Telangana

News August 10, 2024

HYD: బీబీనగర్ AIIMS వైద్య సేవలు రిపోర్ట్

image

HYD శివారు బీబీనగర్ AIIMS 2023-24 సంవత్సరానికి సంబంధించి 3,65,395 మంది అవుట్ పేషెంట్లు, 7,953 మంది ఇన్ పేషెంట్లకు వైద్య సేవలు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 750 పడకల సామర్థ్యం ఉన్న ఈ సంస్థలో ప్రస్తుతం 20 స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ వంద మంది ఎంబీబీఎస్, 30 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు చదువుతున్నారు.

News August 10, 2024

కాసిపేట: కూతురి మృతిపై అనుమానం.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు

image

తన కూతురు రోషిని మృతిపై అనుమానం ఉందని తండ్రి తిరుపతి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. కాసిపేట మండలం స్టేషన్ పెద్దనపల్లికి చెందిన వెంకటేష్‌తో రోషినికి 3ఏళ్ల క్రితం వివాహం చేశారు. రోషినికి జ్వరం రాగా భర్త వెంకటేశ్ బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రామకృష్ణాపూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

News August 10, 2024

HYD: ఆశలన్నీ.. ఆగస్టు నెల పైనే..!

image

HYD, RR, MDCL, VKB ప్రాంతాల ప్రజలు ఆగస్టు నెల పైన ఆశలు పెట్టుకున్నారు. జూన్, జులై నెలల్లో పెద్దగా భూగర్భ జలమట్టాలు పెరగలేదు. 250 ప్రాంతాల్లో అధికారులు నిర్వహించిన ఫీజోమీటర్ తనిఖీల్లో HYD జిల్లాలో మేలో 9.42 మీటర్ల లోతుకు పడిపోతే, జూన్లో 8.56 మీటర్లకు మాత్రమే పెరిగింది. మరోవైపు రంగారెడ్డిలో మే నెలలో 14.06 నుంచి జూన్లో 13.99, మేడ్చల్ జిల్లాలో 13.99 నుంచి 12.89 మీటర్లకు స్వల్పంగా పెరిగాయి.

News August 10, 2024

HYD: ఆశలన్నీ.. ఆగస్టు నెల పైనే..!

image

HYD, RR, MDCL, VKB ప్రాంతాల ప్రజలు ఆగస్టు నెల పైన ఆశలు పెట్టుకున్నారు. జూన్, జులై నెలల్లో పెద్దగా భూగర్భ జలమట్టాలు పెరగలేదు. 250 ప్రాంతాల్లో అధికారులు నిర్వహించిన ఫీజోమీటర్ తనిఖీల్లో HYD జిల్లాలో మేలో 9.42 మీటర్ల లోతుకు పడిపోతే, జూన్లో 8.56 మీటర్లకు మాత్రమే పెరిగింది. మరోవైపు రంగారెడ్డిలో మే నెలలో 14.06 నుంచి జూన్లో 13.99, మేడ్చల్ జిల్లాలో 13.99 నుంచి 12.89 మీటర్లకు స్వల్పంగా పెరిగాయి.

News August 10, 2024

నిజామాబాద్: ఆగి ఉన్న లారీని ఢీ కొని వ్యక్తి మృతి

image

ఆగి ఉన్న లారీని ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగరంలోని ఆర్సపల్లి‌లో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. నగరంలోని నిజాం కాలానికి చెందిన అన్వర్(42) ఆర్సపల్లి బైపాస్ నుంచి కూరగాయల మార్కెట్‌కు వెళ్ళే మార్గ మధ్యంలో ఆగివున్న లారీని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

News August 10, 2024

విద్యుత్ షాక్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

ఖమ్మం జిల్లా వైరా మండలంలోని విప్పలమడకలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి బూరుగు సురేశ్ (29)విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మూత్ర విసర్జన చేసిన ప్రదేశంలో 11 కేవి అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఉండటంతో అతనికి విద్యుత్ షాక్ తగిలిన వెంటనే లైన్ ట్రిప్ అయినది. సబ్ స్టేషన్‌లో ఉన్న
సిబ్బంది 5 నిమిషాల తర్వాత లైన్ ఆన్ చేశారు. అక్కడే పడిపోయి ఉన్న సురేశ్‌కు మరోసారి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు.

News August 10, 2024

ధర్మసాగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన శనివారం ధర్మసాగర్ మండలం జానకిపురంలో చోటుచేసుకుంది. ధర్మసాగర్ సీఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మళ్లీకుదుర్ల గ్రామానికి చెందిన గురజాల మల్లారెడ్డి, సారంపెళ్లి అమరేందర్ రెడ్డి బైకుపై ధర్మసాగర్ వైపు వెళ్తుండగాఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 10, 2024

మిర్యాలగూడలో సినిమా షూటింగ్

image

మిర్యాలగూడ మండలం నందిపాడలో మా ఊరి ప్రేమ కథ చిత్రం షూటింగ్‌ను బీజేపీ నాయకులు మదన్మోహన్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. రచయిత, దర్శకులు అంజి అయాన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. శివాలయ నిర్మాణానికి వారాహి సంస్థ తరఫున ఐదు లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో రవీంద్ర కుమార్, వీటి యాదవ్, భార్గవ్, గిరి, రవి శంకర్, చారి పాల్గొన్నారు.

News August 10, 2024

NGKL: సొంత ఊరిపై మమకారం చూపిన కల్కి డైరెక్టర్

image

జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా పుట్టిన ఊరు, కన్నతల్లిని ఎప్పటికీ మరచిపోకూడదని కలెక్టర్ బాదావత్ సంతోష్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. తాడూరు మండలంలోని ఐతోల్‌లో కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సొంత గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.66 లక్షల నూతనంగా నిర్మించిన 4 అదనపు తరగతి గదులను జిల్లా కలెక్టర్, MLAతో నాగ్ అశ్విన్ కలిసి ప్రారంభించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అన్నారు.

News August 10, 2024

HYD: 3 వేల మంది నిపుణులతో హైటెక్ సిటీలో హబ్

image

HYDలోని హైటెక్ సిటీలో అమింగ్ ఇండియా సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాదాపుగా 3000 మంది నిపుణులతో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, డేటా సెన్స్, లైఫ్ సైన్సెస్ లాంటివి అనేక డిజిటల్ అంశాలపై బయోలాజికల్ సంస్థ సేవలు అందించనుంది. వరల్డ్ క్లాసు లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం అందుబాటులోకి రానున్నట్లు సీఎం తెలిపారు.