Telangana

News July 26, 2024

HYD: మానవత్వం చాటుకున్న అల్వాల్ ట్రాఫిక్ ACP

image

విధి నిర్వహణలో చర్యలు తీసుకోవడమే కాదు.. ఆపద వస్తే చలించిపోతామని అల్వాల్ ట్రాఫిక్ ACP వెంకటరెడ్డి నిరూపించారు. ఇటీవల సుచిత్ర వద్ద రాంగ్ రూట్‌లో వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ సిబ్బంది చలానాలు వేస్తున్నారు. ఓ డెలివరీ బాయ్ తప్పించుకునేందుకు హడావుడిగా వెళ్తూ మరో వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇతర వాహనదారుడు కింద పడిపోయాడు. క్షతగాత్రుడికి ACP సపర్యలు చేశారు. ఆయన సేవల పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.

News July 26, 2024

HYD: మానవత్వం చాటుకున్న అల్వాల్ ట్రాఫిక్ ACP

image

విధి నిర్వహణలో చర్యలు తీసుకోవడమే కాదు.. ఆపద వస్తే చలించిపోతామని అల్వాల్ ట్రాఫిక్ ACP వెంకటరెడ్డి నిరూపించారు. ఇటీవల సుచిత్ర వద్ద రాంగ్ రూట్‌లో వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ సిబ్బంది చలానాలు వేస్తున్నారు. ఓ డెలివరీ బాయ్ తప్పించుకునేందుకు హడావుడిగా వెళ్తూ మరో వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇతర వాహనదారుడు కింద పడిపోయాడు. క్షతగాత్రుడికి ACP సపర్యలు చేశారు. ఆయన సేవల పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.

News July 26, 2024

ఎకో టూరిజంలో కుంటాల జలపాతం, కవ్వాల్ ఫారెస్ట్

image

ఎకో టూరిజంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు స్పాట్లను ఎంపిక చేయగా అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ ఫారెస్ట్‌తో పాటు కుంటాల జలపాతానికి చోటుదక్కింది. కుంటాల జలపాతం వద్ద ట్రైబల్ ఎకో టూరిజం కింద రిసార్ట్ నిర్మాణం, టూరిస్టుల విడిది కోసం వసతి, ఎకో ఫ్రెండ్లీ కార్టెజ్‌లు నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ITDA PO ద్వారా రూ.3.81లక్షలతో వివిధ పనులు చేపట్టనున్నారు.

News July 26, 2024

మెట్రోరైలు రెండోదశలో పెరిగిన దూరం

image

HYDలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి, 78.4 కి.మీ. అయింది. అంచనా వ్యయం రూ.24,042 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం రెండోదశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి భట్టి తన బడ్జెట్‌లో ప్రసంగంలో పేర్కొన్నారు.

News July 26, 2024

త్వరలోనే వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి

image

గత ప్రభుత్వం NLG, SRPT, యాదాద్రిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసింది. SRPTలో భవనం పూర్తైనా NLG, యాదాద్రి జిల్లాలో పూర్తి చేయలేదు. ఈ బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ.11,468 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో నల్గొండతో పాటు యాదాద్రిలో వైద్య కళాశాల భవనాల నిర్మాణం పూర్తి చేయనుంది. మరోవైపు జిల్లాలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేయనుంది.

News July 26, 2024

వడ్డీ కట్టాకే రైతు రుణమాఫీ: హరీశ్ రావు

image

రైతు రుణమాఫీ అంశంపై MLA హరీశ్‌రావు X వేదికగా స్పందించారు. ‘DEC 9న రుణమాఫీ చేస్తామని 7నెలల తర్వాత ప్రక్రియను ప్రారంభించడంతో రైతులకు కొత్త సమస్యలు వస్తున్నాయి. 7నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు రైతులను వేధిస్తున్నారు. వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. శివంపేట్ మం. చెందిన ఓ రైతు క్రాప్ లోన్‌ను, రూ.9వేలు మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారు’అని అన్నారు.

News July 26, 2024

నల్గొండ: పెళ్లి చెడగొట్టాలని యత్నం.. యువకులపై కేసు 

image

పెళ్లి సంబంధం చెడగొట్టడానికి యత్నించిన యువకులపై కేసు నమోదైంది. నల్గొండలోని ఓ కాలనీకి చెందిన యువతికి పట్టణానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. తనకు ఈ పెండ్లి ఇష్టం లేదని ఆ యువతి ఇంటి పక్కన ఉండే తెలిసిన యువకుడికి చెప్పింది. అతడు మరో స్నేహితుడి సహాయంతో ఈ నెల 16న పెళ్ళి కొడుడికి ఫోన్ చేసి యువతిని పెళ్లి చేసుకోవద్దని, అమ్మాయి మైనర్ అని బెదిరించారు. యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 26, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద హత్య

image

HYDలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద పని చేసే ముత్తుస్వామి(35)తో ఓ గుర్తుతెలియని వ్యక్తి గొడవపడ్డాడు. మాటామాట పెరగగా క్షణికావేశంలో ఆ వ్యక్తి ముత్తుస్వామి తలపై బండరాయితో కొట్టి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 26, 2024

NLG: అమ్మో రేషన్ బియ్యమా.. మాకొద్దు!

image

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పౌరసరఫరాల శాఖ, ఎన్ఫోర్స్‌మెంట్‌ అధికారులు అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది రేషన్ డీలర్లు, బియ్యం వ్యాపారులు రేషన్ బియ్యం కొనుగోలు చేయడానికి సాహసించడం లేదు. రేషన్ బియ్యం కొనుగోలు చేయలేమంటూ తెగేసి చెబుతుండటం గమనార్హం.

News July 26, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద హత్య

image

HYDలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద పని చేసే ముత్తుస్వామి(35)తో ఓ గుర్తుతెలియని వ్యక్తి గొడవపడ్డాడు. మాటామాట పెరగగా క్షణికావేశంలో ఆ వ్యక్తి ముత్తుస్వామి తలపై బండరాయితో కొట్టి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.