Telangana

News August 3, 2024

సంగారెడ్డి: జ్వరాలొస్తున్నాయ్.. జాగ్రత్త!

image

వాతావరణంలోని మార్పుల కారణంగా సంగారెడ్డి జిల్లా ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్‌ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వర పీడితులతో దావాఖానలు కిటకిటలాడుతున్నాయి. ఓపీ కేసులతో పాటు ఔట్ పేషేంట్ కేసులు అధికంగా నమోదైతున్నాయి. జిల్లాలో అధికారికంగా 70 డెంగీ కేసులు నమోదు కాగా, అధికారుల దృష్టికి రాని కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లాలో 1415 టైఫాయిడ్‌ కేసులు నమోదయ్యాయి.

News August 3, 2024

సిటీలో RTC బస్సుల సంఖ్య పెంచాలి!

image

HYD సిటీలో బస్సుల సంఖ్య పెంచాలని కోరుతూ గాంధీ హాస్పిటల్ ఎదురుగా బస్ స్టాప్‌లో సంతకాల సేకరణ చేశారు. CPM నగర కార్యవర్గవర్గ సభ్యురాలు నాగలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ మహిళల ఉచిత బస్సు పథకం మంచిదే కానీ HYD నగర జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్య లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో HYD నగరంలో 3,800 బస్సులు ఉండేవని, గత BRS ప్రభుత్వం మూడేళ్లలో 1,000 బస్సులు తగ్గించిందన్నారు.

News August 3, 2024

గాంధీ జిరియాట్రిక్ విభాగానికి నాలుగు పీజీ సీట్లు మంజూరు

image

గాంధీ ఆసుపత్రి జిరియాట్రిక్​ వైద్య విభాగానికి నాలుగు పీజీ సీట్లు మంజూరు చేస్తూ నేషనల్​ మెడికల్ కౌన్సిల్(NMC) ఉత్తర్వులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ర్టంలో ఇప్పటికే నిమ్స్​, ఉస్మానియా ఆసుపత్రుల్లో జిరియాట్రిక్​ వార్డులుండగా, ఇటీవల గాంధీ ఆసుపత్రిలో వయో వృద్ధులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి గాంధీ మెయిన్​ బిల్డింగ్​ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.

News August 3, 2024

గాంధీ జిరియాట్రిక్ విభాగానికి నాలుగు పీజీ సీట్లు మంజూరు

image

గాంధీ ఆసుపత్రి జిరియాట్రిక్​ వైద్య విభాగానికి నాలుగు పీజీ సీట్లు మంజూరు చేస్తూ నేషనల్​ మెడికల్ కౌన్సిల్(NMC) ఉత్తర్వులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ర్టంలో ఇప్పటికే నిమ్స్​, ఉస్మానియా ఆసుపత్రుల్లో జిరియాట్రిక్​ వార్డులుండగా, ఇటీవల గాంధీ ఆసుపత్రిలో వయో వృద్ధులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి గాంధీ మెయిన్​ బిల్డింగ్​ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.

News August 3, 2024

NLG: ఆరేళ్లుగా నిరీక్షణ.. పెండింగ్ దరఖాస్తులకు మోక్షం ఏది?

image

ఆహారభద్రతా కార్డుల్లో రెండో బిడ్డ వివరాలను చేర్పించే అవకాశం లేకుండా పోయింది. కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా వీలు లేదు. దీంతో వేలాది మంది బాధితులు వారి బిడ్డల వివరాలు కార్డుల్లో లేకపోవడంతో మదనపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 10.07 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. 29.84 లక్షల మంది సభ్యులు (యూనిట్లు) ఉన్నారు. సుమారు 50 వేల మందికి పైగా మీ-సేవా కేంద్రాల్లో ఆరేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు.

News August 3, 2024

అగ్రికల్చర్ మార్కెట్ నూతన పాలకవర్గం నియామకం: మంత్రి తుమ్మల

image

ఖమ్మం జిల్లాలో పలు మార్కెట్లకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సత్తుపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆనంద్ బాబు, వైస్ ఛైర్మన్ గా వెంకటప్ప రెడ్డి నియమితులయ్యారు. అటు కల్లూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నీరజ, వైస్ ఛైర్మన్‌గా కోటేశ్వరరావుతో పాటు కమిటీ సభ్యులను నియమించినట్లు మంత్రి చెప్పారు. నూతన పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

News August 3, 2024

HYD: రెండేళ్లలోపే పూర్తి చేస్తాం: మంత్రి

image

HYD నగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. HYD టీమ్స్ ఆసుపత్రులను 14 అంతస్తులకే పరిమితం చేస్తామని, ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాల హాస్టల్స్ భవనాలను రెండేళ్లలోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.

News August 3, 2024

HYD: రెండేళ్లలోపే పూర్తి చేస్తాం: మంత్రి

image

HYD నగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. HYD టీమ్స్ ఆసుపత్రులను 14 అంతస్తులకే పరిమితం చేస్తామని, ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాల హాస్టల్స్ భవనాలను రెండేళ్లలోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.

News August 3, 2024

సిరిసిల్ల: కుక్కలతో ప్రాణాలు పోతున్నాయ్!

image

సిరిసిల్ల జిల్లాలో వీధి కుక్కలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. వీధుల్లో గుంపులుగా తిరుగుతుండటంతో వాటిని చూసి ప్రజలు జంకుతున్నారు. వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది కుక్కలు, కోతుల దాడిలో గాయపడిన వారు 1,543 మంది ఉన్నారు. 3 రోజుల క్రితం ముస్తాబాద్‌ మండలం సేవాలాల్‌తండాలో అర్ధరాత్రి ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని కుక్కలు పీక్కుతిన్న విషయం విదితమే.

News August 3, 2024

ఉమ్మడి జిల్లాలో ఐటీ హబ్‌ల మనుగడ ప్రశ్నార్థకం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటుచేసిన ఐటీ హబ్‌ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు, ఇంజనీరింగ్ పట్టభద్రులకు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉపాధినిచ్చే దిశగా గత ప్రభుత్వం సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఐటి హబ్లు ఏర్పాటు చేసింది. ప్రారంభంలో అట్టహాసంగా ముందుకొచ్చిన పలు కంపెనీలు ఏడాది గడవకముందే.. సదరు కంపెనీలు లేకపోవడంతో హబ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారాయి.