Telangana

News August 31, 2024

వేములవాడ: రంగు మారుతున్న ధర్మగుండం నీళ్లు!

image

శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో రాజన్న ఆలయం రద్దీగా మారింది. అయితే దర్శనానికి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేయడంతో నీళ్లు మురికిగా మారాయి. నీరు పచ్చబడినట్లు భక్తులకు కనిపించడంతో స్నానాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆలయ అధికారులు స్పందించి పచ్చబడ్డ నీళ్లు తొలగించాలని కోరుతున్నారు.

News August 31, 2024

FLASH: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు RED ALERT⚠️

image

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT

News August 31, 2024

FLASH: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు PINK ALERT⚠️

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ రెండు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT

News August 31, 2024

విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై డిప్యూటీ సీఎం సమావేశం

image

రామగుండంలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల విద్యుత్ కేంద్ర స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం పరిశీలించారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమై కొన్ని విషయాలను సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు హార్కార వేణుగోపాల్ రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు.

News August 31, 2024

HYD: అన్ని కలిసోచ్చేలా RRR అలైన్మెంట్ డిజైన్!

image

RRR 189.2 కిలోమీటర్ల దక్షిణ భాగం అలైన్మెంట్ డిజైన్‌పై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఫోర్త్ సిటీ, ఎయిర్‌పోర్టు, రింగ్ రోడ్డు, బెంగళూరు హైవే లాంటివి దక్షిణ భాగాన ఉన్నందున అన్ని కలిసోచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అధికారులు ఆచితూచి అడుగులు వేస్తూ అలైన్మెంట్ కోసం మూడు డిజైన్లు రూపొందిస్తున్నారు. సుమారు రూ.16 వేల కోట్లతో రోడ్డు నిర్మాణం జరగనుండగా, భూ పరిహారానికే రూ.7 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.

News August 31, 2024

బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

image

బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ టూ టౌన్ ఎస్సై యాసిర్ ఆరాఫత్ తెలిపారు. హైమద్ పుర కాలనీకి చెందిన ఓ పదేళ్ల బాలిక శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కిరాణా షాపునకు వెళ్లి వస్తున్న సమయంలో అదే కాలనీకి చెందిన భాసిత్ (50) అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక ఇంటికి వెళ్లి తల్లి దండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.

News August 31, 2024

ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ నుంచి జాతీయ పశుగణన

image

ఉమ్మడి జిల్లాలో పెంపుడు జంతువుల పశుగణన SEP 1 నుండి ప్రారంభం కానుంది. పెంపుడు జంతువులైన ఆవుజాతి , గేదెజాతి, గొర్రెమేకలు , కుక్కలు, పిల్లులు, పందులు, గాడిదలతో పాటూ కోడి బాతుల లెక్కింపు కూడా స్వదేశీ జాతులు విదేశి జాతుల వివరాలు విడివిడిగా శాస్త్రీయ పద్దతిలో తర్ఫీదు పొందిన పశుసంవర్ధక శాఖ బృందాలు ప్రతీ ఇంటింటికి వెళ్లి ఆన్ లైన్ అప్ లోడింగ్ ద్వారా 4 నెలల పాటు నమోదు చేయనున్నారు.

News August 31, 2024

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ సీఎం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, కావున అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుండి బయటకు రావాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

News August 31, 2024

HYD: ‘బఫర్ జోన్‌లో నూతన నిర్మాణాలు చేపట్టొద్దు’

image

బఫర్ జోన్‌లో నూతన నిర్మాణాలు చేపడితే సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని హైకోర్టు శుక్రవారం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల నడెంచెరువు సమీపంలో 17.21 ఎకరాల్లో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలను కూల్చే ముందు నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించింది.

News August 31, 2024

HYD: ‘బఫర్ జోన్‌లో నూతన నిర్మాణాలు చేపట్టొద్దు’

image

బఫర్ జోన్‌లో నూతన నిర్మాణాలు చేపడితే సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని హైకోర్టు శుక్రవారం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల నడెంచెరువు సమీపంలో 17.21 ఎకరాల్లో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలను కూల్చే ముందు నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించింది.