Telangana

News July 27, 2024

HYD: HMWSSB ప్రక్షాళనతో బదిలీలు!

image

HYDలోని HMWSSB ప్రక్షాళన కొనసాగుతోంది. ఇందులో భాగంగా బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జనరల్ మేనేజర్లు రవీందర్ రెడ్డి, సుబ్రమణ్యం, మహేందర్, సంతోశ్ కుమార్, సుబ్బా రాయుడు, సాయి లక్ష్మి, సీహెచ్ శ్యాంసుందర్ నాయక్, తిప్పన్న, సత్యనారాయణ, మరియారాజ్, సునీల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ బదిలీ అయ్యారు. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న వారిని బదిలీ చేస్తున్నారు.

News July 27, 2024

చేవెళ్ల చౌరస్తాలో నిరసన తెలిపాం: CM

image

అసెంబ్లీలో KCRపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆ నాడు రాజశేఖర్ రెడ్డిని నాటి సభ్యులు ఒప్పించి ప్రాణహిత ప్రాజెక్టును చేవెళ్లకు తీసుకొద్దామనుకుంటే దానిని KCR మెదక్ వరకు నియంత్రించారని ఆరోపించారు. 3 వేల TMCల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా చూశారు కానీ చేవెళ్ల, VKB, తాండూరు, పరిగి, కొడంగల్‌కు నీళ్లు ఇవ్వలేదని, RRజిల్లాను ఎడారిగా మార్చేందుకు కుట్ర చేస్తుంటే చేవెళ్ల చౌరస్తాలో నిరసన తెలిపామన్నారు.

News July 27, 2024

చేవెళ్ల చౌరస్తాలో నిరసన తెలిపాం: CM

image

అసెంబ్లీలో KCRపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆ నాడు రాజశేఖర్ రెడ్డిని నాటి సభ్యులు ఒప్పించి ప్రాణహిత ప్రాజెక్టును చేవెళ్లకు తీసుకొద్దామనుకుంటే దానిని KCR మెదక్ వరకు నియంత్రించారని ఆరోపించారు. 3 వేల TMCల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా చూశారు కానీ చేవెళ్ల, VKB, తాండూరు, పరిగి, కొడంగల్‌కు నీళ్లు ఇవ్వలేదని, RRజిల్లాను ఎడారిగా మార్చేందుకు కుట్ర చేస్తుంటే చేవెళ్ల చౌరస్తాలో నిరసన తెలిపామన్నారు.

News July 27, 2024

ఖమ్మం: త్వరలో సర్పంచ్ ఎన్నికలు.. ఆశావహుల్లో సందడి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలుకానుంది. ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. పాత రిజర్వేషన్లు మార్చొద్దని చెప్పడంతో, కొత్తగా ఎలా చేర్చుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 1,054 గ్రామ పంచాయతీలున్నాయి.

News July 27, 2024

కరీంనగర్‌లో KCRను ఓడగొడతారని భయపడ్డారు: CM

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా ప్రస్తావన తీసుకొచ్చారు. 2009లో కరీంనగర్‌ జిల్లా ప్రజలు KCRను ఓడగొడతారని భయపడి పాలమూరుకు వలసొచ్చారని, వలసలు పోయే పాలమూరు ప్రజలు KCRను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు. పదేళ్లు పాలించిన KCR రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.

News July 27, 2024

HYD: HMWSSB ప్రక్షాళనతో బదిలీలు!

image

HYDలోని HMWSSB ప్రక్షాళన కొనసాగుతోంది. ఇందులో భాగంగా బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జనరల్ మేనేజర్లు రవీందర్ రెడ్డి, సుబ్రమణ్యం, మహేందర్, సంతోశ్ కుమార్, సుబ్బా రాయుడు, సాయి లక్ష్మి, సీహెచ్ శ్యాంసుందర్ నాయక్, తిప్పన్న, సత్యనారాయణ, మరియారాజ్, సునీల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ బదిలీ అయ్యారు. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న వారిని బదిలీ చేస్తున్నారు.

News July 27, 2024

ఈనెల చివరి నాటికి నిండనున్న శ్రీశైలం

image

అచ్చంపేట: కర్ణాటక, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుండడంతో శ్రీశైలం కళకళలాడుతోంది. ఆల్మట్టి డ్యాం నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. సగానికి పైగా ప్రాజెక్టు నిండినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.81 TMC కాగా, ప్రస్తుతం 109.TMCలకు చేరుకుంది.

News July 27, 2024

పాలమూరోళ్లం KCRకు ఏం అన్యాయం చేశాం: CM

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. పాలమూరు ప్రస్తావన తీసుకొచ్చారు. ‘పాలమూరోళ్లం మేము.. KCRకు ఏం అన్యాయం చేశాం.. 2009లో కరీంనగర్‌లో KCRను ఓడగొడతారని భయపడి పాలమూరుకు వలసొస్తే.. వలసలు పోయే పాలమూరు ప్రజలు KCRను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు.. భుజాల మీద మోసి పార్లమెంట్‌కు పంపించారు. తెలంగాణ వచ్చాక సీఎం అయి కూడా పాలమూరుకు KCR ఏం చేయలేదని ఆరోపించారు.

News July 27, 2024

HYD: మా MLA మల్‌రెడ్డి రంగారెడ్డి మొత్తుకుంటారు: CM

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా ప్రస్తావన తీసుకొచ్చారు. కట్టిన ప్రాజెక్టుల పేర్లు చెబుతున్న KCR.. RR జిల్లాలో ఎన్ని భూములు అమ్ముకున్నారో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. గత BRS పాలనలో RRలో కనీసం డ్రైనేజీలు, ప్రభుత్వ కాలేజీల నిర్మాణానికి నిధులివ్వలేదని ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి ఎప్పుడూ మొత్తుకుంటారని అన్నారు.

News July 27, 2024

HYD: మా MLA మల్‌రెడ్డి రంగారెడ్డి మొత్తుకుంటారు: CM

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా ప్రస్తావన తీసుకొచ్చారు. కట్టిన ప్రాజెక్టుల పేర్లు చెబుతున్న KCR.. RR జిల్లాలో ఎన్ని భూములు అమ్ముకున్నారో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. గత BRS పాలనలో RRలో కనీసం డ్రైనేజీలు, ప్రభుత్వ కాలేజీల నిర్మాణానికి నిధులివ్వలేదని ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి ఎప్పుడూ మొత్తుకుంటారని అన్నారు.