Telangana

News April 6, 2024

HYD: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని మోసం!

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన రతన్‌కుమార్‌(22)కు తుకారాంగేట్‌‌కు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఓయో లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భిణి కావడంతో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించగా.. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ అయ్యాడు.

News April 6, 2024

CMPFలో అందుబాటులో ఆన్ లైన్ సేవలు

image

బొగ్గు గని కార్మికుల భవిష్య నిధి(CMPF) సంబంధించిన ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చాలాకాలంగా CMPF-ట్రస్ట్ బోర్డులో ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చర్చించిన మేరకు ఇటీవల C-కేర్ పోర్టల్‌ను అధికారులు ప్రారంభించారు. పింఛన్‌తో పాటు CNPF చెల్లింపులకు సంబంధించి ప్రతి అంశాల సేవలు ఆన్‌లైన్లో పొందే అవకాశం ఉంది. దీంతో రిటైర్డ్ కార్మికులకు పారదర్శకంగా సేవలు అందే అవకాశం ఏర్పడింది.

News April 6, 2024

MBNR: ఓటర్లకు కలెక్టర్ల సూచనలు

image

✔ఫారం-12 నింపి, ఓటర్ కార్డు జత చేసి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ✔పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 15 లాస్ట్
✔మే 3 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ అందజేసిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్
✔18 ఏళ్ల వయసు ఉంటే నూతన ఓటరుగా దరఖాస్తు
✔ఏప్రిల్ 14లోపు నూతన ఓటర్ నమోదు
✔మే 13వ తేదీన లోక్ సభ ఎన్నికల పోలింగ్

•ఈ మేరకు ఉమ్మడి జిల్లా రిటర్నింగ్ అధికారులు, కలెక్టర్లు సూచించారు.

News April 6, 2024

KMM: ఆర్టీసీకి ఫుల్ ఆదాయం

image

పెళ్లిళ్లతో పాటు వరుస సెలవులు ఆర్టీసీకి కలిసొస్తున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో సంస్థకు ఆదాయం సమకూరుతోందని అధికారులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు తోడు ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో నిన్నటి వరకు ఖమ్మం రీజియన్ రూ.1,45,08,008 ఆదాయం సమకూరినట్లు రీజనల్ మేనేజర్ తెలిపారు.

News April 6, 2024

ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు

image

JEE మెయిన్స్ సెషన్-2 పరీక్షలు ఉమ్మడి పాలమూరులో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఫాతిమా విద్యాలయంలో ఉదయం పూట నిర్వహించిన పరీక్షకు 147మందికి గాను 135మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 147మందికి గాను 134మంది హాజరయ్యారు. ధర్మాపూర్ సమీపంలోని జేపీఎన్సీఈ కళాశాలలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 180మందికి గాను 158మంది, మధ్యాహ్నం 180కి గాను 162 మంది హాజరయ్యారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులు 9 మందికి 1 గైర్హాజరయ్యారు.

News April 6, 2024

వరంగల్ జిల్లాలో 43,594 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్లు

image

ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల కోసం ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో వరంగల్ జిల్లాకు సంబందించిన గ్రాడ్యుయేట్స్ ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 43,594 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో 26,907 మంది పురుషులు, 16,687 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

News April 6, 2024

నేడు తుక్కుగూడ సభ.. పాలమూరు వాహనదారులకు అలర్ట్

image

కాంగ్రెస్‌ పార్టీ శనివారం తుక్కుగూడలో తలపెట్టిన జనజాతర బహిరంగ సభ నేపథ్యంలో.. సభకు వచ్చే వాహనదారులకు, సాధారణ వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పలు సూచనలు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. MBNR నుంచి వచ్చే వాహనాలు ఓఆర్‌ఆర్‌ బెంగుళూరు టోల్‌ నుంచి రావిర్యాల టోల్‌ వద్దనుంచి ఫ్యాబ్‌సిటీ వద్ద పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకోవాలని సూచించారు.

News April 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✏నేడు PUలో జాతీయ సదస్సు
✏ధరూర్: నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్
✏వనపర్తి: నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(శని)-6:38,సహార్(ఆది)-4:45
✏నేడు ‘జనజాతర బహిరంగ సభ’.. ఉమ్మడి జిల్లా నుంచి తరలి వెళ్ళనున్న నేతలు, కాంగ్రెస్ శ్రేణులు
✏నేడు MVSలో ‘వచన కవిత’ కార్యాశాల
✏నేడు పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’.. హాజరుకానున్న నేతలు
✏పలు నియోజకవర్గంలో పర్యటించనున్న MBNR&NGKL ఎంపీ అభ్యర్థులు

News April 6, 2024

వరంగల్: రేపు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

image

వరంగల్ జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఈనెల 7న పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈవో డాక్టర్ ఎండి.అబ్దులై తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని మూడు మోడల్ స్కూళ్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News April 6, 2024

ఆదిలాబాద్: ’11 మండలాల రైతులను ముంచేశాడు’

image

ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తపాలా శాఖ IPPB (ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు)లో జరిగిన అక్రమాల తీరుపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐపీపీబీ మేనేజర్ విజయ్ జాదవ్ జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లోని 74 మంది రైతులకు చెందిన పత్తి పంట విక్రయాల తాలూకూ డబ్బులను వారి ఖాతాల నుంచి తన సొంత ఖాతాల్లోకి అక్రమంగా మళ్లించుకున్నట్లు తేల్చారు. ఇలా రూ.1.16 కోట్లు ఆయన స్వాహా చేసినట్లు తేల్చారు.

error: Content is protected !!