India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్లో జరిగింది. ఎస్ఐ ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడకి చెందిన శివయ్య(48) పాల వ్యాపారం చేస్తూ జీవించేవాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, మనస్తాపం చెంది గురువారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
పెద్ద కొడప్గల్ ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై దాడికి పాల్పడిన దుండగులను గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బిచ్కుంద ఎస్సై తెలిపారు. బేగంపూర్ గేటు వద్ద మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై కాస్లాబాద్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మద్యం తాగి వచ్చి గొడవకు దిగి, దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్న జరిగిన సీఈసీ సమావేశంలో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తారని అందరూ భావించిన అది జరగలేదు. అభ్యర్థి ప్రకటనపై ఎందుకు ఆలస్యం జరుగుతుందో అర్థం కాకుండా ఉందని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే BRS, BJP అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారంలో వారు నిమగ్నమయ్యారని, త్వరగా అభ్యర్థిని ప్రకటించాలని కోరుతున్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫొటోలు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. గురువారం మండల కేంద్రంలోని ఓ ఇంటి స్లాబ్ మీద వాలింది. పెద్ద పెద్ద కండ్లు, పొడవాటి ముక్కు, తెలుపు రంగులో ఉంది. జనావాసాల మధ్యకొచ్చిన ఈ వింత పక్షిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరికొందరు ఆశ్చర్య పడుతూ సెల్ఫోన్తో ఫొటోలు తీశారు.
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి నిర్వహించే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం మూడంచెలుగా సమన్వయ కమిటీలు వేసుకొని పని చేయాలని, ఏప్రిల్ 8న కొడంగల్ మళ్లీ వచ్చి సమన్వయ కమిటీ సభ్యులతో ఎంత మెజార్టీ ఇస్తారో రాయించుకుని సంతకాలు తీసుకుంటానన్నారు. ఇవే సమన్వయ కమిటీలు తర్వాత నిర్వహించే ఇందిరమ్మ కమిటీలుగా రూపాంతరం చెందుతాయన్నారు.
మేడిపల్లి మండలం కొండాపూర్ శివారులోని గల ఎస్సారెస్పీ వరద కాలువలో గుర్తుతెలియని వ్యక్తి శవం కొట్టుకొచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉన్నట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఎవరు..? ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? ప్రమాదవశాత్తు జారిపడ్డాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని మోసగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. లాటరీ తగిలిందని కొంత డబ్బు జమ చేస్తే మిగతా డబ్బులు ఇస్తామని చెప్పే మాయ మాటలు నమ్మకండని చెప్పారు. అనవసరపు లింకులు ఓపెన్ చేయరాదని, అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ATM, OTP నంబర్లు ఇవ్వరదాని, ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కాజేసిన కేసులో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సహాయకుడిగా పనిచేస్తున్న వంశీ ను గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవడానికి రాని వారి పేర్లతో ఉండే నకిలీ వ్యక్తులతో మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. 99.86% పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 1439 ఓట్లకు గాను 1437 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరు ప్రతినిధులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోలేదు. NGKL, NRPT నియోజకవర్గంలో ఒక్కొక్కరు ఓటు వేయలేదు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో 10 బూతులలో పోలింగ్ ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.