Telangana

News August 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..

image

> MLG: బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి
> HNK: జిల్లాలో బీసీ శంఖారావం సదస్సు
> WGL: ‘హైడ్రా’ లాగా.. వరంగల్లో ‘వాడ్రా’!
> JN: బోనమేత్తిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
> HNK: కొత్తిమీర కిలో @200 రూపాయలు
> WGL: కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి: ఎమ్మెల్యే కూనంనేని
> HNK: తీజ్ ఉత్సవాల్లో పాల్గొని నృత్యం చేసిన ఎంపీ కడియం కావ్య
> BHPL: చిత్రకళలో రాణిస్తున్న చిన్నారి ఆద్య

News August 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✒అలంపూర్: కరెంట్ స్తంభం విరిగి పడి బాలుడి మృతి
✒కొత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురు మృతి
✒కల్వకుర్తి బస్టాండ్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి
✒MBNR: గుండెపోటుతో బీజేపీ కార్యకర్త మృతి
✒రేపు వర్షాలు.. పాలమూరు జిల్లాకు ఎల్లో అలర్ట్
✒గండీడ్: దారుణం.. కన్న తల్లిని కొట్టి చంపిన కొడుకు
✒ఒక్కేషనల్ కోర్సులు.. దరఖాస్తుల ఆహ్వానం
✒అటహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నీ

News August 25, 2024

హైరిస్క్ జాబితాలో వనపర్తి, మహబూబ్‌నగర్

image

ఉమ్మడి జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో జిల్లాల్లోని ఆస్పత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. మూడు జిల్లా పరిధిలో 75 చికున్‌గున్యా కేసు నమోదు కాగా.. వనపర్తి, MBNR జిల్లాలు చికున్‌గున్యా హైరిస్క్‌లో ఉన్న జిల్లాల జాబితాలో ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది సేవలు విస్తృతంగా పెంచాలని, పరీక్షలు చేయాలని సూచించింది. వ్యాధుల కట్టడిలో వైద్యశాఖ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి.

News August 25, 2024

సంగారెడ్డి: ‘కార్మికుల సంక్షేమానికి సీఐటీయూ కృషి’

image

కార్మికుల సంక్షేమానికి సీఐటీయూ కృషి చేస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. సంగారెడ్డిలోని కేబుల్ కిషన్ భవన్ లో తోషిబా పరిశ్రమ కార్మికుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తోషిబా పరిశ్రమలో అవకాశ వాదులను ఓడించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఉపాధ్యక్షుడు రాజయ్య పాల్గొన్నారు.

News August 25, 2024

అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి

image

అమెరికాలో స్విమ్మింగ్ ఫూల్‌లో పడి సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన తాప్సీ ప్రవీణ్ అమెరికాలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్‌లో పడి చనిపోయాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. ప్రవీణ్ తల్లిదండ్రులు పాతర్ల పహాడ్‌లో నివాసముంటున్నారు.

News August 25, 2024

సమభావంతో స్వీకరిస్తూ, స్థితప్రజ్ఞతతో ముందుకు సాగాలి: మంత్రి సురేఖ

image

జీవన గమనంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ద్వాపరయుగమైనా, కలియుగమైనా, సర్వకాలాల్లోనూ శ్రీకృష్ణుడు చూపిన బాట సదా ఆచరణీయమని మంత్రి చెప్పారు.

News August 25, 2024

ఖమ్మం: గోల్డ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ దంపతులు

image

 HYDలో ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్ఎండీసీ మారథాన్లో మద్దులపల్లికి చెందిన కానిస్టేబుళ్లు రేగళ్ల గోపీ, బీరెల్లి లక్ష్మీ దంపతులు గోల్డ్ మెడల్ సాధించారు. గోపీ 42.2 కిలోమీటర్ల పరుగు పందెంలో 4.17 ని.ల్లో విజయం సాధించగా, లక్ష్మీ 21.1 కి.మీ రేంజ్లో 2.38 ని.ల సమయంలో గమ్యం చేరుకుని విజయం సాధించారు. గోపీ గన్ మెన్‌గా, లక్ష్మీ తిరుమలాయపాలెం PSలో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్నారు.

News August 25, 2024

సంగారెడ్డి: వండర్ బుక్ ఆఫ్ రికార్డులో కూచిపూడి నృత్య ప్రదర్శన

image

వాసవి మా ఇల్లు, నటరాజ స్ఫూర్తి డాన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. 131 మంది నృత్య కళాకారులు 9.5 నిమిషాల పాటు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ చీఫ్ కోఆర్డినేటర్ నాగేందర్ గౌడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ సర్టిఫికెట్ నిర్వాహకులకు అందించారు.

News August 25, 2024

UPDATE: ఖేడ్.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

నారాయణఖేడ్ మండలం నిజాంపేట వద్ద 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా గ్రామానికి చెందిన సునీల్ (25), కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం నేరంగల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(27) ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తూ నాందేడ్ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. అక్కడే ఒకరు మృతి చెందగా, మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు.

News August 25, 2024

ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి: ఈటల

image

వివిధ డిపార్ట్మెంట్లలో నాలుగు నెలలకు ఆరు నెలలకు గ్రాంట్ రూపంలో జీతాలు ఇస్తే పేద ఉద్యోగుల జీవనం ఎలా సాగుతుందని హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఈ మధ్యవర్తుల దోపిడి ఉండకూడదని, ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా అయితే జీతాలు చెల్లిస్తున్నారో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అలానే ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపారు.