India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడస్తున్నందుకు చాలా మంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని జిల్లా ఎస్పీ చందనా దీప్తి అన్నారు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఆర్థికంగా దెబ్బతిని సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. యువత క్రికెట్ బెట్టింగ్కు దూరంగా ఉండాలని ఎస్పీ కోరారు.
రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా మెదక్ జిల్లా ర్యాలమడుగు వాసి కృష్ణ గెలుపొందారు. గ్రామానికి చెందిన కృష్ణ 18 ఏళ్లుగా అక్కడ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికలో ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 2270 ఓట్లలో 1134 ఓట్లు సాధించి గెలుపొందారు. మెదక్ మండలం ర్యాలమడుగు వాసి గెలుపొందడం పట్ల గ్రామస్తులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బూర్గంపహడ్ మండల కేంద్రంలోని క్లస్టర్ మిల్లు సమీపంలో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామ చివర ఉన్న క్లస్టర్ మిల్లు వద్ద నలుగురు దొంగలు ట్రాలీ వాహనంలోకి దొంగతనంగా హెవీ జనరేటర్ ఎక్కిస్తున్న క్రమంలో స్థానిక రైతులు ఇద్దరు దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గతంలో చోరీకి గురైన మోటర్లు, పలు పరికరాలు వీళ్లే ఎత్తుకెళ్లినట్లు రైతులు భావిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “పెద్ద షాక్, వాడు పోయిండు, వీడు పోయిండు అనే ఒకటే ఊదరగొడుతుండ్రు. ఇది శిశిర ఋతువు.. పనికిరాని ఆకులన్నీ చెత్తకుప్పలోకి పోతయ్. మూలం మాత్రం స్థిరంగా ఉంటుంది” అని ట్వీట్ చేశారు. మళ్ళీ చైత్రం వస్తది, కొత్త ఆకులు చిగురిస్తాయని, మూలం నుంచి శక్తిని అందుకొని విజృంభిస్థాయన్నారు. ఇది ప్రకృతి సహజం, ప్రతిదానికి షాకైతే ఎలా అని అన్నారు.
ఒక్క తెలంగాణ కోసం తప్ప పార్టీని ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టికెట్ల విషయంలో నేను కలుగజేసుకోను.. నేను పార్టీ కోసం పని చేస్తానన్నారు. మంత్రుల నివాస సముదాయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో వారు మాట్లాడారు. తన నియోజకవర్గం తన శాఖ తప్ప వేరేది పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు. కేసీఆర్కు ఆయన చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని ఎద్దెవ చేశారు.
కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ద షాక్, వాడు పోయిండు, వీడు పోయిండు అని ఒకటే ఊదరగొడుతుండ్రు.. ఇది శిశిర రుతువు.. పనికిరాని ఆకులన్నీ చెత్తకుప్పలోకి పోతయ్.. మూలం మాత్రం స్థిరంగా ఉంటుంది. మళ్ళీ చైత్రం వస్తది. కొత్త ఆకులు చిగురిస్తాయి. మూలం నుంచి శక్తిని అందుకొని విజృంభిస్థాయి’ అన్నారు. ఇది ప్రకృతి సహజమని, ప్రతిదానికి షాక్ అయితే ఎలా అని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల యవత బెట్టింగులకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం IPL సీజన్ కావడంతో మహదేవపురం, కాటారంతో పాటు.. పలు చోట్ల ఆన్లైన్, ఆఫ్లైన్లో భారీగా బెట్టింగ్ పెడుతున్నారు. వచ్చిన లాభాలను సైతం బెట్టింగ్కు మళ్లిస్తున్నారు. ఇటీవల కాటారం మండలంలో ఓ వ్యక్తి బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి రూ.లక్షల్లో నష్టపోయాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఆరెపల్లి మోహన్ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర నాయకులు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్య చరణ పై త్వరలోనే వెల్లడిస్తానని ఆరేపల్లి మోహన్ తెలిపారు.
అచ్చంపేట మండలంలోని దుబ్బా తండాకు చేందిన కేతవత్ జవహర్(33) కుటుంబ కలహాలతో సూసైడ్ చేసుకున్నట్లు సిద్దాపూర్ SI పవన్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాలు.. గురువారం తన వ్యవసాయ పొలంలో స్థభానికి జవహర్ ఊరేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో దంపతుల మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో పొలానికి వెళ్లి జవహర్ సూసైడ్ చేసుకున్నట్లు మృతుడి భార్య కవిత ఫిర్యాదుతో నేడు కేసు నమోదు చేసినట్ల పోలీసులు తెలిపారు.
పార్టీ మార్పు అంశంపై BRS రాజేంద్రనగర్ MLA క్లారిటీ ఇచ్చారు. ఇటీవల తెలంగాణభవన్లో జరిగిన చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకాకపోవడంతో ప్రకాశ్ గౌడ్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. శుక్రవారం ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు. ‘మార్చి 31న మనవరాలి పెళ్లి ఉంది. పనుల్లో బిజీగా ఉండడంతో రాలేకపోయాను. అంతమాత్రాన ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం తగదు’ అంటూ ప్రకాశ్ గౌడ్ హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.