India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సిద్దిపేట జిల్లా <<13707142>>లింగారెడ్డిపల్లిలో <<>>ట్రాక్టర్ కిందపడి రైతు మృతి చెందిన విషయం తెలిసిందే. అతడి మృతిని తట్టుకోలేక ప్రియురాలు సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. వారి వివరాలు.. గ్రామానికి చెందిన యువతి(22) HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. రైతు సత్యంతో ఏడాదిన్నర నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. సత్యం మృతి చెందిన కాసేపటికే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది.

నాగార్జునసాగర్ పరిధిలోని ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. దేవరకొండతో పాటు సాగర్ ఎడమ కాలవ పరిధిలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, HNR నియోజకవర్గాలలో సుమారు రూ.3 వేల కోట్లతో గతంలో KCR ఎత్తిపోతల నిర్మాణం ప్రారంభించారు. కానీ నిధులు కేటాయించకపోవడంతో పునాది దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఎత్తిపోతల పథకాల నిర్మాణం ముందుకు సాగనుంది.

రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో సీతారామ ప్రాజెక్టుకు రూ.799 కోట్లు కేటాయించారు. ఇందులో పంప్ హౌస్లు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు తదితర పనుల కోసం రూ.687 కోట్లు కేటాయించగా.. సీతమ్మసాగర్ బ్యారేజీ, దాని అనుబంధ పనుల కోసం రూ.111 కోట్లు బడ్జెట్ పద్దుగా మంత్రి మల్లు భట్టివిక్రమార్క చూపించారు. ఈ నిధులను అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు వినియోగించనున్నారు.

పరీక్షలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానవపాడు ఎస్ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాలు.. అమరవాయికి చెందిన కౌశిక్(21) బీఎస్సీ చదువుతున్నాడు. మొదటి సం.లో ఫెయిల్ కావడంతో మంగళవారం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

మహిళలపై కత్తితో దాడి చేసిన ఘటన నవీపేట్లో జరిగింది. జలాల్పూర్కి చెందిన గంగవ్వ అదే గ్రామానికి చెందిన సావిత్రి వద్ద నెల కిందట కుక్కర్ కొనుగోలు చేసింది. అది సరిగ్గా పనిచేయకపోవడంతో పలుమార్లు వారికి గొడవ జరిగింది. కాగా గురువారం సావిత్రి.. గంగవ్వను డబ్బులు ఇవ్వాలని అడగ్గా దానికి గంగవ్వ నిరాకరించింది. దీంతో కోపగించుకున్న సావిత్రి ఆమె తలపై కత్తితో నరికింది. ఈ ఘటనపై SI యాదగిరి గౌడ్ కేసు నమోదు చేశారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ముగ్గురు మహిళలతో వ్యభిచారం చేస్తున్న విటులను పట్టుకున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. వారిలో లాడ్జి నిర్వాహకుడు శ్రీనివాస్తో పాటు అఖిల్, అరుణ్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన మహిళలను పోలీసులు స్థానిక సఖీ కేంద్రానికి తరలించినట్లు సీఐ వివరించారు.

మహబూబ్ నగర్లో డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ రాత పరీక్షకు 665 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్ష లకు 728 మంది అభ్యర్థులు రావాల్సి ఉండగా, 63 మంది హాజరుకాలేదు. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

పర్యాటకరంగంలోనూ ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కింది. ఎకో- టూరిజం (పర్యావరణ పర్యాటకం)ను పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా పెనుబల్లి, కల్లూరు, ఏన్కూరు, తల్లాడ, చండ్రుగొండ, జూలూరుపాడు, సుజాతనగర్ మండలాల మధ్య విస్తరించిన కనకగిరి గుట్టలు, ఇక్కడి ఆలయాలు, ప్రాజెక్టులు అభివృద్ధికి నోచుకుంటాయి. అనువైన ప్రాంతాల్లో కాటేజీలు నిర్మించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించనున్నారు.

డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ కేటాయింపుల్లో ఖమ్మం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. నీటిపారుదల, అటవీ, రోడ్లు, పంచాయతీరాజ్ శాఖల్లో పెండింగ్ పనులకు నిధులు కేటాయించారు. తద్వారా జిల్లాలోని సీతారామ, వైరా, లంకాసాగర్ ప్రాజెక్టుల పనులు ఊపందుకోనున్నాయి. అలాగే, ఎర్రుపాలెం మండలంలో ప్రత్యేకంగా ఎత్తిపోతలకు నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు.

సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఏర్పాటు చేసిన కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి బడ్జెట్లో రూ.120కోట్లు కేటాయించారు. దీంతో పాటు కొడంగల్లో ఏర్పాటు చేయనున్న కొత్త వెటర్నరీ కళాశాలకు రూ.6.50 కోట్లను కేటాయించారు. పరిశోధన- అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 5 కోట్ల చొప్పున్న రూ. 603.76 కోట్లు ప్రతిపాదించారు.
Sorry, no posts matched your criteria.