Telangana

News August 29, 2024

రాష్ట్రంలోనే HYD జిల్లాలో అత్యధిక MSME యూనిట్లు

image

రాష్ట్రంలోనే అత్యధికంగా HYD జిల్లాలో MSME యూనిట్లు ఉన్నాయి. జిల్లాలో 1,68,077 MSMEలు ఉంటే.. ఇందులో 1,33,937 యూనిట్లు సర్వీస్ విభాగంలో ఉన్నాయి. మిగతా 34,140 యూనిట్లు ఉత్పత్తి రంగంలో ఉన్నాయి. ఇందులో సూక్ష్మ సంస్థలు అత్యధికంగా 1,56,642 యూనిట్లు పనిచేస్తున్నాయి. చిన్న తరహావి 9,813, మధ్య తరహావి 1,622 దాకా ఉన్నాయని అధికారులు తెలిపారు.

News August 28, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!!

image

✒WNPT: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
✒మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం గేట్లు
✒పలు మండలాల్లో రుణమాఫీఫై స్పెషల్ డ్రైవ్
✒వక్ఫ్ భూములపై ఫిర్యాదులు JPC కమిటీకి వివరిస్తా: డీకే అరుణ
✒నాగర్‌కర్నూల్: సెప్టెంబర్ 3న ఉద్యోగ మేళా
✒హైడ్రా.. పలు జిల్లాల్లో అక్రమ నిర్మాణాలపై ఫోకస్
✒ఓటు హక్కును నమోదు చేసుకోండి: MROలు
✒గణపతి, మీలాద్-ఉన్-నబి శాంతియుతంగా జరుపుకోండి: SIలు
✒DSC 508 ఖాళీలు..14,577 మంది ఎదురుచూపు

News August 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ చందుర్తి పోలీస్ స్టేషన్లో శునకానికి అంత్యక్రియలు.
@ తంగళ్లపల్లి మండలంలో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్.
@ ముస్తాబాద్ మండలంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్.
@ గంభీరావుపేట మండలంలో నాటు తుపాకులు తయారు చేస్తున్న ముగ్గురికి అరెస్ట్.
@ వేములవాడ రాజన్న అన్నదాన ట్రస్ట్‌కు భక్తుడి రూ.లక్షల విరాళం.
@ వీర్నపల్లి మండలం కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్.

News August 28, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్

image

> MLG: మొదటి అడ్మిషన్ తీసుకున్న రాజస్థాన్ విద్యార్థి
> WGL: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్
> WGL: మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర
> BHPL: జాతీయ రహదారి పనులకు శ్రీకారం
>HNK: 1న సబ్ జూనియర్స్ ఖోఖో ఎంపికలు
> WGL: హైదరాబాద్ తరహా.. వరంగల్‌లో వాడ్రా ?
>NSPT: గిరిజన కుటుంబానికి కేటీఆర్ ఆర్ధిక సహాయం
> MLG: కానిస్టేబుల్‌ను పరామర్శించిన గవర్నర్

News August 28, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు..

image

*NZB రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి* నందిపేట్ లో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి* ఎల్లారెడీ విద్యుత్ షాక్ తో చిరుత మృతి.. పాతిపెట్టిన రైతు* పిట్లం డాక్టర్ ని నిర్బంధించిన రోగి* కౌలాస్ లో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి* NZB, GGH ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తి మృతి* కామారెడ్డి చికిత్స పొందుతూ వ్యాపారి మృతి* NZB రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి* కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత*

News August 28, 2024

HYD: మూసీనదికి 50 మీటర్ల బఫర్ జోన్ ఖరారు!

image

మూసీనదికి 50 మీటర్ల బఫర్ జోన్ సరిహద్దుగా నిర్ణయించి నిర్మాణాలకు NOC పత్రాలు జారీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ HYD పరిధిలో మూసీకి ఇరువైపులా పలు భారీ నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తులు LOCల కోసం పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. బఫర్ జోన్ నిర్ణయంతో.. మూసికి 50 మీటర్ల సరిహద్దు వరకు నిర్మించిన అక్రమ నిర్మాణాలను త్వరలో కూల్చివేయనున్నారు.

News August 28, 2024

RR జిల్లాలో లక్షకు పైగా MSME యూనిట్లు

image

లక్షకు పైగా MSMEలు ఉన్న జిల్లాల్లో రంగారెడ్డి రెండో స్థానంలో ఉంది.ఇక్కడ 1,09,164 యూనిట్లు ఉండగా.. అందులో 87,376 సేవా రంగానికి చెందినవే.మిగిలిన 21,788 ఉత్పత్తి రంగంలో పనిచేస్తు న్నాయి.సూక్ష్మ సంస్థల సంఖ్యనే 1,04,846గా ఉంది. రూ.కోటిలోపు పెట్టుబడి, రూ.5 కోట్లలోపు టర్నోవర్ కల్గిన వాటిని సూక్ష్మ సంస్థలుగా పరిగణిస్తారు.జూన్ 2024 వరకు ఉన్న వివరాల ప్రకారం చిన్న తరహా 3,866 ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News August 28, 2024

HYD: 20 పార్కుల ఏర్పాటుకు HMDA ప్రణాళిక

image

HYD నగర శివారులో ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు 20 పార్కులకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే కొత్వాల్ గూడలో 105 ఎకరాల్లో పురోగతిలో ఉండగా, ఇక శంషాబాద్, తెల్లాపూర్, గాజులరామారం లోనూ ఏర్పాటు చేయనున్నారు. ఆయా పార్కులలో సకల వసతులు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పిల్లలకు ఆట సామాగ్రితో పాటు, ఇతరత్ర అందుబాటులో ఉంచనున్నారు.

News August 28, 2024

యూపీ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన మంత్రి తుమ్మల

image

రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహిని బుధవారం ITC కోహినూర్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై ఇరురాష్ట్రాల మంత్రులు చర్చించారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం తీసుకొంటున్న చర్యలను మంత్రి తుమ్మల యూపీ మంత్రికి వివరించారు.

News August 28, 2024

HYD: కరెంట్ షాక్ తగిలి చనిపోతే..?

image

గ్రేటర్ HYD పరిధిలో వర్షాకాలం వేళ కరెంట్ స్తంభాలు, తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు..
✓విద్యుదాఘాతంతో మృతిచెందిన కుటుంబానికి పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు ✓శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.5 లక్షలు
✓తీవ్రంగా గాయ పడితే రూ.లక్ష, స్వల్పంగా గాయపడితే రూ. 25 వేలు చెల్లిస్తారు
✓ప్రమాద బాధితులకు వైద్య ఖర్చులు కూడా అందిస్తారు. ✓ఆస్తినష్టం జరిగినా పరిహారం చెల్లిస్తారు.