India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల పిల్లలకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా 3 రోజులు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) హయత్నగర్ మండల కార్యదర్శి అరుణ్ కుమార్ గౌడ్, గ్రేటర్ HYD నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడారు. ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని కోరారు. నాయకులు ఎన్నపల్లి ఉపేందర్, జిన్నా, బన్నీ, జూనోతల భాను ప్రకాశ్ ఉన్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల పిల్లలకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా 3 రోజులు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) హయత్నగర్ మండల కార్యదర్శి అరుణ్ కుమార్ గౌడ్, గ్రేటర్ HYD నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడారు. ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని కోరారు. నాయకులు ఎన్నపల్లి ఉపేందర్, జిన్నా, బన్నీ, జూనోతల భాను ప్రకాశ్ ఉన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న అన్ని డిపోల నుంచి వివాహాది శుభకార్యాలకు, విహారయాత్రలకు బస్ బుకింగ్ చేస్తున్న వారికి 10% రాయితీ వర్తిస్తుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ అన్నారు. ప్రయాణాలను TGSRTCతో మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా చేసుకోగలరని కోరారు.

RR,MDCL,VKB జిల్లాల్లో వ్యవసాయ భూమి ఉన్న రైతులకు అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. నూతనంగా భూమి కొనుగోలు చేసిన వారు, నూతనంగా రైతు పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన వారు రూ.5 లక్షల రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం క్లస్టర్ AEO అధికారిని సంప్రదించాలి.18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. జులై 30లోపు అందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు మొక్కజొన్న ధర రూ.2,750 పలికింది. గత 3 రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ధరలు స్థిరంగా ఉండటం, గత రెండు నెలలుగా మక్కలకు అధిక ధర రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మార్కెట్లో మొక్కజొన్నలు తరలివస్తున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు.

మృతదేహాన్ని కారు సుమారు <<13680734>>4KM లాక్కెళ్లిన<<>> విషయం తెలిసిందే. వనపర్తి జిల్లాకు చెందిన వెంకటేశ్(22) HYDలో ఉంటూ LLB చేస్తున్నాడు. ఆదివారం రాత్రి జహీరాబాద్కు బైక్ పై వెళ్లి వస్తుండగా లింగంపల్లి శివారులో NH-65పై వెనుక నుంచి కారు ఢీకొట్టింది. అది గమనించని కారు డ్రైవర్ సుమారు 4KM లాక్కెళ్లాడు. కంకోల్ టోల్ ప్లాజా వద్ద గుర్తించగా వెంకటేశ్ అప్పటికే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గ్రామీణ మహిళల అభ్యున్నతే లక్ష్యంగా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. MLG RDO ఆఫీసు, DVK, NKL MPDO ఆఫీసు, NLG కలెక్టరేట్, RDO కార్యాలయాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేయించనున్నారు. ఆహార పదార్థాలను ఇళ్ల వద్ద తయారుచేసి క్యాంటీన్లకు తరలించడం, ఆర్డర్లపై పిండివంటలు, మిఠాయిలు, పచ్చళ్లను తయారుచేసి విక్రయిస్తారు. వ్యాపార దక్షత గల మహిళా సంఘాలకు రూ.10 నుంచి రూ.20 లక్షలు రుణంగా ఇవ్వనున్నారు.

HYD అశోక్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో దివ్యాంగులు రోడ్డెక్కారు. సీనియర్ IAS అధికారిణి స్మిత సబర్వాల్ దివ్యాంగుల రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పే హక్కు స్మిత సబర్వాల్కు లేదని వారు మండిపడ్డారు. తమను ఆమె కించపరిచారని దివ్యాంగుల జాతీయ వేదిక నాయకులు రాము, రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

HYD అశోక్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో దివ్యాంగులు రోడ్డెక్కారు. సీనియర్ IAS అధికారిణి స్మిత సబర్వాల్ దివ్యాంగుల రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పే హక్కు స్మిత సబర్వాల్కు లేదని వారు మండిపడ్డారు. తమను ఆమె కించపరిచారని దివ్యాంగుల జాతీయ వేదిక నాయకులు రాము, రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి KNR జిల్లాలోని దాదాపు చెరువులన్నీ నిండు కుండలా మారి మత్తడి పోస్తున్నాయి. ఈ క్రమంలోనే గంగాధర మం.లోని నారాయణపూర్ చెరువు జలకళను సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పైపులైన్లతో చెరువుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయా ప్రాంతాలకు సాగు నీటిని అందిస్తున్నారు. మీ గ్రామంలోని చెరువు నిండిందా? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.