Telangana

News April 4, 2024

HYD: అంబులెన్స్ వాహనాల సంఖ్య పెంచాలని డిమాండ్

image

HYD జిల్లాలో 36, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 29 అంబులెన్స్‌లు ఉన్నాయి. 108కి కాల్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ చెబితే గాని ఒక్కోసారి రావడం లేదని, HYD నగర శివారు మారుమూల ప్రాంతాలకు ఆలస్యమవుతుందని పలువురు ఆరోపించారు. మరోవైపు కొందరి నుంచి రాంగ్ కాల్స్ వస్తున్నట్లుగా 108 సిబ్బంది తెలియజేశారు. అత్యవసర సేవలను మరింత మెరుగుపరిచేందుకు అంబులెన్స్ వాహనాల సంఖ్య పెంచాలని పలువురు కోరారు.

News April 4, 2024

యాదాద్రి క్షేత్రంలో రేపు చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండిహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

News April 4, 2024

HYD: అంబులెన్స్ వాహనాల సంఖ్య పెంచాలని డిమాండ్

image

HYD జిల్లాలో 36, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 29 అంబులెన్స్‌లు ఉన్నాయి. 108కి కాల్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ చెబితే గాని ఒక్కోసారి రావడం లేదని, HYD నగర శివారు మారుమూల ప్రాంతాలకు ఆలస్యమవుతుందని పలువురు ఆరోపించారు. మరోవైపు కొందరి నుంచి రాంగ్ కాల్స్ వస్తున్నట్లుగా 108 సిబ్బంది తెలియజేశారు. అత్యవసర సేవలను మరింత మెరుగుపరిచేందుకు అంబులెన్స్ వాహనాల సంఖ్య పెంచాలని పలువురు కోరారు.

News April 4, 2024

పాలమూరు TODAY టాప్ న్యూస్

image

✒అచ్చంపేట: ప్రభుత్వ ఆస్పత్రిలో 10 కిలోల కణితి తొలిగింపు
✒బిజినేపల్లి:బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి
✒’తుక్కుగూడ సభను విజయవంతం చేయాలి’: కాంగ్రెస్ నేతలు
✒ట్రాక్టర్,ట్యాంకర్ ఢీ..NRPT వాసి మృతి
✒ఏప్రిల్ 6న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు.. సద్వినియోగం చేసుకోండి:NRPT కలెక్టర్
✒GDWL:తనిఖీల్లో..రూ.4,73,500 నగదు స్వాధీనం
✒తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కలెక్టర్లు
✒MBNR:మళ్లీ తెరపైకి వచ్చిన MLAల కొనుగోలు ఎపిసోడ్

News April 4, 2024

హన్మకొండ: ట్రాఫిక్ మళ్లింపు

image

నయీంనగర్ పెద్ద మోరీని ఈనెల 5న అధికారులు కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీని స్థానంలో రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే 3 నెలలపాటు నయీం నగర్ రోడ్డు పై రాకపోకలు బంద్ కానున్నాయని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈనెల 5 నుంచి 3 నెలల పాటు రాకపోకలు పెగడపల్లి డబ్బాల నుంచి హన్మకొండకు వెళ్లాలని అన్నారు.

News April 4, 2024

సీఎం నివాసంలో పాలమూరు నేతల సమావేశం

image

హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశము నిర్వహించారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ గెలుపు తదితర విషయాలను చర్చించామన్నారు. రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించినట్లు తెలిపారు. భారీ బహిరంగ సభకు సోనియాగాంధీని రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలియజేశారు.

News April 4, 2024

NZB: కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు ఉత్కృష్ట అవార్డు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ నవాతే శ్రీనివాస్ (PC 1917)కు ఉత్కృష్ట అవార్డు వరించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని తెలంగాణ పోలీస్ అకాడమీలో స్విమ్మింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈయన సేవ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. ఉత్తమ సేవలకు గాను తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్తా చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.

News April 4, 2024

HYD: తండ్రిని హత్య చేసిన కొడుకు

image

డ్రగ్స్‌కు బానిసగా మారిన కొడుకు.. తనను మందలించినందుకు కన్న తండ్రినే హత్య చేశాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధి తుర్కయంజాల్‌లో జరిగింది. ఆరెంజ్ అవెన్యూలో ఓ ఇంట్లో ఉంటున్న తిరుపతి రవీందర్(65)ను పెట్రోల్ పోసి అతడి కుమారుడు నిప్పంటించాడు. మంటలను తట్టుకోలేక అక్కడికక్కడే రవీందర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కొడుకు కోసం గాలిస్తున్నారు.

News April 4, 2024

పెబ్బేరు యార్డులో ప్రమాదం.. ఆ కిటికీ ఎలా తెరుచుకుంది..?

image

పెబ్బేరు మార్కెట్‌ యార్డులో జరిగిన ప్రమాదంలో రూ.కోట్ల విలువైన గన్నీ బ్యాగులు తగలబడిన వ్యవహారంలో ఇంటి దొంగల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి గురైన గోదాం రెండో కంపార్ట్‌మెంట్‌లోని ఒక కిటికీ ప్రమాదం జరిగిన సమయంలో ఎలా తెరుచుకుని ఉందనే విషయంలో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇనుప కిటికీలు బయట నుంచి తెరవడం అసాధ్యమని ఘటనా స్థలాన్ని సందర్శించిన అధికారులు అంటున్నారు.

News April 4, 2024

HYD: తండ్రిని హత్య చేసిన కొడుకు

image

డ్రగ్స్‌కు బానిసగా మారిన కొడుకు.. తనను మందలించినందుకు కన్న తండ్రినే హత్య చేశాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధి తుర్కయంజాల్‌లో జరిగింది. ఆరెంజ్  అవెన్యూలో ఓ ఇంట్లో ఉంటున్న తిరుపతి రవీందర్(65)ను పెట్రోల్ పోసి అతడి కుమారుడు నిప్పంటించాడు. మంటలను తట్టుకోలేక అక్కడికక్కడే రవీందర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కొడుకు కోసం గాలిస్తున్నారు.

error: Content is protected !!