Telangana

News August 26, 2024

ADB: ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య

image

ADB జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. చాలా ప్రాథమిక పాఠశాలల్లో 10 నుంచి 25 లోపు విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు. జిల్లాలో ఒక్క టీచర్ కూడా లేని పాఠశాలలు 18 ఉండగా, 85 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇక విద్యార్థులు లేక మూతపడిన స్కూళ్లు 10 ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని పలు పాఠశాలల్లో పలువురు టీచర్ల నిర్లక్ష్య వైఖరే విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

News August 26, 2024

HYDలో ఉదయం నుంచే ట్రాఫిక్ ALERT

image

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా HYDలో నేడు ఉ.4 నుంచి రా.11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. గన్ ఫౌండ్రీ ➥ తిలక్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి స్టేషన్ వైపు వెళ్లకుండా GPO జంక్షన్ ➥ MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు. MJ మార్కెట్ నుంచి GPO జంక్షన్ వెళ్లకుండా నాంపల్లి వైపు డైవర్ట్ చేస్తారు. నాంపల్లి నుంచి కోఠి➥ ట్రూప్ బజార్➥ బ్యాంక్ గల్లికి డైవర్ట్ చేస్తారు. BJP ఆఫీస్ ➥ MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు.

News August 26, 2024

MDK: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి చూపని యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

News August 26, 2024

HYDలో ఉదయం నుంచే ట్రాఫిక్ ALERT

image

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా HYDలో నేడు ఉ.4 నుంచి రా.11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. గన్ ఫౌండ్రీ ➥ తిలక్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి స్టేషన్ వైపు వెళ్లకుండా GPO జంక్షన్ ➥ MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు. MJ మార్కెట్ నుంచి GPO జంక్షన్ వెళ్లకుండా నాంపల్లి వైపు డైవర్ట్ చేస్తారు. నాంపల్లి నుంచి కోఠి➥ ట్రూప్ బజార్➥ బ్యాంక్ గల్లికి డైవర్ట్ చేస్తారు. BJP ఆఫీస్ ➥ MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు.

News August 26, 2024

కరీంనగర్: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు

image

కరీంనగర్ జిల్లాలో యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

News August 26, 2024

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మార్పులు

image

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనేక మార్పులు జరగనున్నాయి. కొత్తగా మధిర డివిజన్‌ ఏర్పాటుతో పాటు పలు స్టేషన్ల డివిజన్లను మార్చనున్నారు. ఖమ్మం గ్రామీణంలోని పెద్దతండా పంచాయతీ కేంద్రంగా మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రతిపాదనకు రంగం సిద్ధమైంది. దీనికి అనుగుణంగా ఎం. వెంకటాయపాలెం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో ఇన్ స్పెక్టర్ స్థాయి కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

News August 26, 2024

MBNR: లింక్ క్లిక్ చేస్తే.. రూ.95 వేలు మాయం

image

ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌పై క్లిక్ చేయగా బ్యాంకు ఖాతా నుంచి రూ.95 వేలు డ్రా అయిన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది. CI ఆదిరెడ్డి తెలిపిన వివరాలు.. స్థానిక భవానీనగర్‌కు చెందిన కౌసల్య వాట్సాప్‌కు వచ్చిన లింక్‌ను పిల్లలు క్లిక్ చేశారు. ఆ వెంటనే ఖాతాలో ఉన్న రూ.95,800ను సైబర్ కేటుగాళ్లు కాజేశారు. బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930కి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI తెలిపారు.

News August 26, 2024

ADB: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ముంబాయి-బల్లార్ష మధ్య నడిచే నందిగ్రాం ఎక్స్‌ప్రెస్ 28, 29 తేదీల్లో ఆదిలాబాద్ వరకే పరిమితం కానుందని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నాగపూర్ డివిజన్లో మరమ్మతుల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. 28న సీఎస్ ముంబయి నుంచి బయలుదేరే రైలు(నెంబరు 11401) ఆదిలాబాద్లో నిలిపివేయునున్నట్లు పేర్కొంది. 29న నందిగ్రామ్ రైలు(నెంబరు 11402) ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ముంబయికి బయలుదేరనుంది.

News August 26, 2024

NZB: నిజామాబాద్‌లో మాంసం విక్రయాలు బంద్

image

నేడు శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా నిజామాబాద్‌లో మాంసం విక్రయాలు నిర్వహించవద్దని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని చేపలు, మేకల మాంసం విక్రయాలు, చికెన్ సెంటర్లు, ఇతర మాంసాహార దుకాణాల నిర్వాహకులు ఈ విషయం గమనించాలన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. ఈ ఉత్తర్వును తూ.చా తప్పక పాటించాలన్నారు.

News August 26, 2024

ప్రధాని మోదీ గ్లోబల్ లీడర్: పొంగులేటి సుధాకర్ రెడ్డి

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ గ్లోబల్ లీడర్ అని ఆయన అవలంభిస్తున్న విధానాల పట్ల అగ్ర దేశాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోని ఓ హోటల్లో ఆదివారం ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ హాజరయ్యారు.