Telangana

News September 3, 2024

MBNR: భారీ వర్షాలు.. ఈ సీజన్లోనే 9 మంది మృతి!

image

ఈ సీజన్లోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు మట్టి మిద్దెలు, గోడలు కూలి మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు వదిలారు. NGKL జిల్లాలోనే 6 మృతి చెందారు. WNPT జిల్లాలో ఓ వృద్ధుడు, NRPT జిల్లాలో తల్లీకుమార్తెలు మరణించారు. గత నాలుగేళ్లుగా పాలమూరులో మట్టి మిద్దెలు కూలి మొత్తం 20 మంది మృతి చెందారు. మట్టి మిద్దెలో నివసిస్తున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

News September 3, 2024

WGL: వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. శాస్త్రవేత్తల సూచనలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు నీటి మునిగాయి. దీంతో పంటకు తెగులు సోకే ప్రమాదం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏడీఆర్ డా.ఉమారెడ్డి సూచించారు. పత్తిలో నీటిని తీసివేసి, ఎకరాకు 30కిలోల యూరియా, 15 కిలోల పోటాష్ వేయాలని.. మిరపకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రా. తెగులు సోకిన మొక్కల మొదళ్లకు పోయాలని సూచించారు.

News September 3, 2024

శ్రీరామ్ సాగర్ 40 గేట్లు ఎత్తి 2.50లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

image

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రం వరకు 2,51,250 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 73టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 40 గేట్లు ఎత్తి 2.50లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు, కాకతీయ కాలువకు 3వేల క్యూసెక్కులు, వరద కాలువకు 7వేల క్యూసెక్కులు వీటిని విడుదల చేశారు.

News September 3, 2024

NZB: రూ.825కే విద్యుత్ మీటర్

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ మీటర్లు లేని BPL కుటుంబాలకు NPDCL రూ.825కే విద్యుత్ కనెక్షన్ ఇవ్వనుంది. ఈ నెల 15 వరకు నేరుగా విద్యుత్ అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 500 వాట్ల విద్యుత్ వాడే వారు విద్యుత్ కార్యాలయాలు, ఉపకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు. దరఖాస్తు ఫీజు – రూ.25, డెవలప్‌మెంట్ ఛార్జీ – రూ.600, సెక్యూరిటీ డిపాజిట్ – రూ.200 కలిపి మొత్తంగా రూ.825వసూలు చేయనున్నారు.

News September 3, 2024

HYD: రోడ్లన్నీ గోతులే.. రోజుకు వేలల్లో ఫిర్యాదులు

image

వర్షానికి నగరంలోని రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. సీసీ రోడ్లు, బీటీ రోడ్లని తేడాలేకుండా గుంతలుపడి నీళ్లు నిలిచాయి. మ్యాన్‌హోళ్ల మరమ్మతులు లేక రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. మహానగంలో ఉమ్మడి జిల్లాను కలుపుతూ 10వేల కి.మీ.ల రోడ్లుంటే అందులో 885 కి.మీ. ప్రధాన రహదారులు నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థలది. వీటిపై అధికారులు పర్యవేక్షణను గాలికొదిలేశారు. బల్దియాకు రోజుకు 1000కిపైగా రహదారులపై కంప్లెంట్స్ వస్తున్నాయి.

News September 3, 2024

వరంగల్: మనకూ వస్తోంది ‘వాడ్రా ‘

image

వరంగల్ నగర పరిధిలోని చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి చెరువులో లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్(లైడర్) సర్వే చేయాలని అధికారులను ఆదేశించింది. నగరంలోని 75 చెరువుల్లో రూ.25 లక్షల వ్యయంతో డ్రోన్ సర్వే కోసం టెండర్లు పిలిచారు. ఈ సర్వే ద్వారా చెరువు విస్తీర్ణం, పూర్తి నీటి నిల్వ ఎత్తు(FTL)లో ఆక్రమణలు గుర్తిస్తారు. సర్వేను 100 రోజుల్లో పూర్తి చేస్తామని DEE హర్షవర్ధన్ తెలిపారు.

News September 3, 2024

KNR: భారీ వర్షాలకు పంట పొలాల్లో ఇసుక మేటలు

image

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గర్జనపల్లిలో పడిపోయిన పదిహేను విద్యుత్తు స్తంభాలను సెస్ సిబ్బంది సరి చేశారు. మూలవాగు, పెద్దవాగు పరివాహక ప్రాంతంలో పైరు కొట్టుకుపోతుండటంతో పంట పొలాలు కోతకు గురయ్యాయి. భారీగా ఇసుక మేటలు వేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరి మీ పొలం పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.

News September 3, 2024

HYD: రోడ్లన్నీ గోతులే.. రోజుకు వేలల్లో ఫిర్యాదులు

image

వర్షానికి నగరంలోని రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. సీసీ రోడ్లు, బీటీ రోడ్లని తేడాలేకుండా గుంతలుపడి నీళ్లు నిలిచాయి. మ్యాన్‌హోళ్ల మరమ్మతులు లేక రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. మహానగంలో ఉమ్మడి జిల్లాను కలుపుతూ 10వేల కి.మీ.ల రోడ్లుంటే అందులో 885 కి.మీ. ప్రధాన రహదారులు నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థలది. వీటిపై అధికారులు పర్యవేక్షణను గాలికొదిలేశారు. బల్దియాకు రోజుకు 1000కిపైగా రహదారులపై కంప్లెంట్స్ వస్తున్నాయి.

News September 3, 2024

తిమ్మాపూర్: ఎల్ఎండీకి భారీగా వరద నీరు

image

వర్షాలకు ఎల్ఎండీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఆదివారం నుంచి మోయతుమ్మెద వాగు ద్వారా జలాశయంలోకి నీరు భారీగా వస్తోంది. దీంతో అధికారులు మధ్యమానేరు జలాశయం నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. మధ్యమానేరు నుంచి ఎల్ఎండీకి సుమారు 8టీఎంసీల నీరు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి వాగు ద్వారా 7600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో జలాశయంలోకి వస్తుంది. ప్రస్తుతం 15.584 టీఎంసీల నీరున్నట్లు అధికారులు తెలిపారు.

News September 3, 2024

MBNR: వరద బీభత్సం..

image

మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలు నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 622, నారాయణపేట జిల్లాలో 3,020, నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,202, గద్వాల జిల్లాలో 170 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వనపర్తి జిల్లాలో 230 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పత్తి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నీట మునిగినట్లు గుర్తించారు.