India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ- విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడనుంది. లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఈ నేపథ్యంలో పలు పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయా కలెక్టరేట్లు కేంద్రంగా దీన్ని నిర్వహిస్తున్నారు.
కేయూ పరిధిలో బీపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల16 నుండి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి తెలిపారు. 16న పేపర్-1 హిస్టరీ, ప్రిన్సిపుల్స్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, 18న పేపర్-2 అనాటమీ ఫిజియాలజీ, 20న పేపర్ -3ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, 22న పేపర్-4 ఒలింపిక్ మూవ్మెంట్ పరీక్షలు ఉంటాయన్నారు.
HYD ఉప్పల్లో నేడు SRH VS CSK మధ్య IPL మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ సా.6 గంటల నుంచి రా.11:30 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఘట్కేసర్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, కొండాపూర్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, జీడిమెట్ల, KPHB తదితర ప్రాంతాల నుంచి బస్ సర్వీసులుంటాయని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు మెట్రో టైమింగ్స్ కూడా పొడిగిస్తారు. SHARE IT
సంతకం ఫోర్జరీ కేసులో గురువారం సదరు ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేశారు. NZBలోని కిసాన్ సాగర్ PHCలో పనిచేస్తున్న జూ.అసిస్టెంట్ శ్రీనివాస్కు జక్రాన్పల్లి PHC ఇన్ఛార్జ్గా నియమించారు. ఇద్దరు ఉద్యోగులకు GPF ఇప్పించే క్రమంలో పలు పత్రాలపై వైద్యాధికారి రవీందర్ సంతకం ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని ఆయన 20 రోజుల క్రితం జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లడంతో శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు.
మంచిర్యాలలోని కార్మల్ కాన్వెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్పాట్ కేంద్రంలో పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. అయితే మొదటి రోజు విధులకు కారణం లేకుండా గైర్హాజరైన ముగ్గురు ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. సదురు ఉపాధ్యాయులను వివరణ కోరగా వారు స్పందించకపోవడంతో డీఈవో యాదయ్య వారిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
HYD ఉప్పల్లో నేడు SRH VS CSK మధ్య IPL మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ సా.6 గంటల నుంచి రా.11:30 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఘట్కేసర్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, కొండాపూర్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, జీడిమెట్ల, KPHB తదితర ప్రాంతాల నుంచి బస్ సర్వీసులుంటాయని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు మెట్రో టైమింగ్స్ కూడా పొడిగిస్తారు. SHARE IT
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు, ప్రాజెక్టుల్లో నీరు ఇంకిపోతుండగా బీళ్లను తలపిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం భూగర్భ నీటిమట్టం మరింత లోతుకు పోయింది. గతేడాది జిల్లాలో భూగర్భ నీటిమట్టం 9.47 మీటర్లు ఉండగా ఈ ఏడాది మార్చి వరకు 9.91 మీటర్ల లోతుకు వెళ్లిందని భూగర్భ జల శాఖ అధికారులు తెలిపారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన HNK జిల్లా వంగరలో గ్రామ చెరువు నిండి అలుగు పారుతూ రోడ్డు పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తుంటుంది. దీంతో రాకపోకలు స్తంభిస్తాయి. అయితే గతంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ వంతెన నిర్మిస్తామని చెప్పినప్పటికీ జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా మంత్రులు చొరవ తీసుకుని వంతెన నిర్మిస్తారని గ్రామస్థులు ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ నేటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:30 గంటలకు ముకుదమ్పుర్ గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బోయిన్పల్లి, చొప్పదండి మండలాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. 3 గంటలకు శభాష్పల్లిలో మిడ్ మానేరును సందర్శిస్తారు. 4 గంటలకు సిరిసిల్లలో ప్రెస్ మీట్లో పాల్గొంటారు.
నేడు సిద్దిపేట జిల్లాలో పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ మరియు RES శాఖ ప్రిన్సిపల్ సెక్రేటరీ సందీప్ కుమార్ సుల్తానియా పర్యటించనున్నారు. గజ్వేల్ మండలం అక్కారంలో 40 ఎంఎల్ సంప్ హౌజ్, కుకునూరుపల్లి మండలం తిప్పారం వద్ద మల్లన్నసాగర్ తాగునీటి పంప్ హౌజ్, మంగోల్ లోని 540 డబ్ల్యూటీపీని సందర్శించనున్నారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షలో నిర్వహించి, కొండపాక HMWSS సంప్ హౌజ్ ను సందర్శించనున్నారు.
Sorry, no posts matched your criteria.