India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అర్వింద్ ఎంపీగా ఉండి జిల్లాకు చేసింది శూన్యమని బాజిరెడ్డి అన్నారు. ఆయనపై ఏడు సెగ్మెంట్ల ప్రజలు గుర్రుగా ఉన్నారన్నారు. ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి.. రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. అప్పుడేమో బాండ్ పేపర్ చూపించి ఓట్లు దండుకున్న అర్వింద్ మళ్లీ ఇప్పుడు ఇటీవల ఏదో జీవో కాపీ తీసుకువచ్చి ఎంపీగా గెలిపించాలని ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ముందస్తు ఇంటి పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీ కల్పించినట్లు మంచిర్యాల మున్సిపాలిటీ కమిషనర్ మారుతీ ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి 2025 వరకు ఇంటి పన్ను మొత్తం ఈ నెల 30లోపు ముందస్తుగా చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని సూచించారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
రంజాన్ మాసం నేపథ్యంలో ‘షబ్-ఎ- ఖదర్’ రాత్రి మరింత మహోన్నతమైంది. రంజాన్ మాసంలో 26వ ఉపవాసం(నేడు) రాత్రంతా భక్తి శ్రద్ధలతో ‘షబ్ -ఎ- ఖదర్’ జరుపుకుంటారు. HYD, ఉమ్మడి RR జిల్లా వ్యాప్తంగా జగ్నేకి రాత్(జాగారం) నిర్వహించుకునేందుకు ముస్లింలు విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిన్న రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆఖరి జుమాకు అల్విదా పలికారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్మెన్లు లేరు. గతంలో ఉన్న వారు పదవీ విరమణ పొందగా కొత్తవారి నియామకం జరగలేదు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల పాఠశాలల పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.
KNR జిల్లాలో శుక్రవారం KCR పర్యటించిన విషయం తెలిసిందే. అయితే KNR రూరల్ మండలం ముగ్దుంపూర్లో KCR పంట పొలాల సందర్శన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తమ చేతివాటం చూపించారు. KCR పంట చేను వద్దకు రాగానే రైతులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికేందుకు రాగా.. అదే అదనుగా దొంగలు నాయకుల జేబుల నుంచి డబ్బు, సెల్ ఫోన్ మాయం చేశారు. వీరిలో ఒకరిని పట్టుకొని చితకబాది డబ్బు తిరిగి తీసుకున్నారు.
చందాపూర్లోని ఆర్గానిక్స్ పరిశ్రమలో ఘటనా స్థలాన్ని నిన్న ఫోరెన్సిక్ లేబొరేటరీ AD వెంకట్రాజ్ పరిశీలించి ఉత్పత్తుల నమూనాలు సేకరించారు. సంగారెడ్డి MNR ఆస్పత్రిలో చందాపూర్కు చెందిన అశోక్సింగ్ చేతికి శస్త్రచికిత్స చేయగా మిగిలిన వారు ఇంటికెళ్లారని, సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో 1, HYDలో ముగ్గురు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో 6 మంది మృతిచెందగా 16 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
HYDలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ఠంగా కూకట్పల్లిలోని వివేకానందనగర్ ఆఫీస్ వద్ద 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మల్లాపూర్- 43 డిగ్రీలు, కుత్బుల్లాపూర్-42.7, గోల్కొండ, లంగర్ హౌస్, చర్లపల్లిలో-42.6, ముషీరాబాద్-42.3తో పాటు పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొంది. ప్రజలు అవసరమైతే బయటకు రావాలని సూచించింది.
HYDలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ఠంగా కూకట్పల్లిలోని వివేకానందనగర్ ఆఫీస్ వద్ద 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మల్లాపూర్- 43 డిగ్రీలు, కుత్బుల్లాపూర్-42.7, గోల్కొండ, లంగర్ హౌస్, చర్లపల్లిలో-42.6, ముషీరాబాద్-42.3తో పాటు పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొంది. ప్రజలు అవసరమైతే బయటకు రావాలని సూచించింది.
తుక్కుగూడ జన జాతర సభలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చే 23 ప్రత్యేక హామీలను కాంగ్రెస్ సిద్ధం చేసింది. కేంద్రంలో అధికారంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇవ్వనుంది. విభజన చట్టంలో ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఐటీఐఆర్ను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయనుంది. ఈ మేరకు నేడు ప్రత్యేక హామీలను రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి సభ వేదికపై ప్రకటించనున్నారు.
సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో గంజాయి విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. గుగులోతు విజయ అనే మహిళ గంజాయి తాగుడుకు అలవాటైంది. ఇదే క్రమంలో డబ్బు సంపాదనకు గంజాయి విక్రయిస్తోంది. చింతలపాలెం బస్టాండులో విజయను అరెస్టు చేసినట్లు ఎస్సై సైదిరెడ్డి తెలిపారు. ఆమె వద్ద 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.