Telangana

News July 29, 2024

బండారు దత్తాత్రేయను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే

image

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. హర్యానా గవర్నర్ ఆహ్వానం మేరకు బోనాల పండుగ సందర్భంగా విందుకు వెళ్లినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. బండారు దత్తాత్రేయ అంటే పార్టీలకు సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే వ్యక్తి అని ఆయన అన్నారు. అనంతరం ఆయనతో పలు రాజకీయ అంశాలు చర్చించారు.

News July 29, 2024

గ్రేటర్ HYDలో క్రీడల పై GHMC నిర్లక్ష్యపు నీడలు..!

image

గ్రేటర్ HYD నగరంలో GHMC పరిధిలో క్రీడలను తేలికగా తీసుకుంటుంది.క్రీడల్లో పేద, మధ్య తరగతి యువతకు సరైన ప్రోత్సాహకం కరవవుతోంది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో క్రీడల కోసం కేటాయించిన నిధులను సగం మేర కూడా అధికారులు ఖర్చు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.2021-22 ఆర్థిక సంవత్సరంలో 32.78, 2022-235 64.48, 2023-24లో 38.48శాతం నిధులు ఖర్చయ్యాయి. సమ్మర్ క్యాంపులు సైతం అంతంత మాత్రంగానే జరిగాయి.

News July 29, 2024

గ్రేటర్ HYDలో క్రీడల పై GHMC నిర్లక్ష్యపు నీడలు..!

image

గ్రేటర్ HYD నగరంలో GHMC పరిధిలో క్రీడలను తేలికగా తీసుకుంటుంది.క్రీడల్లో పేద, మధ్య తరగతి యువతకు సరైన ప్రోత్సాహకం కరవవుతోంది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో క్రీడల కోసం కేటాయించిన నిధులను సగం మేర కూడా అధికారులు ఖర్చు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.2021-22 ఆర్థిక సంవత్సరంలో 32.78, 2022-235 64.48, 2023-24లో 38.48శాతం నిధులు ఖర్చయ్యాయి. సమ్మర్ క్యాంపులు సైతం అంతంత మాత్రంగానే జరిగాయి.

News July 29, 2024

డిండి జలాశయంలో తగ్గిన నీటిమట్టం

image

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో డిండి జలాశయంలో నీటిమట్టం తగ్గింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 20.5 అడుగులు మాత్రమే నిల్వ ఉంది. జూన్ 28న జలాశయంలో 26 అడుగులు నీరు నిల్వ ఉండగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. వర్షాలు లేక ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి నీరు చేరకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

News July 29, 2024

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేయండి: మంత్రి

image

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఖమ్మం నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమస్యలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం ఉండేలా చూడాలన్నారు. అటు అవసరమున్న చోట ఖబరస్థాన్, షాదిఖానా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News July 28, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓HYD, RR, MDCL జిల్లాల్లో ఘనంగా జరిగిన బోనాలు
✓సికింద్రాబాద్: క్యూఆర్ కోడ్ ద్వారా గాంధీలో ఓపి
✓కల్వకుర్తి అసెంబ్లీకి రూ.309 కోట్ల నిధుల ప్రకటన
✓సికింద్రాబాద్: TGSRTC ప్రకటనల పై టెండర్లకు ఆహ్వానం
✓అబ్దుల్లాపూర్మెట్: గంజాయి మత్తులో బైకులు తగలబెట్టారు
✓అసదుద్దీన్ కొడంగల్లో పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేస్తాం: బండి

News July 28, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి క్రైమ్ వార్తలు

image

> MLG: మంటలు చెలరేగి పేలిన గ్యాస్ సిలిండర్..> MHBD: అనారోగ్యంతో శతాధిక వృద్ధురాలు మృతి..> WGL: యువకుడిపై బీరు సీసాలతో దాడి..> JN: రైలు కిందపడి యువకుడు మృతి..> HNK: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్..> JN: చికిత్స పొందుతూ మహిళా మృతి..> HNK: గంజాయి సేవిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్..

News July 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ గురుకుల విద్యార్థులను పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే. @ కమలాపూర్ మండలంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి. @ బీర్పూర్ మండలంలో తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు. @ కథలాపూర్ మండలంలో బావిలో తేలిన యువకుడి మృతదేహం. @ రాయికల్ మండలంలో మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య. @ వేములవాడలో ఘనంగా బద్దిపోచమ్మకు బోనాల సమర్పణ.

News July 28, 2024

ఢిల్లీ ఘటనలో సికింద్రాబాద్ యువతి మృతి.. కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి

image

ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా సికింద్రాబాద్‌కు చెందిన తానియాసోని (25) మృతిచెందింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియాసోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతికకాయం వీలైనంత త్వరగా అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

News July 28, 2024

ఢిల్లీ ఘటనలో సికింద్రాబాద్ యువతి మృతి.. కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి

image

ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా సికింద్రాబాద్‌కు చెందిన తానియాసోని (25) మృతిచెందింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియాసోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతికకాయం వీలైనంత త్వరగా అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.