Telangana

News September 26, 2024

ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. దసరా నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్నిస్థాయిల్లో క‌మిటీల ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో విధివిధానాలు రూపొందించాల‌ని సూచించారు.

News September 26, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ్యాంశాలు.!

image

☞ఉమ్మడి జిల్లాలో మంత్రుల పర్యటన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు
☞జిల్లాలో పలు పెండింగ్ ప్రాజెక్టులు పరిశీలించిన మంత్రులు
☞నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా పార్మాసిస్ట్ డే వేడుకలు
☞కల్వకుర్తి: ఉదృతంగా ప్రవహిస్తున్న దుందుభి నది
☞వనపర్తి జిల్లా లో కానిస్టేబుల్ మిస్సింగ్
☞పలు జిల్లాలో ఘనంగా దీన్ దయల్ జయంతి
☞పలు మండలలో బాధ్యతలు స్వీకరించిన నూతన MEOలు
☞జోగులాంబ శక్తిపీఠాం దర్శించుకున్న భక్తులు

News September 26, 2024

కోయిల్ సాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత

image

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు MBNR, నారాయణపేట జిల్లాల సరిహద్దుగా ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టు జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు బుధవారం కోయిల్ సాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లను ఓపెన్ చేసి వరద నీటిని దిగువకు వదిలినట్లు తెలిపారు. ఎగువన ఉన్న మద్దూరు, దౌల్తాబాద్ మండలాల నుంచి వరద ఉద్ధృతి మరింత పెరిగితే ఇతర గేట్లను ఎత్తే అవకాశం ఉందని సూచించారు. బండర్ పల్లి వాగుకు వరద కొనసాగుతుంది.

News September 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వడ్డేలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ సిరిసిల్ల జిల్లాలో వ్యక్తి హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు.
@ జగిత్యాలలో పోలీస్ డ్యూటీ మీట్‌ను ప్రారంభించిన ఎస్పీ.
@ గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.
@ మెట్ పల్లిలో గంజాయి విక్రయించిన వ్యక్తి రిమాండ్.

News September 26, 2024

ఎస్సారెస్పీ అప్డేట్.. 2 గేట్ల ద్వారా నీటి విడుదల

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నేడు ఉదయం 7 గేట్లు ఎత్తిన అధికారులు సాయంత్రం వరకు 5 గేట్లు మూసి 2 గేట్ల ద్వారా 33,318 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల(80.5TMC)కు గాను, ప్రస్తుతం 1091 అడుగుల (80.501TMC)ల నీరు నిల్వ ఉందన్నారు.

News September 25, 2024

సంగారెడ్డి: డీఎస్సీ 2008 సెలక్షన్ జాబితా విడుదల

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని డీఎస్సీ 2008 అభ్యర్థుల సెలక్షన్ జాబితాను https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్సైట్లో ఉంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27 నుంచి జిల్లా విద్యాధికారి కార్యాలయంలో జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు.

News September 25, 2024

సంగారెడ్డి: కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేయండి..

image

జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కొనుగోలు కేంద్రాలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వచ్చే నెల 25వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, సివిల్ సప్లై డీఎం కొండల్ రావు పాల్గొన్నారు.

News September 25, 2024

NLG: ప్రాజెక్టుల పెండింగ్ పనులను వేగవంతం చేయాలి: JC

image

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద భూ సేకరణ, పునరావాస కేంద్రాల పనులకు సంబంధించిన పెండింగ్ పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించుకొని పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పునరావాస కేంద్రాలు, భూ సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టు పనులన్నింటిని వేగవంతం చేయాలని తెలిపారు.

News September 25, 2024

భద్రాద్రి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం రోడ్డు భద్రతపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలన్నారు.

News September 25, 2024

మాదిగల రెండో విడత మేలుకొలుపు యాత్ర

image

మాదిగల రెండో విడత మేలుకొలుపు యాత్రకి సంబంధించిన కరపత్రాలను డా.పిడమర్తి రవి బాచుపల్లి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఈ నెల27, 28న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, 30, 1వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్‌లో ఈ యాత్ర జరుగనున్నట్లు తెలంగాణ మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చిరుమర్తి రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరారు.