోని 3 కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లు స్వలంగా దెబ్బతిన్నాయి. కాగా ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 

News September 4, 2024

HYD: 4 రోజుల్లో 12 నెలలకు సరిపడేంత వర్షం

image

HYD, RR, MDCL,VKB జిల్లాలలో జూన్, జూలై, ఆగస్టు లోటు వర్షపాతం నమోదు కాగా.. SEP-1 నుంచి 4 వరకు వర్షం బీభత్సం సృష్టించింది. కేవలం 4 రోజుల్లో ఏడాదికి సరిపోయేంత కురిసిందని అధికారులు రిపోర్ట్ విడుదల చేశారు. అత్యధికంగా తాండూరులో 859.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట-843, యాలాల-824, దుండిగల్ గండి మైసమ్మ-812, శంకర్పల్లి-736.4, ఘట్కేసర్-713.9, ముషీరాబాద్-709.1, SEC-701.1 మి.మీ నమోదైంది.

News September 4, 2024

HYD: 4 రోజుల్లో 12 నెలలకు సరిపడేంత వర్షం

image

HYD, RR, MDCL,VKB జిల్లాలలో జూన్, జూలై, ఆగస్టు లోటు వర్షపాతం నమోదు కాగా.. SEP-1 నుంచి 4 వరకు వర్షం బీభత్సం సృష్టించింది. కేవలం 4 రోజుల్లో ఏడాదికి సరిపోయేంత కురిసిందని అధికారులు రిపోర్ట్ విడుదల చేశారు. అత్యధికంగా తాండూరులో 859.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట-843, యాలాల-824, దుండిగల్ గండి మైసమ్మ-812, శంకర్పల్లి-736.4, ఘట్కేసర్-713.9, ముషీరాబాద్-709.1, SEC-701.1 మి.మీ నమోదైంది.

News September 4, 2024

HYD: 200 ఎకరాల్లో AI సిటీ: మంత్రి

image

తెలంగాణకు కృత్రిమ మేధ(ఏఐ)లో అంతర్జాతీయ గుర్తింపు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తమ ప్రభుత్వం 200 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ఈనెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News September 4, 2024

HYD: 200 ఎకరాల్లో AI సిటీ: మంత్రి

image

తెలంగాణకు కృత్రిమ మేధ(ఏఐ)లో అంతర్జాతీయ గుర్తింపు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తమ ప్రభుత్వం 200 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ఈనెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News September 4, 2024

HYD: హుస్సేన్‌సాగర్ పక్కన ఫెన్సింగ్ ఏర్పాటుకు పిటిషన్

image

హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించిన కౌంటరు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్ పక్కన తమ పట్టా స్థలాల రక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటుకు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ బి.శరణప్పస్వామి మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టి.. ఆదేశాలు ఇచ్చారు.

News September 4, 2024

HYD: కారొబార్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీకాంత్

image

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయితి కారొబార్ & సిబ్బంది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడrగా సాదుల శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల, ముఖ్య నాయకుల కారొబార్, జీపీ సిబ్బంది సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారు.

News September 4, 2024

MBNR: ‘మట్టి మేలు’ తలపెట్టవోయ్!

image

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి ఆకట్టుకునే రూపాల్లో ఉన్న మట్టి గణపతి విగ్రహాలను ఇప్పటినుంచే మార్కెట్లో అమ్మకానికి ఉంచుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల కన్నా మట్టి విగ్రహాలు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని నిపుణులు అంటున్నారు.