India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చెన్నూరులో ఆదివారం రాత్రి జరిగిన ఓ పెళ్లి విందులో కత్తి పోట్లు కలకలం రేపాయి. పెళ్లిలో పలువురి మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో వారు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని BRS నేతలు తెలిపారు. సోమవారం గోషామహల్ పరిధి గన్ఫౌండ్రిలో BRS సమావేశం జరిగింది. ఈ సందర్భంగా BRS HYD అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ గడ్డ.. BRS అడ్డా అని అన్నారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. KCRతోనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు.
లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని BRS నేతలు తెలిపారు. సోమవారం గోషామహల్ పరిధి గన్ఫౌండ్రిలో BRS సమావేశం జరిగింది. ఈ సందర్భంగా BRS HYD అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ గడ్డ.. BRS అడ్డా అని అన్నారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. KCRతోనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు.
గ్రేటర్ HYDలో మొత్తం 185 చెరువులు ఉండగా వాటిలోని 50 తటాకాల్లో ప్రస్తుతం గుర్రపు డెక్క మొక్క దాదాపు 100% పరుచుకొని ఉంది. రెండేళ్లుగా ఆయా చెరువుల్లో గుర్రపు డెక్క వ్యర్థాలను తొలగించేందుకు తూతూ మంత్రంగా పనులు జరగగా.. దీనికి తోడు గుర్రపు డెక్కను తొలగించే FTC యంత్రాల కాంట్రాక్ట్ ఫిబ్రవరితో పూర్తయింది. దీంతో ఆ కొద్దిపాటి పనులు సైతం మూలన పడ్డాయి. మరీ అన్ని చెరువుల్లో ఎప్పుడు తొలగిస్తారో..? వేచి చూడాలి.
గ్రేటర్ HYDలో మొత్తం 185 చెరువులు ఉండగా వాటిలోని 50 తటాకాల్లో ప్రస్తుతం గుర్రపు డెక్క మొక్క దాదాపు 100% పరుచుకొని ఉంది. రెండేళ్లుగా ఆయా చెరువుల్లో గుర్రపు డెక్క వ్యర్థాలను తొలగించేందుకు తూతూ మంత్రంగా పనులు జరగగా.. దీనికి తోడు గుర్రపు డెక్కను తొలగించే FTC యంత్రాల కాంట్రాక్ట్ ఫిబ్రవరితో పూర్తయింది. దీంతో ఆ కొద్దిపాటి పనులు సైతం మూలన పడ్డాయి. మరీ అన్ని చెరువుల్లో ఎప్పుడు తొలగిస్తారో..? వేచి చూడాలి.
ప్రస్తుతం RR జిల్లాలో 22.08 ఎకరాల విస్తీర్ణంలో మామిడి పంట సాగువుతోంది. మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో అంతంత మాత్రంగానే సాగవుతున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాభావ పరిస్థితులకు తోడుగా ఎండ దెబ్బ శాపంగా మారింది. నీరు సరిపడా అందకపోవడం, అధిక ఉష్ణోగ్రతల వల్ల చెట్లు ఎండిపోవడంతో పాటు, తెగుళ్లు వ్యాప్తిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. బూడిద, పిండి నల్లి పురుగులు అధికంగా ఉన్నాయన్నారు.
RR, MDCL,VKB జిల్లాల్లో రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో గతంలో కొన్ని నిబంధనలు ఉండేవి. ఆధార్ నంబర్, మొబైల్ ఫోనుకు వచ్చే ఓటీపీ ద్వారా కొనుగోళ్లు జరిగేవి. అయితే అక్రమాలను అరికట్టేందుకు యాసంగి సీజన్ నుంచి (ఐరస్)కనుపాప స్కానింగ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇప్పటికే కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ కూడా అందజేశారు. దీన్ని అన్ని కేంద్రాల వద్ద అమలు చేయనున్నారు.
కేసుల సత్వర పరిష్కారం దిశగా RR జిల్లా వినియోగదారుల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. గత 55 రోజుల్లోనే చాలా కేసులను పరిష్కరించినట్లుగా తెలిపింది. రంగారెడ్డి జిల్లా కమిషన్లో రాష్ట్రంలోనే అధిక కేసులు నమోదవుతుంటాయి. మరోవైపు మార్చి నెల చివరి నాటికి రంగారెడ్డి జిల్లా కమిషన్లో రాష్ట్రంలోనే అధికంగా 1,405 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో నూతన కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
చిట్యాలలో శనివారం జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సమీపంలోని ఓ ఇంటిలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. గుంటూరుకు చెందిన బాణసంచా తయారీ కేంద్రం నిర్వహకుడు కోటేశ్వరరావు పేలుడులో తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంగతి తెలిసిందే.
కేసుల సత్వర పరిష్కారం దిశగా RR జిల్లా వినియోగదారుల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. గత 55 రోజుల్లోనే చాలా కేసులను పరిష్కరించినట్లుగా తెలిపింది. రంగారెడ్డి జిల్లా కమిషన్లో రాష్ట్రంలోనే అధిక కేసులు నమోదవుతుంటాయి. మరోవైపు మార్చి నెల చివరి నాటికి రంగారెడ్డి జిల్లా కమిషన్లో రాష్ట్రంలోనే అధికంగా 1,405 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో నూతన కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
Sorry, no posts matched your criteria.