India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం-బోనకల్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగన్నాథపురం వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అదే విధంగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఆటోలు ఆరుగురు ప్రయాణిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సొంత ఇంటిలోనే దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మహదేవపురం కాలనీలో నివాసముండే ఓ మహిళ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోంది. ఈనెల 19న పాఠశాలకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో 8 తులాల బంగారం, 6 తులాల వెండి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా ఆమె భర్త దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న నేపథ్యంలో మొదటిసారి BRS MLC కవిత సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జాగృతి ఏర్పాటు చేసి రాష్ట్ర సంస్కృతిని వ్యాప్తి చేసేలా ఏటా కవిత బంగారు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. కాగా ఈ సారి లష్కర్ బోనాల వేడుకలకు కవిత రాలేని పరిస్థితి ఉండడంతో పలువురు BRS నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లిక్కర్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న నేపథ్యంలో మొదటిసారి BRS MLC కవిత సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జాగృతి ఏర్పాటు చేసి రాష్ట్ర సంస్కృతిని వ్యాప్తి చేసేలా ఏటా కవిత బంగారు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. కాగా ఈ సారి లష్కర్ బోనాల వేడుకలకు కవిత రాలేని పరిస్థితి ఉండడంతో పలువురు BRS నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చైతన్యపురి పీఎస్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని వేణుశ్రీ<<13674167>> ఆత్మహత్యాయత్నానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అంతకుముందు విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది. ‘రేపటి వరకు ఉంటానో.. ఉండనో తెలియదు డాడీ.. I’M SORRY’ నేను నా వరకు ట్రై చేస్తున్నా. కానీ మీ పేరు నిలబెట్టలేనేమో అని భయమేస్తుంది’ అని ఆమె సూసైడ్ నోట్లో పేర్కొంది.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండం చెరువులో ఓ మత్స్యకారుడి వలకు 32 కిలోల భారీ చేప చిక్కింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెరువు నుంచి పెద్ద చేపలు వాగులోకి ఎదురు వెళ్తున్నాయి. పిల్లి సతీష్ అనే మత్స్యకారుడు చెరువులోకి వాగు నీరు చేరే చోట వల ఏర్పాటు చేశాడు. వల ఎంతకూ రాకపోవడంతో ఇతరుల సాయంతో వలను ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో 32 కిలోల పెద్ద చేప చిక్కడంతో సతీశ్ ఆనందం వ్యక్తం చేశారు.

చైతన్యపురి పీఎస్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని వేణుశ్రీ <<13674116>>ఆత్మహత్యాయత్నానికి <<>>పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అంతకుముందు విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది. ‘రేపటి వరకు ఉంటానో.. ఉండనో తెలియదు డాడీ.. I’M SORRY’ నేను నా వరకు ట్రై చేస్తున్నా. కానీ మీ పేరు నిలబెట్టలేనేమో అని భయమేస్తుంది’ అని ఆమె సూసైడ్ నోట్లో పేర్కొంది.

భవనంలోని మూడో అంతస్తు పైనుంచి పడి మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. పట్టణంలోని అశోక్నగర్లో ఉన్న ఓ భవనం మూడో అంతస్తు నుంచి పడి రాజేశ్వరి(50) మృతి చెందింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు జిల్లా విద్యుత్ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. తడిసిన కరెంట్ స్థంబాలను, విద్యుత్ లైన్కు తగిలే చెట్లను, తడి చేతులతో చార్జింగ్ పెట్టడం, స్విచ్ ఆన్ చేయడం వంటివి చేయవద్దని హెచ్చరించారు. అలాగే ఉతికిన బట్టలు ఇనుప తీగలపై ఆరవేయొద్దని సూచించారు. ఏమైనా విద్యుత్ సమస్య వస్తే సొంతంగా రిపేర్ చేయకుండా, విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లిలో 27.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్ జిల్లా మొహ్మదాబాద్ 22.8 మి.మీ, నారాయణపేట జిల్లా గుండుమల్లో 20.5 మి.మీ, వనపర్తి జిల్లా మదనాపురంలో 21.5 మి.మీ, గద్వాల జిల్లా కేంద్రంలో 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Sorry, no posts matched your criteria.