India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజధానిలో అంతర్భాగమైన RR, మేడ్చల్ జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి విజయేంద్రబోయి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఏప్రిల్ తొలి వారం నుంచి జూన్ వరకు 2నెలల పాటు మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లు, మండలాల ప్రత్యేకాధికారులు, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని, జలమండలి, మిషన్ భగీరథ అధికారులతో నిత్యం సంప్రదింపులు నిర్వహించాలన్నారు.
రాజధానిలో అంతర్భాగమైన RR, మేడ్చల్ జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి విజయేంద్రబోయి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఏప్రిల్ తొలి వారం నుంచి జూన్ వరకు 2నెలల పాటు మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లు, మండలాల ప్రత్యేకాధికారులు, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని, జలమండలి, మిషన్ భగీరథ అధికారులతో నిత్యం సంప్రదింపులు నిర్వహించాలన్నారు.
కొడుకు, కోడలు గొడవ పడుతుంటే వారించడానికి వెళ్లిన తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేసిన ఘటన నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. SI రవికుమార్ వివరాల ప్రకారం.. స్థానిక చేపల మార్కెట్ వద్ద నివాసం ఉంటున్న రాజుకు అతడి భార్య మధ్య గొడవ జరిగింది. రాజు తండ్రి రవీందర్ వారిని వారించే ప్రయత్నం చేశాడు. మా మధ్యలోకి ఎందుకు వస్తున్నావంటూ రాజు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో తండ్రిపై దాడి చేశాడు.
MBNR, NGKL లోక్ సభ పరిధిలో మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. MBNR పరిధిలో పురుషులు 8,28,944 మంది ఉండగా మహిళలు 8,46,308 మంది ఉన్నారు. NGKL లోక్ సభ పరిధిలో పురుషులు 8,61,980 మంది ఉండగా మహిళా ఓటర్లు 8,69,803 మంది ఉన్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 25,187 మంది అధికంగా ఉన్నారు.
ఫుట్పాత్పై పడుకునే విషయంలో తలెత్తిన ఘర్షణ చివరకు హత్యకు దారితీసిన ఘటన HYD పహాడీషరీఫ్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర వాసి కామ్ సింగ్(40), జల్పల్లి వాసి నవనాథ్ స్థానికంగా ఉంటూ పోచమ్మ గుడి ముందు ఫుట్పాత్పై నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వీరి మధ్య ఘర్షణ జరగగా నవనాథ్ కోపంలో రాయితో కామ్ సింగ్ తలపై మోది హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.
ఫుట్పాత్పై పడుకునే విషయంలో తలెత్తిన ఘర్షణ చివరకు హత్యకు దారితీసిన ఘటన HYD పహాడీషరీఫ్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర వాసి కామ్ సింగ్(40), జల్పల్లి వాసి నవనాథ్ స్థానికంగా ఉంటూ పోచమ్మ గుడి ముందు ఫుట్పాత్పై నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వీరి మధ్య ఘర్షణ జరగగా నవనాథ్ కోపంలో రాయితో కామ్ సింగ్ తలపై మోది హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి జూలపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం HYD రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు కలగాలని, ప్రజలందరి కొత్త ఆశయాలు నెరవేరాలన్నారు. సీఎస్ శాంతి కుమారి, షాద్నగర్ MLA వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి జూలపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం HYD రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు కలగాలని, ప్రజలందరి కొత్త ఆశయాలు నెరవేరాలన్నారు. సీఎస్ శాంతి కుమారి, షాద్నగర్ MLA వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
రోజురోజుకూ కోడిమాంసం వెల కొండెక్కుతోంది. మొన్నటి వరకు కిలో రూ.200 పలికిన చికెన్ ధర నేడు రూ.294కు చేరింది. దీంతో దుకాణానికి వెళ్లిన వారు ధర అడిగి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కిలో తీసుకునే వారు ఇప్పుడు ధరను చూసి అరకిలో తోనే పరిమితమవుతున్నారు. మున్ముందు చికెన్ ధరలు రూ.300పైగా చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జగిత్యాల పట్టణానికి రానున్నారు. MLA డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి, సీనియర్ న్యాయవాది మాకునూరి హనుమంతరావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలో నేడు ఓ గార్డెన్స్లో జరిగే 13వ రోజు(స్వర్గ పాత్ర) కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్టు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.