Telangana

News April 9, 2024

గాంధీ ఆస్పత్రిలో డయాగ్నొస్టిక్ సేవలు ఇలా..!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నాణ్యమైన డయాగ్నొస్టిక్ సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతినెల దాదాపుగా 100 అల్ట్రా సౌండ్ స్కానింగ్ 3,000 సీటీ స్కాన్, సుమారు 700 ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో MRI ప్రారంభం కాకపోవడం వల్ల, గాంధీ ఆసుపత్రికి MRI స్కానింగ్ కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

News April 9, 2024

సాగర్ ప్రాజెక్ట్ సమాచారం

image

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మంగళవారం ఉదయం సమాచారం మేరకు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.10 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను ప్రస్తుతం 133.5447 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి 6,498 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉండగా, ఇన్ ఫ్లో నిల్ ఉంది.

News April 9, 2024

కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య

image

పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెంకటాపురం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. వెంకటాపురం మండలం చొక్కాల గ్రామానికి చెందిన కోక కార్తీక్(28) ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు చేసుకున్నాడని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

News April 9, 2024

రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దు: మంత్రి కోమటిరెడ్డి

image

RRR నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ రోజు RRR నిర్మాణం కారణంగా భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల 500 మంది రైతులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అలైన్మెంట్ మార్చాలని మంత్రిని కోరగా సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారిస్తామని అప్పటిలోగా రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

News April 9, 2024

MNCL: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యం పట్టివేత

image

కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన గుల్ల రాకేష్ అక్రమంగా రేషన్ బియ్యాన్ని వాహనంలో తరలిస్తుండగా మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై జగదీష్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించి బోలేరో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 12.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమైనట్లు పేర్కొన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించి, రాకేష్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News April 9, 2024

GDK: గృహిణి హత్య కేసులో భర్త, అత్తకు జీవిత ఖైదు

image

GDK LBనగర్‌కు చెందిన గౌతమి, హనుమాన్‌ నగర్‌కు చెందిన రాజుకు 2009 వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత రాజు, అతని తల్లి వరకట్నం తేవాలని వేధింవారు. ఈక్రమంలో 2014 AUG 9న గొంతు నులిమి హత్య చేసి, కిరోసిన్ పోసి నిప్పంటించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో వన్ టౌన్‌లో కేసు నమోదు చేశారు. సోమవారం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శ్రీనివాసరావు భర్త, అత్తకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు.

News April 9, 2024

HYD: ఇది అల్లం కాదు విషం.. జర జాగ్రత్త..!

image

గ్రేటర్ HYDలో కల్తీ ఆహార పదార్థాల తయారీ ఘటనలు తరచూ వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. రసాయనాలు ఉపయోగించి తయారు చేస్తున్న ఆహార పదార్థాలు చివరకు విషంలా మారి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. తాజాగా HYD జల్‌పల్లి పరిధి శ్రీరామ కాలనీలో కుళ్లిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారు చేస్తున్న ఓ కార్ఖానాపై ఎల్బీనగర్ SOTపోలీసులు దాడులు చేశారు. నకిలీ డబ్బాలను స్వాధీనం చేసుకుని పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు.

News April 9, 2024

HYD: ఇది అల్లం కాదు విషం.. జర జాగ్రత్త..!

image

గ్రేటర్ HYDలో కల్తీ ఆహార పదార్థాల తయారీ ఘటనలు తరచూ వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. రసాయనాలు ఉపయోగించి తయారు చేస్తున్న ఆహార పదార్థాలు చివరకు విషంలా మారి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. తాజాగా HYD జల్‌పల్లి పరిధి శ్రీరామ కాలనీలో కుళ్లిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారు చేస్తున్న ఓ కార్ఖానాపై ఎల్బీనగర్ SOTపోలీసులు దాడులు చేశారు. నకిలీ డబ్బాలను స్వాధీనం చేసుకుని పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు.

News April 9, 2024

ఖమ్మం: ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 20 గడువు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) రెండు, నాలుగో, ఆరో (రెగ్యులర్, సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ ) ఏడాది అభ్యర్థులు ఏప్రిల్ 18 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజులు చెల్లించుకోవాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహచారి తెలిపారు.
రూ.250 అపరాధ రుసుంతో ఏప్రిల్ 20 వరకు ఫీజులు చెల్లించుకునే అవకాశం ఉందన్నారు.

News April 9, 2024

MDK: 106 మంది ఉద్యోగులు సస్పెండ్

image

సిద్దిపేట జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అధికారులపై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశంలో పాల్గొన్న వారిని సీసీ కెమెరా ఆధారంగా గుర్తించిన అధికారులు 40 మంది ఐకేపీ, 66 మంది ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులను ఎన్నికల నిబంధన మేరకు వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.