Telangana

News July 28, 2024

MBNR: జిల్లాలో ఇక స్థానిక ఎన్నికల జోష్

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. CM రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

News July 28, 2024

HYD: చెరువుల అభివృద్ధికి HMDA ప్రణాళిక సిద్ధం

image

HYD మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని చెరువులు కొత్తరూపు దాల్చనున్నాయి. విడతల వారీగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇది వరకే 15 చెరువు లను ఎంపిక చేసి కొన్ని పనులు చేపట్టింది.తాజాగా ఏడు జిల్లాల పరిధిలో మరో 45 చెరువులను అభివృద్ధి చేసేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది.HMDA పరిధిలోని అనేక చెరువు ఆక్రమణలు, కలుషిత జలాలు,పూడికతో నిండిపొగా..సర్వేలతో ముందడుగు వేస్తోంది.

News July 28, 2024

తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: పొంగులేటి

image

తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆదివారం కూసుమంచి పర్యటనలో మంత్రి వ్యాఖ్యానించారు. పల్లెల్లో మురుగునీటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. పారిశుధ్ధ్య సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామన్నారు.

News July 28, 2024

HYD: TGRTC ప్రకటనల పై టెండర్లకు ఆహ్వానం

image

HYD, సికింద్రాబాద్, రంగారెడ్డి MGBS రీజియన్లలో ప్రకటన బోర్డుల ఏర్పాటుకు సంబంధించి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లుగా TGRTC ఎండి సజ్జనార్ తెలిపారు. ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. టెండర్ సంబంధించిన ఐడి వివరాలను X వేదిక ట్వీట్ చేశారు. మిగతా వివరాల కోసం https://tender.telangana.gov.in/ వెబ్ సైట్ సంప్రదించండి.

News July 28, 2024

MBNR: చేపల వేటకు వెళ్లిన యువకుడు మృతి

image

చేపలు పట్టేందుకు వెళ్లిన యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఘటన మహబుబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. డోకూరు గ్రామాని చెందిన రాఘవేందర్ స్థానిక చెరువులో చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతుండగా ఫిట్స్ రావడంతో చెరువులో మునిగి ఊపిరి ఆడక చనిపోయాడు. రాఘవేందర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

News July 28, 2024

ఖమ్మం జిల్లాలో స్థానిక ఎన్నికల జోష్

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. CM రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూCMరేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC,ZPTCల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

News July 28, 2024

HYD: అలా చేస్తే వెంటనే వాట్సాప్ చేయండి..!

image

యువతులను వేధింపులకు గురిచేస్తున్న 125 మందిని ఇటీవలే షీ టీం బృందాలు పట్టుకున్నాయి. HYD రాచకొండ విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి.ఉషా విశ్వనాథ్ తెలిపారు. ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా, వాట్సాప్, వీడియో కాల్, ఆడియో కాల్, అసభ్యకరంగా చూడటం, హేళన చేయడం, మహిళలు యువతుల వైపు దురుద్దేశంతో చూడడం లాంటివి చేస్తే..8712662111కి వాట్సాప్ చేస్తే క్షణాల్లో అక్కడ ఉంటామన్నారు.

News July 28, 2024

HYD: అలా చేస్తే వెంటనే వాట్సప్ చేయండి..!

image

యువతులను వేధింపులకు గురిచేస్తున్న 125 మందిని ఇటీవలే షీ టీం బృందాలు పట్టుకున్నాయి. HYD రాచకొండ విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి.ఉషా విశ్వనాధ్ తెలిపారు. ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా, వాట్సప్, వీడియో కాల్, ఆడియో కాల్, అసభ్యకరంగా చూడటం, హేళన చేయడం, మహిళలు యువతుల వైపు దురుద్దేశంతో చూడడం లాంటివి చేస్తే..8712662111కి వాట్సప్ చేస్తే క్షణాల్లో అక్కడ ఉంటామన్నారు.

News July 28, 2024

నిజామాబాద్‌కు 64 ఎలక్ట్రికల్ బస్సులు

image

నిజామాబాద్ జిల్లాలకు 64 ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా NZB డీపో-2కు 12 బస్సులు కేటాయించగా శనివారం 3 వచ్చాయి. మరో 8 కంపెనీ నుంచి రానున్నాయి. NZB, కరీంనగర్ జిల్లాలకు కలిపి మొదటి విడతగా 100 బస్సులు కేటాయించారు. వీటిలో ఇంకా NZBకు 48 రానున్నట్లు ఆయన వెల్లడించారు. రెండో విడతలో 16 బస్సులు వచ్చే అవకాశం ఉందన్నారు.

News July 28, 2024

బాత్రూంలో ఉరేసుకొని బాలిక మృతి

image

బాత్రూంలో ఓ ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని మృతి చెందింది. ఈ ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో శనివారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలు.. గౌరీదేవిపల్లికి చెందిన బాలయ్య పెద్ద కుమార్తె(17) ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఇంటర్ పూర్తిచేసింది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా.. బాత్రూంలో ఉరివేసుకొని కనిపించింది. బాలిక మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.