India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దపల్లి సమీపంలోని బంధంపల్లి వద్ద ఈరోజు సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గోదావరిఖనికి వస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో కారు బోల్తా పడింది. దీంతో కారులోని పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హన్మకొండలో ప్రసిద్ధి చెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో నూతన ఉగాది సందర్భంగా తొమ్మిది రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు అర్చకులు తెలిపారు. ఈనెల 9 నుంచి 17 వరకు రోజుకు ఒక్కో రకమైన 21 కిలోల పుష్పాలతో పుష్పయాగం శ్రీ హనుమద్గిరి పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సభ్యుల సమక్షంలో నిర్వహించబడుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు.
HYDలో విచ్చలవిడిగా నీటిని వినియోగిస్తున్నారు. భూరగ్భజలాలు అడుగంటడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. అయినా పబ్లిక్ తీరు మార్చుకోవడం లేదు. నిత్యం రాజధానిలో 448 మిలియన్ గ్యాలన్ల నీరు వాడుతున్నారు. అందులో 30 మిలియన్ గ్యాలన్లు వృథా చేస్తున్నారు. మంజీరా, కృష్ణ నుంచి ఒక్క కిలో లీటర్ నీటిని నగరానికి తరలించాలంటే రూ.45 నుంచి రూ. 50 వరకు ఖర్చువుతోందట. హైదరాబాదీ ఇకనైనా మేలుకో. SAVE WATER
HYDలో విచ్చలవిడిగా నీటిని వినియోగిస్తున్నారు. భూరగ్భజలాలు అడుగంటడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. అయినా పబ్లిక్ తీరు మార్చుకోవడం లేదు. నిత్యం రాజధానిలో 448 మిలియన్ గ్యాలన్ల నీరు వాడుతున్నారు. అందులో 30 మిలియన్ గ్యాలన్లు వృథా చేస్తున్నారు. మంజీరా, కృష్ణ నుంచి ఒక్క కిలో లీటర్ నీటిని నగరానికి తరలించాలంటే రూ.45 నుంచి రూ. 50 వరకు ఖర్చువుతోందట. హైదరాబాదీ ఇకనైనా మేలుకో.
SAVE WATER
సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్సిటీ విద్యార్థి ఆకుల అరుణ్ (23) మృతిచెందాడు. ఇస్నాపూర్ వెళ్లే దారిలో అరుణ్ ప్రయాణిస్తున్న బైకును ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈఘటనలో అరుణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు కామారెడ్డికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. పఠాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైతులను రెచ్చగొట్టి పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు మాజీ సీఎం కేసీఆర్ రైతు దీక్షల పేరుతో నటిస్తూ పంట పొలాలను పరిశీలిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. వైరాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని వివరించారు.
పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఓటు హక్కు ప్రాధాన్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు సాక్ష్యం యాప్ ద్వారా, అలాగే ఫారం 12-డిలో హోమ్ ఓటింగ్కి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో సోమవారం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో నియోజకవర్గ బీజేపీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహబూబ్నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో BRS లేదు.. దేశంలో కాంగ్రెస్ లేదని, కాంగ్రెస్, BRSకు ఓటువేస్తే నదిలో వేసినట్టే అని ఎద్దేవా చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను RTC కార్గో ద్వారా రూ.151 చెల్లిస్తే భక్తుల ఇండ్ల వద్దకు చేరుస్తామని ఉమ్మడి నల్లగొండ రీజినల్ మేనేజర్ ఎస్. శ్రీదేవి తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ.. ప్రజలు తమ దగ్గరలో వున్న టీఎస్ RTC లాజిస్టిక్స్ లో రూ. 151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులకు క్రోధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
వివిధ రకాల ట్యాక్స్ల పేరుతో పేద ప్రజలను మరింత పేదలుగా మార్చిన ఘనత బీజేపీ పార్టీది అని మంత్రి సీతక్క అన్నారు. బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో సీతక్క పాల్గొన్నారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. జీఎస్టీ పేరుతో పేద ప్రజలను బీజేపీ దోపిడీ చేస్తుందని మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.