India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ HYD, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం మూసాపేటలో గరిష్ఠంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్లో 42 డిగ్రీలు, ఖైరతాబాద్ 41.5, హయత్ నగర్ 41.7, చందానగర్ 41.5, శేరిలింగంపల్లి 41.2, యూసుఫ్ గూడలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
గ్రేటర్ HYD, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం మూసాపేటలో గరిష్ఠంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్లో 42 డిగ్రీలు, ఖైరతాబాద్ 41.5, హయత్ నగర్ 41.7, చందానగర్ 41.5, శేరిలింగంపల్లి 41.2, యూసుఫ్ గూడలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ జాహ్నవి పై నేడే అవిశ్వాస పరీక్ష నిర్వహించనున్నారు. FEBలో 27మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కి అధ్యక్ష పదవిపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ఫిర్యాదుచేయగా ఈనెల 30న బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అవిశ్వాసం నెగ్గాలంటే 34 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ క్యాంపులో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఏదేమైనా ఏం జరుగుతుందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత గడ్డం అరవింద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. రెండు, మూడు రోజులుగా ఊహాగానాలు వస్తున్నా ఆయన నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు కేశవరావుతో ఆయన చర్చలు జరిపారు. కేకే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో అరవిందరెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరడం ఖరారైంది.
KNRలో BJPకి బిగ్ షాక్ తగిలింది. మానకొండూర్ మాజీ MLA ఆరెపల్లి మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు కాంగ్రెస్లో చేరారు. అయితే గతంలో కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన ఆయన.. శాసనసభ ఎన్నికల్లో BJPలో చేరి, పోటీ చేసి ఓడిపోయారు. శుక్రవారం HYDలోని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. MP టికెట్ ఆయనకు కేటాయించనందుకే పార్టీ మారినట్లు సమాచారం.
WGL పార్లమెంట్ BRS అభ్యర్థి విషయంలో రోజుకో కీలక మలుపు కొనసాగుతోంది. సిట్టింగ్ అభ్యర్థి దయాకర్ను కాదని కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు. కానీ, తాను పోటీ చేయనని నిర్ణయం తీసుకొని తండ్రి శ్రీహరితో కలిసి కాంగ్రెస్లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో WGL పార్లమెంట్ టికెట్ కేటాయింపుపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇటీవల పార్టీ మారిన బాబు మోహన్, తాటికొండ రాజయ్యతో పాటు పెద్ది స్వప్న పేర్లు వినిపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో అత్యధికంగా 43.3 డిగ్రీలుగా నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. జిల్లాలోని మరో 12 ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 41.5 డిగ్రీల వరకు నమోదుకాగా.. ఎండలకు తోడు వడగాలులు మొదలవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 2 నెలలు ఎలా ఉంటుందో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
పాలమూరులో డీకే అరుణమ్మ గెలవాలి.. దేశ ప్రధానిగా మళ్లీ మోడీ రావాలని అది మీదే బాధ్యతని, బిజెపి ప్రభుత్వం వస్తేనే దేశ సమగ్రత, అభివృద్ధి కాపాడగలుగుతామని, టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్ లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలు బిజెపిలో చేరారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు, రాష్ట్ర నాయకులు తల్లోజు ఆచారి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మెదక్ ప్రజల ఆశ, శ్వాసగా పనిచేస్తామని రఘునందన్ రావు తెలిపారు. ఇందిరా గాంధీ హామీ ఇచ్చి నాలుగు దశాబ్దాలుగా కానీ పనులు ఐదేండ్లలో మోదీ నేతృత్వంలో చేసి చూపించామన్నారు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపిలు లేకున్నా మెదక్ రైలు, మెదక్ మీదుగా జాతీయ రహదారులు, అనేక పనులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెదక్ ఆత్మగౌరవాన్ని కాపాడేలా పనిచేస్తా అన్నారు. మెదక్ ఎన్నిక ఏకపక్షమని రఘునందన్ రావు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.