Telangana

News September 1, 2024

నడిగూడెం వరద పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ

image

నడిగూడెం మండలంలో వరద పరిస్థితులను సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. మట్టి రోడ్డులో స్థానికులతో కలిసి ద్విచక్ర వాహనంపై ఆయన ప్రయాణించారు. ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News September 1, 2024

ఈ నంబర్‌లకు ఫోన్ చేయండి: కామారెడ్డి SP

image

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 100, 87126 86133కు ఫోన్ చేసి పోలీసుల సేవలు పొందవచ్చని కామారెడ్డి జిల్లా SP సింధూ శర్మ అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. అలాగే వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News September 1, 2024

సెల్ఫీల కోసం వాగుల వద్దకు వెళ్లొద్దు: ఎస్పీ ఉదయ్

image

యువకులు సెల్ఫీల కోసం వరద ప్రవాహాల వద్దకు వెళ్లే లాంటి ప్రయోగాలు చేయకూడదని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని రహదారుల వంతెనలపై నీరు ప్రవహిస్తుండడంతో అటువైపుగా ఎవరు వెళ్ళకూడదని చెప్పారు. సమస్యలు ఉంటే వెంటనే 8712657888కి సమాచారం ఇవ్వాలన్నారు.

News September 1, 2024

HYD: భారీ వర్షాల్లో.. పోలీసుల సేవలు భేష్..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ సిటీ పోలీసులు, వికారాబాద్ పోలీసులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వర్షంలో తడుస్తూ.. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా తీసుకుంటున్న సేవలకు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

News September 1, 2024

సిద్దిపేట: ‘ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి’

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యల్లో ఉండాలని పార్టీ నేతలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా చెక్ డ్యామ్ ‌లు, చెరువు‌లు నిండాయా, చెరువు తూంలు దుంకుతున్నాయా అని పార్టీ నేతలతో మాట్లాడి ఆరా తీశారు.

News September 1, 2024

అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి: మంత్రి తుమ్మల

image

భారీ వర్షాల వలన ఏర్పడిన అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అధికారులు అందరూ తమ సెలవలను రద్దు చేసుకుని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి పునరావాస చర్యల్లో నిమగ్నం అవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు పునరావాస కేంద్రాలను వాడుకోవాలని సూచించారు. ప్రజలు హెల్ప్‌లైన్‌లను వినియోగించుకోవాలని అత్యవసర పరిస్థితి ఉంటే తప్పా బయటకు రావద్దని కోరారు.

News September 1, 2024

HYD: భారీ వర్షాల్లో.. పోలీసుల సేవలు భేష్!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ సిటీ పోలీసులు, వికారాబాద్ పోలీసులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వర్షంలో తడుస్తూ.. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా తీసుకుంటున్న సేవలకు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

News September 1, 2024

భారీ వర్షాల పట్ల మంత్రి కలెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్

image

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవసరమైన పునరావాస చర్యలు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంత ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

News September 1, 2024

HYD: పాములు, మొసళ్లు వస్తున్నాయా? సంప్రదించండి!

image

HYD నగరంలో వర్ష బీభత్సానికి పలుచోట్ల పాములు వస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఓల్డ్ సిటీ హసన్ నగర్ ప్రాంతంలో పైతాన్ రాగా.. స్నేక్ క్యాచర్ హకీం షాకిల్ అప్రమత్తమై, పామును పట్టుకున్నారు. పాములు, మొసళ్లు కనిపిస్తే..TFD 18004255364, ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ 8374233366, అనిమల్ వారియర్స్ 9697887888ను సంప్రదించండి.

News September 1, 2024

రామపురంలో సాగర్ ఎడమ కాలువకు గండి

image

నడిగూడెం మండల పరిధిలోని రామచంద్రాపురం 117 కిలోమీటర్ల వద్ద వరదకి సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. పంట పొలాల నుంచి వరద నీరు గ్రామంలోకి చేరుతోంది. గతంలో గండి పడడంతో అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఎన్ఎస్పి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.