Telangana

News July 31, 2024

వారం వ్యవధిలో భార్యాభర్తలు మృతి

image

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం తల్లాడ మండలంలో చోటు చేసుకుంది. బిల్లుపాడుకు చెందిన సీనియర్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో భర్త మరణాన్ని జీర్ణించుకోలేక మాజీ సర్పంచ్ ప్రేమలత బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వారం వ్యవధిలో భార్యాభర్తలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 31, 2024

WGL: కుమారుడి ప్రాణం కాపాడాలని తల్లిదండ్రుల వినతి

image

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెం వాసి బాబు, కళ్యాణి దంపతులకు కొద్దిరోజుల క్రితం బాబు జన్మించాడు. పుట్టుకతోనే శ్వాసకోశ నాళం, ఆహార నాళం అతుక్కుపోయింది. గుండెలో రంధ్రం పడింది. ఒకే కిడ్నీతో బాధపడుతున్నాడు. HYD బోడుప్పల్‌లోని అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఆపరేషన్‌కు రూ.7 లక్షలు కావాలని పేద కుటుంబానికి చెందిన ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు. KTR, దాతలు ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

News July 31, 2024

HYD: బ్యాంకులో భారీ స్కామ్.. మేనేజర్ ARREST

image

శంషాబాద్ ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో రూ.40 కోట్ల స్కామ్‌ జరిగిన విషయం తెలిసిందే! ఈ భారీ స్కామ్‌లో బ్యాంక్ మేనేజర్ రామస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో బ్యాంకు ఉద్యోగి రాజేశ్‌తో కలిసి రూ.40 కోట్లు స్వాహా చేశారు. సినీ నిర్మాత షేక్ బషీద్‌కు మేనేజర్ రూ.40కోట్లు బదిలీ చేశాడు. అక్కడినుంచి మరికొన్ని అకౌంట్లకు సొమ్ము ట్రాన్స్‌ఫర్ అయినట్లు తేలింది.

News July 31, 2024

HYD: బ్యాంకులో భారీ స్కామ్.. మేనేజర్ ARREST

image

శంషాబాద్ ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో రూ.40 కోట్ల స్కామ్‌ జరిగిన విషయం తెలిసిందే! ఈ భారీ స్కామ్‌లో బ్యాంక్ మేనేజర్ రామస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో బ్యాంకు ఉద్యోగి రాజేశ్‌తో కలిసి రూ.40 కోట్లు స్వాహా చేశారు. సినీ నిర్మాత షేక్ బషీద్‌కు మేనేజర్ రూ.40కోట్లు బదిలీ చేశాడు. అక్కడినుంచి మరికొన్ని అకౌంట్లకు సొమ్ము ట్రాన్స్‌ఫర్ అయినట్లు తేలింది.

News July 31, 2024

NLG: రెండో విడతలోనూ అనేక సమస్యలు

image

రైతు రుణమాఫీ రెండో విడతలోనూ అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఈనెల 18న చేసిన మొదటి విడత రుణమాఫీలో ఏయే సమస్యలతో రుణమాఫీ కాలేదో ఇప్పుడూ అవే సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన రెండో విడత రుణమాఫీలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని అనేక మంది రైతులకు మాఫీ వర్తించలేదు. పలు కారణాలతో రుణమాఫీ కాకపోవడంతో చాలామంది రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

News July 31, 2024

కరీంనగర్: 6.35 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం

image

కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కాగా ఇప్పటి వరకు 6.35 కోట్ల మంది మహిళలు ప్రయాణించగా.. రూ.230.72 కోట్ల ఆదాయం వచ్చినట్లు కరీంనగర్ ఆర్ఎం సుచరిత తెలిపారు. ఆక్యుపెన్సీ రేషియో సైతం 85.33కు పెరిగినట్లు చెప్పారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

News July 31, 2024

నేడు HYDకు నూతన గవర్నర్

image

తెలంగాణ కొత్త గవర్నర్ మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలకుతారు. సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

News July 31, 2024

నేడు HYDకు నూతన గవర్నర్

image

తెలంగాణ కొత్త గవర్నర్ మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలకుతారు. సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

News July 31, 2024

స్థిరంగా కొనసాగుతున్న పత్తి, మిర్చి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,400 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,250 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News July 31, 2024

వరంగల్: భారీగా పెరిగిన తేజ మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే తేజ మిర్చి ధర భారీగా పెరిగింది. నిన్న క్వింటాకు రూ.17,300 పలికిన తేజ మిర్చి నేడు రూ.18,200 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.15,500 రాగా నేడు రూ.15 వేలకు తగ్గింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.15,500 ధర రాగా నేడు రూ. 14 వేల ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.