India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
> NSPT: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి అడ్మిషన్
> HNK: శిక్షణ సమయంలోనే పోలీస్ చట్టాలపై సాధించాలి: సీపీ
> JN: జిల్లాలో పర్యటించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
> WGL: మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.7,555, మక్కల ధర రూ.2,936
> BHPL: మేడిగడ్డ బ్యారేజీకి కొనసాగుతున్న వరద
> WGL: ఎంజీఎంలో కనీస వసతులు కరవు
> BHPL: ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్
> MHBD: నీటి సంపులో పడి చిన్నారి మృతి..
> WGL: ఉరి వేసుకుని ఒకరు బలవన్మరణం
> MHBD: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
> TRR: వివాహిత ఆత్మహత్యాయత్నం
> BHPL: పేకాట స్థావరాలపై దాడులు
> MHBD: సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు
> BHPL: కాటారంలో దొంగల భీభత్సం
> HNK: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు
అంగన్వాడి కేంద్రాల్లో కుళ్లిన గుడ్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. సంక్షేమ శాఖ కమిషనర్ కరుణతో కలిసి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో లబ్ధిదారులకు గ్యారెంటీ సరుకులను మాత్రమే సరఫరా చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, సిడిపివోలు పాల్గొన్నారు.
కోస్గిలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ మెరుగు శ్రీనివాసులు గురువారం తెలిపారు. CSE, CSE(AIML), CSE( డాటా సైన్స్)ల్లో పరిమిత సీట్లు కలవని ఆసక్తిగల విద్యార్థులు ఉదయం 9 గంటల వరకు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. ఎంసెట్ పరీక్ష రాసి సీటు రానివారు, పరీక్ష రాయని వారు సైతం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
@ అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని మెట్పల్లిలో రైతుల మాహా ధర్నా. @ మల్యాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ. @ రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే. @ రౌడీషీటర్లకు, హిస్టరీ షీటర్లకు వేములవాడలో కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్పీ అఖిల్ మహాజన్. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవం.
✓ చర్ల: మావోయిస్టుల డంప్ స్వాధీనం
✓ మధిర: ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
✓ చింతూరు: ఘాట్ రోడ్డులో ఆగిన లారీ.. నిలిచిన రాకపోకలు
✓ కొత్తగూడెం పట్టణంలో చిరుజల్లులు
✓ చండ్రుగొండ : దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
✓ ఇందిరమ్మ ఇల్లు అందరికి అందేలా చూస్తాం: ఎంపీ
✓ పెసర పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి:తుమ్మల
✓KMM: ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి: సీపీ
నిషేధిత గంజాయిని రవాణా, విక్రయించే వారిపై కూడా కేసులు నమోదు చేసి పిడి యాక్ట్ అమలు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం కమిషనరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ బాధితులు కోల్పోయిన డబ్బు త్వరగా రీఫండ్ అయ్యే విధంగా చూడాలని సూచించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తుంది. MBNR, NGKL, వనపర్తి, కొడంగల్, జడ్చర్ల, కోస్గి, కల్వకుర్తి, నారాయణపేట తదితర ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మీ మండలంలో వర్షం పడుతుందా..? కామెంట్ చేయండి.
నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం కొండమల్లేపల్లిలో గంజాయి సేవించి పట్టుబడిన యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీ గిరిబాబు, సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భారత ప్రభుత్వం ఆధీనంలోని దీనదయాళ్ వికలాంగ పునరావాస పథకం, సమీకృత వృద్ధుల సంక్షేమ పథకం నుంచి జిల్లాలోని ఎన్జీవోలకు సహాయం మంజూరి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహిళాలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ కామారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. అర్హులైన వారు సెప్టెంబర్ 16లోగా తమ దరఖాస్తులు కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా సంక్షేమ శాఖ రూం నెంబర్ 31లో సమర్పించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.