Telangana

News March 30, 2024

HYD: విద్యుత్ వినియోగం‌లో రికార్డ్ బ్రేక్..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకి విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ నెల 28న ఏకంగా 79.48 మిలియన్ యూనిట్ల కరెంట్‌ను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా మే నెలలో ఈ స్థాయిలో ఉంటుందని, ఈ ఏడాది మార్చిలోనే ‌ఆ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గతేడాది అత్యధికంగా మే 19న 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. ఈ ఏడాది మార్చిలోనే‌ ఆ రికార్డు‌ బ్రేక్‌ అవ్వడం గమనార్హం.

News March 30, 2024

పాలమూరు గడ్డ పై బిజెపి జెండా ఎగరవేద్దాం: డీకే అరుణ

image

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు గడ్డపై BJP జెండా ఎగరవేద్దామని మాజీ మంత్రి DK అరుణ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఊట్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మోడీని ప్రధానిగా కాకుండా ఆపే శక్తి దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడికి లేదని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిల పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.

News March 30, 2024

ఎన్నికల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు, పోలింగ్ రోజు అత్యవసర సేవల విధులు నిర్వహించే అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పన పై ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

News March 30, 2024

బంగారం కోసం వివాహిత హత్య: డీసీపీ రవీందర్

image

దుగ్గొండి మండలం మైసంపల్లిలో సుప్రియ హత్య ఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నర్సంపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ రవీందర్ వెల్లడించారు. ములుగుకు చెందిన శశికాంత్, అజ్మీర శిరీష సహజీవనం చేస్తున్నారు. వీరి విషయం తెలిసిన మృతురాలు సుప్రియతో శిరీష గొడవ పడింది. ఈనెల 23న సుప్రియను కొట్టి హత్యచేసి బంగారం, వెండిని తీసుకొని పరారయ్యారని తెలిపారు.

News March 30, 2024

HYD: OYO హోటల్‌లో యువతిపై అత్యాచారం

image

HYDలో దారుణఘటన వెలుగుచూసింది. KPHB‌లోని ఓ హాస్టల్‌లో ఉండే యువతి(22)కి‌ 8 నెలల క్రితం డెలివరీ బాయ్‌‌ ఒబెదుల్లాఖాన్(23)తో‌ స్నేహం ఏర్పడింది. MAR 28న డిన్నర్ చేద్దామని చెప్పి అమ్మాయిని జూబ్లీహిల్స్‌లోని OYOకి తీసుకెళ్లాడు. హోటల్‌లోనే మద్యం తాగి అక్కడే నిద్రపోయారు. మత్తులో ఉన్న ఆమెపై ఒబెదుల్లాఖాన్ అత్యాచారం చేశాడు. శుక్రవారం యువతి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

News March 30, 2024

HYD: OYO హోటల్‌లో యువతిపై అత్యాచారం

image

HYDలో దారుణఘటన వెలుగుచూసింది. KPHB‌లోని ఓ హాస్టల్‌లో ఉండే యువతి(22)కి‌ 8 నెలల క్రితం డెలివరీ బాయ్‌‌ ఒబెదుల్లాఖాన్(23)తో‌ స్నేహం ఏర్పడింది. MAR 28న డిన్నర్ చేద్దామని చెప్పి అమ్మాయిని జూబ్లీహిల్స్‌లోని OYOకి తీసుకెళ్లాడు. హోటల్‌లోనే మద్యం తాగి అక్కడే నిద్రపోయారు. మత్తులో ఉన్న ఆమెపై ఒబెదుల్లాఖాన్ అత్యాచారం చేశాడు. శుక్రవారం యువతి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

News March 30, 2024

మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు కలకలం

image

భద్రాచలం: మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు కలకలం రేపాయి. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు కన్నాయిగూడెం వద్ద శనివారం నడిరోడ్డుపై మావోయిస్టులు కరపత్రాలు లభ్యమయ్యాయి. ఈ కరపత్రాల్లో ఆదివాసీలను విచ్ఛిన్నం చేసే విధంగా దేశ, విదేశీ బహుళజాతి కార్పొరేట్ కంపెనీల మైనింగ్స్, ప్లాంట్లు, రోడ్లు, డ్యాంలు, టైగర్ జోన్‌లు, అభయారణ్యాలు వంటి ప్రాజెక్టులను నిలిపి వేయాలని ఆ పత్రాలలో పేర్కొన్నారు.

News March 30, 2024

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు గద్వాల జిల్లా కేంద్రంలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 42.6, నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 42.4, మహబూబ్ నగర్ జిల్లా సల్కర్‌పేటలో 42.2, నారాయణపేట జిల్లా ధన్వాడలో 41.1, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలో నమోదయ్యాయి.

News March 30, 2024

జన్నారంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. మండలంలోని డీర్ పార్క్ వద్ద ప్రధాన రహదారిపై లక్షెట్టిపేట వైపు వెళ్తున్న బొలేరో.. జన్నారం వైపు వస్తున్న బైక్‌ను ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మందపల్లి గ్రామానికి చెందిన దేవి సుదర్శన్ (45) రక్షిత్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 30, 2024

మెదక్: కాంగ్రెస్ పార్టీలో చేరికకు 5న ముహూర్తం

image

నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ గంగుమళ్ల ఎలక్షన్ రెడ్డి ఏప్రిల్ 5న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఇరువురు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మరికొంత మంది BRS నేతలు, అనుచరులతో కలిసి 5న గాంధీభవన్‌లో హస్తం కండువా కప్పుకోనున్నట్లు‌ కాంగ్రెస్‌ శ్రేణులు తెలిపాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

error: Content is protected !!