India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ సోషల్ మీడియా అకౌంట్ హాకింగ్కు గురైంది. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రకటనలో స్వయంగా వెల్లడించారు. తన అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లకు ప్రజలు, అధికారులు, తనకు తెలిసిన వారెవరు స్పందించవద్దని సూచించారు. ఫేక్ మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్యాం ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

బంగ్లాదేశ్లో హిందువులపై, వారి వ్యాపారాలపై దాడులకు నిరసనగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చిన ఆదిలాబాద్ బంద్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసి ఉంచారు. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వ్యాపారస్థులు బంద్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.

బీఆర్ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు 39% మాత్రమే పూర్తయ్యాయని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్ల సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయించామని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్ఎస్ హాయాంలో 90% ప్రాజెక్టు పూర్తి చేశామని చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు.

MLG: సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను హీరోయిన్ రెజీనా మర్యాదపూర్వకంగా కలిశారు. తాము తలపెట్టిన రూరల్ విమెన్ లీడర్ షిప్ ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి సీతక్కను హీరోయిన్ రెజీనా కోరారు. అనంతరం పలు అంశాలపై మంత్రి సీతక్కతో హీరోయిన్ చర్చించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

విద్య, వైద్య ఆరోగ్య సంక్షేమంలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన మోడల్ ఆస్పత్రులలో ఈనెల 15 నుంచి ప్రసవాలతోపాటు, చిన్నపిల్లల వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం అయన కలెక్టర్ కార్యాలయం నుంచి మోడల్ ఆస్పత్రులలో వైద్య సౌకర్యాలు, జ్వర సర్వేపై జిల్లాలోని వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

☆ కంటతడి పెట్టుకున్న మంత్రి తుమ్మల
☆ విష జ్వరంతో 8 ఏళ్ల బాలుడు మృతి
☆ CM రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్
☆ పాలేరు ప్రభుత్వ బడులపై మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
☆ హరీష్ రావుకు మంత్రి పొంగులేటి వార్నింగ్
☆ భద్రాచలంలో అప్పుడే పుట్టిన శిశువును రాళ్లపై పడేసిన వ్యక్తులు
☆ తాను అభిమానించే నాయకుడు YSR: మంత్రి తుమ్మల
☆ ములకలపల్లిలో ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణి

1.CRP: రెండు బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు.
2.HNK: పోక్సో కేసులో యువకుడికి పదేళ్ల జైలు శిక్ష.
3. KRV: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
4.NKD: పాము కాటుతో రైతు మృతి.
5.GNP: పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్ట్.
6.PLK: బాలికపై క్యాటరింగ్ వర్కర్ లైంగిక వేధింపులు.
7.WGL: 36 కిలోల గంజాయి పట్టివేత.
8.KZP: క్యాబ్ డ్రైవర్ పై యువకుల దాడి.
9.RGD: ఇల్లు కూలి వృద్ధురాలికి తీవ్రగాయాలు.

* NZB: దత్తత తీసుకున్న బాలుడికి చిత్రహింసలు
* NZB: పోలీస్ స్టేషన్ లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
* బాన్సువాడ ఉప ఎన్నిక ఖాయం: KTR
* లింగంపేట్: యువకుడిపై ఎలుగు బంటి దాడి
* నిజామాబాద్ కు జిల్లాకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి పొన్నం
* పిట్లం: చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
* పోతంగల్: రాత్రి అక్రమ ఇసుక సీజ్.. ఉదయం ఇసుక మాయం
* లంచం తీసుకున్న విద్యుత్ శాఖ AE.. ఏడాది జైలు శిక్ష

జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 141 డెంగ్యూ కేసులు నమోదైనట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శ్రీనివాస్ ‘Way2News’ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించాలి అని సూచించారు.

◆ తాండూర్ గుడుంబా విక్రయిస్తున్న ఒకరిపై కేసు
◆ నిర్మల్, ఆదిలాబాద్లో బంద్ ప్రశాంతం
◆ ఉట్నూర్: పంట పొలాల్లో అడవిపందుల విధ్వంసం
◆ తాండూరు: రైలు నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
◆ మందమర్రి: సమాధులు కూలగొట్టారని ఫిర్యాదు
◆ ఆదిలాబాద్: తోపుడుబండ్ల వివాదం
◆ లోకేశ్వరం: సొంత పరీక్షలతో రోడ్లకు మన మత్తు చేయించిన రైతు
◆ రెబ్బెన: 150 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ
◆ ఉమ్మడి జిల్లాలో హార్ ఘర్ తీరంగా ర్యాలీ
Sorry, no posts matched your criteria.