Telangana

News September 2, 2024

మెదక్: ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను సోమవారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదుల రిజిస్టర్‌ను పరిశీలించారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 29 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు.

News September 2, 2024

శాసనసభ స్పీకర్‌ను కలిసిన వరంగల్ ఎంపీ

image

హనుమకొండ జిల్లాకు విచ్చేసిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను వరంగల్ ఎంపీ కడియం కావ్య దంపతులు కలిసి సన్మానించారు. అనంతరం వరంగల్ పార్లమెంటుకు సంబంధించిన పలు అంశాలపై స్పీకర్‌తో ఎంపీ చర్చించారు. నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఎంపీకి స్పీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News September 2, 2024

భారీ వర్షం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిందిదే! 4/4

image

*ఇబ్రహీంపట్నం: వేములకుర్తిలో ఇంటిపై పిడుగు.
*బెజ్జంకి: తోటపల్లిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు.
*గంగాధర: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు.
*వెల్గటూర్: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు
*ధర్మపురి: భారీ వర్షాలకు.. అప్రమత్తమైన పోలీసులు హెచ్చరికలు జారీ.
*పెగడపల్లి: తెగిపడిన రోడ్లు.. బయటకు రావద్దని పోలీసుల హెచ్చరికలు.
*గొల్లపల్లి: భారీ వర్షాలు.. ఆగిన రైతుల పనులు.

News September 2, 2024

భారీ వర్షం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిందిదే! 3/4

image

*కరీంనగర్: కలెక్టరేట్ ఏరియాలో భారీగా చేరిన వరద నీరు.
*శంకరపట్నం: అంబాలాపూర్ ఊరు చెరువుకు గండి.
*శ్రీరాంపూర్: నక్కల చెరువులో వ్యక్తి గల్లంతు.
*శంకరపట్నం: మానేరు డ్యామ్‌లో వ్యక్తి గల్లంతు.
*పెద్దపల్లి: భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం.
*ఎండపల్లి: చర్లపల్లి గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*వీణవంక: మల్లారెడ్డిపల్లి గ్రామంలో కూలిన ఇల్లు.
*రామడుగు: భారీ వర్షాలకు ధ్వంసమైన వంతెనలు.

News September 2, 2024

భారీ వర్షాలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిందిదే! 2/4

image

*గొల్లపల్లి: భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు.
*వేములవాడ: రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు.
*శంకరపట్నం: నీటిలో కొట్టుకుపోయిన బైకు.
*KNR: భారీ వర్షం.. ప్రజావాణి రద్దు.
*ఓదెల: కొమిర గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*గంభీరావుపేట: సింగసముద్రం పెద్ద కాలువకు గండి.
*జగిత్యాల: భారీ వర్షం.. ప్రజావాణి రద్దు చేసిన కలెక్టర్.
*రామగుండం: భారీ వర్షం.. నీట మునిగిన రోడ్లు

News September 2, 2024

భారీ వర్షం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిందిదే! 1/4

image

*ధర్మపురి: గోదావరి నదిలో పెరిగిన నీటి వరద.
*జమ్మికుంట: పంట పొలాల్లోకి భారీగా చేరిన వరద నీరు.
*కరీంనగర్: నీట మునిగిన ప్రధాన రహదారులు.
*ఎల్లంపల్లి: ప్రాజెక్టు నుంచి నిలిచిపోయిన రాకపోకలు.
*చిగురుమామిడి: రికార్డు స్థాయి వర్షపాతం నమోదు.
*తంగళ్లపల్లి: మండెపల్లి గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*మల్యాల: తెగిన రహదారి రాకపోకలు బంద్.
*సిరిసిల్ల: నీట మునిగిన పాత బస్టాండ్ ఏరియా.

News September 2, 2024

ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వరద బాధిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

News September 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జగిత్యాల కలెక్టర్.
@ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమలు.
@ జమ్మికుంటలో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి.
@ బెజ్జంకి మండలంలో చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు.
@ ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ధర్మపురి మండలాలలో పర్యటించిన జగిత్యాల కలెక్టర్, ఎస్పీ.

News September 2, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.61,932 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.28,817, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.16,340, అన్నదానం రూ.16,775 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News September 2, 2024

దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్

image

హనుమకొండ 48వ డివిజన్ పరిధిలోని హాజరత్ సయ్యద్ షా ఆఫ్జాల్ బియబాని దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట MLA నాగరాజు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కూడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ, పీఠాధిపతి ఖుస్రో పాషా, మత పెద్దలు తదితరులున్నారు.