India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ భవన్లో ఇవాళ జరిగిన ఇఫ్తార్ విందు వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్తో కలిసి ఇఫ్తార్ను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
@ తంగళ్ళపల్లి మండలంలో ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య. @ ధర్మపురిలో కవల లేగ దూడలకు జన్మనిచ్చిన ఆవు. @ జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి కిందపడి యువకుడి మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈవీఎం, వివి ప్యాట్ల ర్యాండమైజేషన్ పూర్తి. @ మెట్పల్లి మండలం జగ్గాసాగర్ లో పట్టపగలే చోరీ. @ ఇబ్రహీంపట్నంలో 2 అక్రమ ఇసుక రావణ ట్రాక్టర్లు పట్టివేత. @ జగిత్యాలలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.
వనపర్తి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈనెల 6న ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి కౌన్సిలర్లకు సమాచారం ఇచ్చారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన 8 మంది కౌన్సిలర్లు క్యాంప్కు వెళ్లారు. వీరిలోనే పుట్టపాకల మహేశ్ ఛైర్మన్, పాకనాటి కృష్ణ వైస్ ఛైర్మన్ పోటీలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్న 9 మంది వీరికి మద్దతు ఇస్తే గెలుపుకు పక్కా అంటున్నారు.
తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం మండలంలోని బోడు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బోడు గ్రామానికి చెందిన కల్తీ చంద్రశేఖర్ కుమార్తెని తల్లి మందలించడంతో మంగళవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
♥CM రేవంత్ రెడ్డిని కలిసిన జవాన్ యాదయ్య కుటుంబం
♥MBNR:CMను కలిసిన కిన్నెర మొగులయ్య
♥MBNR:తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్ శృతి ఓజా నియామకం
♥జాగ్రత్త..ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఎండలు
♥మద్దూర్: పెళ్లైన మూడు రోజులకే సూసైడ్
♥పలుచోట్ల వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం
♥పాలమూరు ప్రాజెక్టు గురించి రేవంత్ ఏనాడూ మాట్లాడలే: డీకే అరుణ
♥బీఆర్ఎస్ విజయం ఖాయం:RS ప్రవీణ్ కుమార్
♥సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:DSP
మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతన్పల్లికి గ్రామానికి చెందిన అరికెల కృష్ణ(36) కనిపించకుండా పోయాడు. మంగళవారం భార్య అనితతో గొడవ పడిన కృష్ణ ఫోన్ ఇంట్లో పెట్టి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నల్గొండలోని అద్దంకి నార్కెట్పల్లి బైపాస్ పై పానగల్ సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికు తెలిపిన వివరాల ప్రకారం.. షిఫ్ట్ కారును ధాన్యం ట్రాక్టర్ ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డాడు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
2023 ఎలక్షన్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆసియాతస్నిం సుల్తానా గంజాయి అమ్ముతుండగా ఈరోజు అరెస్ట్ చేశామని HYD కంచన్బాగ్ పోలీసులు తెలిపారు. పాతబస్తీలోని హాఫీజ్ బాబానగర్ సి బ్లాక్లో నివసించే ఆసియాతస్నిం సుల్తానా గత ఎలక్షన్లో చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీపై పోటీ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాగునీటిని పర్యవేక్షించేందుకు ఐఏఎస్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తాగునీటిని పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా శరత్ను నియమించారు.
పార్లమెంట్ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ కో-ఆర్డినేటర్లను TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియమించారు. హన్మకొండ జిల్లా నుంచి వరంగల్ పశ్చిమ – సంగీత, వరంగల్ తూర్పు- జాలి కమలాకర్ రెడ్డి, కుందూరు వెంకటరెడ్డి – వర్ధన్నపేట, మార్కం విజయ్ కుమార్ – భూపాలపల్లి, కూచన రవళి రెడ్డి – ములుగు, పింగిళి వెంకట్రామిరెడ్డి – స్టేషన్ ఘనపూర్, డా. పులి అనిల్ కుమార్ – నర్సంపేట, పరకాల – అశోక్ రెడ్డిని నియమించారు.
Sorry, no posts matched your criteria.