Telangana

News April 9, 2024

MBNR: జిల్లాలో ఒక్కసారిగా హీటెక్కిన రాజకీయం

image

ఉమ్మడి MBNR జిల్లాలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునేందుకు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించి రెండు ఎంపీ స్థానాలపై గురి పెట్టారు. నిన్న కొడంగల్‌లో పర్యటించడంతో రాజకీయం మరింత వేడెక్కింది.

News April 9, 2024

హైదరాబాద్ పౌరులను కదిలించాలని ఆదేశాలు

image

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత MP ఎన్నికల్లో ఓటింగ్ 50 శాతం దాటలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం (EC) భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నగర ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చైతన్యాన్ని పెంపొందించాలని ఈసీ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు.

News April 9, 2024

హైదరాబాద్ పౌరులను కదిలించాలని ఆదేశాలు 

image

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత MP ఎన్నికల్లో ఓటింగ్ 50 శాతం దాటలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం (EC) భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నగర ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చైతన్యాన్ని పెంపొందించాలని ఈసీ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. 

News April 9, 2024

HYD: జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్స్ సిద్ధం చేయాలి: కమిషనర్

image

రాబోయే వర్షాకాలానికి సంబంధించి తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. శిథిలావస్థలోని భవనాలను గుర్తించి వాటి ద్వారా ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్స్ సిద్ధం చేయాలన్నారు. సర్కిళ్లలో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ ఆటంకాలు లేకుండా ప్లాన్స్ రూపొందించాలన్నారు.

News April 9, 2024

HYD: జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్స్ సిద్ధం చేయాలి: కమిషనర్ 

image

రాబోయే వర్షాకాలానికి సంబంధించి తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. శిథిలావస్థలోని భవనాలను గుర్తించి వాటి ద్వారా ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్స్ సిద్ధం చేయాలన్నారు. సర్కిళ్లలో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ ఆటంకాలు లేకుండా ప్లాన్స్ రూపొందించాలన్నారు.

News April 9, 2024

ఉగాది తర్వాతే BRS వరంగల్ ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తాం: ఎర్రబెల్లి

image

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉగాది పండుగ తర్వాతే BRS వరంగల్ ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తామని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్‌ గెలిస్తేనే తెలంగాణ గొంతుక పార్లమెంట్‌లో వినిపిస్తుందన్నారు.

News April 9, 2024

ఖమ్మం: ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 20 గడువు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) రెండు, నాలుగో, ఆరో (రెగ్యులర్, సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ ) ఏడాది అభ్యర్థులు ఏప్రిల్ 18 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజులు చెల్లించుకోవాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహచారి తెలిపారు.
రూ.250 అపరాధ రుసుంతో ఏప్రిల్ 20 వరకు ఫీజులు చెల్లించుకునే అవకాశం ఉందన్నారు.

News April 9, 2024

HYD: భారీగా పెరిగిన సన్న బియ్యం ధర 

image

సామాన్యులకు సన్న బియ్యం ధర దడ పుట్టిస్తోంది. HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతోంది. యాసంగిలో వరి సాగు తగ్గడంతో రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింతగా ఉండనుంది. మార్కెట్‌లో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని బియ్యాన్ని బ్లాక్‌ చేస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీ కామెంట్?

News April 9, 2024

HYD: భారీగా పెరిగిన సన్న బియ్యం ధర

image

సామాన్యులకు సన్న బియ్యం ధర దడ పుట్టిస్తోంది. HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతోంది. యాసంగిలో వరి సాగు తగ్గడంతో రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింతగా ఉండనుంది. మార్కెట్‌లో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని బియ్యాన్ని బ్లాక్‌ చేస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీ కామెంట్?

News April 9, 2024

మిర్యాలగూడలో వడదెబ్బతో ఇద్దరి మృతి 

image

మిర్యాలగూడలో వడదెబ్బ కారణంగా సోమవారం ఒక్కరోజే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ప్రకాష్ నగర్ తొమ్మిదో వార్డుకు చెందిన శ్యామల పెంటయ్య(70), బండి అడవయ్య (65) ఎండ తీవ్రతకు అవస్థతకు గురై చనిపోయారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయని చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.