Telangana

News April 2, 2024

ఖమ్మం: లారీ, ట్రాక్టర్ ఢీ.. కూలీ మృతి

image

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఓ లారీ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న కూలీ జుజ్జునూరి మాధవరావు(53) అక్కడికక్కడే మృతి చెందాడు. వరి గడ్డి లోడుతో నాచారం నుంచి దిద్దుపూడి వెళ్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మాధవరావు దిద్దుపూడి గ్రామానికి చెందిన కూలీగా గుర్తించారు.

News April 2, 2024

NZB: విషాదం.. కుప్పకూలి మహిళ మృతి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట బస్టాండ్ వద్ద ఓ మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీ తాగిన అనంతరం చెట్టుకింద కూర్చున్న మహిళ ఛాతి నొప్పి వస్తుందంటూ అక్కడే కుప్పకూలి చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలు కామారెడ్డి మండలం తిమ్మానగర్‌కు చెందిన గుర్రాల కళవ్వగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News April 2, 2024

నల్గొండలో KTR వ్యాఖ్యలపై మీ కామెంట్..

image

ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ సీట్లు మనవే అని నల్గొండలో నిర్వహించినBRS సన్నాహక సమావేశంలో KTR అన్నారు. ‘నల్గొండ, మిర్యాలగూడ, కోదాడను ఎంతో అభివృద్ధి చేశాం. మూడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాం. జిల్లాలో ఫ్లోరోసిస్‌ రూపుమాపడంతోపాటు సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్లు తెచ్చాం. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోలేకపోయాం. NLG కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలున్నారు’ అన్న KTR వ్యాఖ్యలపై మీ కామెంట్..

News April 2, 2024

MDK: విషాదం.. కుప్పకూలి మహిళ మృతి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట బస్టాండ్ వద్ద ఓ మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీ తాగిన అనంతరం చెట్టుకింద కూర్చున్న మహిళ ఛాతి నొప్పి వస్తుందంటూ అక్కడే కుప్పకూలి చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలు కామారెడ్డి మండలం తిమ్మానగర్‌కు చెందిన గుర్రాల కళవ్వగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News April 2, 2024

వరంగల్ మార్కెట్‌లో పలు ఉత్పత్తుల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు పలు ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. నం.5 రకం మిర్చి క్వింటాకి రూ.13 వేలు, సింగిల్ పట్టి రకం క్వింటాకు రూ.42,500 పలికింది. అలాగే మక్కలు క్వింటాకు రూ.2,175 ధర పలికాయి. కాగా గతవారంతో పోలిస్తే ఈరోజు మక్కల ధర భారీగా తగ్గింది. ఎండ తీవ్రత నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 2, 2024

వైద్య కళాశాలలో బోధన సిబ్బంది పోస్టులకు ఇంటర్వ్యూ

image

మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన(కాంట్రాక్ట్) భర్తీ చేయుటకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ లకావత్ వెంకట్ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 6న ప్రభుత్వ వైద్య కళాశాల మహబూబాబాద్‌లో ఉ. 10 గంటల నుంచి సా.4 గంటల వరకు హాజరు కావాలన్నారు. వివరాలకు http://gmcmahabubabad.org/ సంప్రదించాలన్నారు.

News April 2, 2024

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నామని ప్రిన్సిపల్ మంగళవారం తెలిపారు. ప్రొఫెసర్స్- 5, అసోసియేట్ ప్రొఫెసర్స్- 17, అసిస్టెంట్ ప్రొఫెసర్స్- 10, సీనియర్ రెసిడెంట్స్- 4, ట్యూటర్స్- 11 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి గలవారు ఈ నెల 4న ఉదయం 10 గంటల నుంచి వైద్య కళాశాలలో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

News April 2, 2024

అలంపూర్ చౌరస్తాలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జాతీయ రహదార- 44పై అలంపూర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్ పై వెళ్తున్న బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానాన్ని పరిశీలించారు. కాగా ఈ ప్రమాదం, మృతుడికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2024

ఖమ్మం: డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని పొడగించినట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఫీజు గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు పొడిగించారు. రూ.50 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News April 2, 2024

మల్కాజిగిరిలో BRS జెండా పాతేనా?

image

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్, 2014లో TDP, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. 2014, 2019లో రెండో స్థానానికి BRS పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో BRS క్లీన్ స్వీప్ చేసింది. క్యాడర్ కూడా బలంగా ఉంది. గతంలో 2 సార్లు పార్టీ ఓడిపోయిందని, ఈసారి తప్పకుండా BRS గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారు. మీ కామెంట్?

error: Content is protected !!