Telangana

News March 29, 2024

దుబ్బాక: గొలుసుతో ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

image

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెర్వాపూర్ పిట్టల వాడకు చెందిన జయరాం(35) ఇంట్లో రాత్రి ఎవరూ లేని సమయంలో వాసానికి గొలుసుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 29, 2024

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు: ఎస్పీ రాహుల్ హెగ్డే

image

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని విద్వేషకర పోస్టులు పెట్టే వారి సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

News March 29, 2024

GOOD NEWS: నిజామాబాద్‌లో IPL బిగ్ స్క్రీన్

image

క్రికెట్ ప్రేమికుల కోసం నిజామాబాద్ నగరంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెంకట్రాంరెడ్డి, సత్యపాల్ తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో ఈ నెల 30, 31న బిగ్ స్క్రీన్ ద్వారా ఉచితంగా క్రికెట్ మ్యాచ్ చూడవచ్చన్నారు. క్రికెట్ ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

News March 29, 2024

ఖమ్మం: కొబ్బరి చెట్టుపై నుంచి పడి యువకుడి మృతి

image

కొబ్బరి చెట్టుపై నుంచి ఓ యువకుడి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన వేంసూరు మండలం అమ్మపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు (34)కొబ్బరికాయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వేంసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 29, 2024

హైదరాబాద్: భయపెడుతున్న‘భువన్’ సర్వే!

image

భువన్ సర్వే పేరుతో ఆస్తిపన్ను మదింపు చేయించిన మున్సిపల్ అధికారులు ఆ సర్వే ప్రకారం ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా పన్ను జారీ చేస్తున్నారు. పంచాయతీలుగా ఉన్నప్పటి పన్నుల ప్రకారం లెక్కగట్టి కొంతమేరకు పెంచితే సరిపోతుంది. ఇందుకు విరుద్ధంగా జవహర్‌నగర్, బడంగ్‌పేట, మీర్‌పేట్, నిజాంపేట్, బోడుప్పల్, పీర్జాదీగూడ కార్పొరేషన్లలో ఇంటి పన్నులు పెంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 29, 2024

హైదరాబాద్: భయపెడుతున్న‘భువన్’ సర్వే!

image

భువన్ సర్వే పేరుతో ఆస్తిపన్ను మదింపు చేయించిన మున్సిపల్ అధికారులు ఆ సర్వే ప్రకారం ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా పన్ను జారీ చేస్తున్నారు. పంచాయతీలుగా ఉన్నప్పటి పన్నుల ప్రకారం లెక్కగట్టి కొంతమేరకు పెంచితే సరిపోతుంది. ఇందుకు విరుద్ధంగా జవహర్‌నగర్, బడంగ్‌పేట, మీర్‌పేట్, నిజాంపేట్, బోడుప్పల్, పీర్జాదీగూడ కార్పొరేషన్లలో ఇంటి పన్నులు పెంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 29, 2024

HYD: MMTSలకు దూరమవుతున్న ప్రయాణికులు

image

చౌకగా ప్రయాణించే అవకాశం ఉన్నా MMTSలను ప్రజలు అంతగా ఎక్కడం లేదు. రెండోదశలో 95 కి.మీ. తోడైనా ప్రయాణికులు పెరగలేదు. మెట్రోలేని మార్గాలతో పాటు శివార్లను కలుపుతూ నలువైపులా అందుబాటులోకొచ్చినా అదే పరిస్థితి. సమయపాలన పాటించకపోవడంతోనే ప్రయాణికులు దూరమయ్యారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ – సికింద్రాబాద్ మధ్య 10 సర్వీసులు ప్రతి రోజూ ఆలస్యంగా నడుస్తున్నాయని చెబుతున్నారు.

News March 29, 2024

HYD: MMTSలకు దూరమవుతున్న ప్రయాణికులు

image

చౌకగా ప్రయాణించే అవకాశం ఉన్నా MMTSలను ప్రజలు అంతగా ఎక్కడం లేదు. రెండోదశలో 95 కి.మీ. తోడైనా ప్రయాణికులు పెరగలేదు. మెట్రోలేని మార్గాలతో పాటు శివార్లను కలుపుతూ నలువైపులా అందుబాటులోకొచ్చినా అదే పరిస్థితి. సమయపాలన పాటించకపోవడంతోనే ప్రయాణికులు దూరమయ్యారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ – సికింద్రాబాద్ మధ్య 10 సర్వీసులు ప్రతి రోజూ ఆలస్యంగా నడుస్తున్నాయని చెబుతున్నారు.

News March 29, 2024

నేను పార్టీ మారడం లేదు: మహబూబాబాద్ ఎంపీ కవిత

image

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులపై స్పందించారు. తాను బీఆర్ఎస్‌ని వీడుతున్నట్లు ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారడం లేదని, కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని కవిత అన్నారు. తనపై నమ్మకంతోనే మళ్లీ మహబూబాబాద్ ఎంపీ టికెట్ కేసీఆర్ కేటాయించారని చెప్పారు.

News March 29, 2024

MBNR: ఏప్రిల్ 2న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

image

ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఏప్రిల్‌ 2న మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల భవనంలో నిర్వహించనున్నారు. అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. గురువారం సాయంత్రం పోలింగ్‌ ముగిసిన వెంటనే పటిష్ఠ బందోబస్తు నడుమ బ్యాలెట్‌ బాక్స్‌లను కౌంటింగ్‌ కేంద్రానికి తరలించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏప్రిల్‌ 4 నాటికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రక్రియ ముగియనుంది.

error: Content is protected !!