Telangana

News July 26, 2024

నిజామాబాద్: TODAY NEWS HEADLINES

image

* బాన్సువాడ, ఎల్లారెడ్డిలో CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
* SRSP పునాదికి 60 ఏళ్లు అధికారుల సంబరాలు
* ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం ఒకరు దుర్మరణం
* పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి: కలెక్టర్ రాజీవ్ గాంధీ
* బడ్జెట్లో KMR జిల్లాకు అన్యాయం: BJP జిల్లా అధ్యక్షురాలు అరుణ తార
* నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రూ. 50 లక్షలు పట్టివేత
* SRSP కు వరద తాకిడి. నిజాంసాగర్‌కు స్వల్ప ఇన్ ఫ్లో

News July 26, 2024

RR: డిజిటల్ క్రాప్ సర్వే.. పంట వివరాలు ఆన్ లైన్లో..!

image

RR, MDCL,VKB జిల్లాల్లో డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు కసరత్తు జరుగుతుంది. గతంలో రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద 16 మండలాల్లో డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేశారు. పంట ఫొటో, రైతు ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. తద్వారా ఎవరు ఏ పంట..? ఎంత విస్తీర్ణంలో..? పండించారనేది లెక్క తేలనుంది. కేంద్ర ఆదేశాలతో ఇప్పటికే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అమలవుతోంది.

News July 26, 2024

ఉమ్మడి ఆదిలాబాద్.. నేటి CRIME REPORT

image

◆ ఆదిలాబాద్ : కట్నం విషయంలో భర్తకు జైలుశిక్ష
◆ ఆసిఫాబాద్ : ఆన్లైన్ మట్కా ఆడుతున్న వ్యక్తి అరెస్టు
◆ రెబ్బెన : గేదెలు తరలిస్తున్న నలుగురిపై కేసు
◆ బెల్లంపల్లి : గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
◆ కుబీర్ : RTC బస్సు కిందపడి మహిళ మృతి
◆ కాగజ్ నగర్ : ఇంటిగోడ కూలి.. మహిళ మృతి
◆ ఆదిలాబాద్ : ఫ్యాన్ కు ఉరేసుకొని యువకుడు సూసైడ్
◆ ముథోల్‌: గంజాయి పట్టివేత.. నిందితుల అరెస్ట్

News July 26, 2024

MBNR: జిల్లా వ్యాప్తంగా 16,913 కిలోల బెల్లం పట్టివేత

image

కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో రాష్ట్రానికి బెల్లం రవాణా అవుతున్న విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఆఫీసర్లను అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వారు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అయితే మే 18 నుంచి ఈనెల 11 వరకు ఉమ్మడి జిల్లాలో 16,913 కిలోల బెల్లం పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. 400 కిలోల పటికను పట్టుకోగా, ఈ కేసుల్లో 38 వెహికల్స్ సీజ్ చేశారు.

News July 26, 2024

అందోల్: 317 జీవోపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం

image

317 జీవోపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సచివాలయంలో సమావేశం అయ్యింది. గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక అందజేయాలని కమిటీ నిర్ణయించింది. ఎవరికైతే 317 జీవోలో అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో వారిని గుర్తించి వారి వివరాలను త్వరలో కమిటీకి అందజేయాలని అధికారులకు సూచించారు.

News July 26, 2024

BREAKING.. KNR: గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత

image

పెద్దాపూర్ <<13712552>>గురుకుల విద్యార్థి<<>> నేడు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పాఠశాలలో ఒకే రూంలో పడుకున్న ముగ్గురు విద్యార్థులకు పాము కాటు వేసిందని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థి గుణాధిత్య మృతి చెందగా.. మరో ఇద్దరు గణేశ్, హర్ష వర్ధన్‌లు అస్వస్థతకుగురై పరిస్థితి విషమించడంతో NZB ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయాన్ని దాచిపెట్టారంటూ స్కూల్ ప్రిన్సిపల్‌పై పలువురు విమర్శిస్తున్నారు.

News July 26, 2024

లక్ష్యం మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలి: కమిషనర్

image

లక్ష్యం మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. శుక్రవారం జోనల్ అడిషనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఆర్ఎంపీ ద్వారా చేపట్టిన రోడ్లకు సంబంధించిన ఏజెన్సీలతో చేసుకున్న అగ్రిమెంట్ డిసెంబర్ వరకు గడువు ఉన్నందున పెండింగ్‌లో ఉన్న మెయింటెనెన్స్ పనులు వెంటనే పూర్తి చేయించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. అవసరమైతే సమీక్షలు నిర్వహించాలన్నారు.

News July 26, 2024

సంగారెడ్డి: 28న ఉమ్మడి జిల్లా క్రికెట్ ఎంపికలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్16 ఎంపికలు ఈనెల 28న జూబ్లీ క్లబ్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 1-9-2008 నుంచి 31-8-2010 మధ్య జన్మించిన వారు అర్హులని చెప్పారు. ఆధార్ కార్డు, బోనాఫైడ్, జనన ధ్రువీకరణ పత్రం, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.

News July 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✏ప్రజలే బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడారు: మంత్రి జూపల్లి
✏జూరాలలో కొనసాగుతున్న వరద.. 47 గేట్లు ఎత్తివేత
✏CM సభా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే కసిరెడ్డి,కలెక్టర్
✏NGKL: ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి
✏రేపు గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్స్
✏దౌల్తాబాద్: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
✏NGKL,WNPT జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
✏ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి: హర్షవర్ధన్ రెడ్డి

News July 26, 2024

MHBD: మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు

image

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని డోర్నకల్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రామచంద్రనాయక్, నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రాజెక్టులు, చెక్ డ్యాములు, ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై మంత్రితో ఎమ్మెల్యేలు చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.