Telangana

News March 27, 2024

మహబూబాబాద్‌లో రసవత్తరంగా MP పోరు

image

మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో లోక్ సభ పోరు రసవత్తరంగా మారింది. 3 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో వారు ఇప్పటికే సమావేశాలు, కార్యాచరణలు రూపొందించుకుంటున్నారు. BRS నుంచి మాలోతు కవిత, BJP నుంచి సీతారాంనాయక్, కాంగ్రెస్ నుంచి బలరాంనాయక్‌లు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బరిలో నిలవనున్న ముగ్గురికి గతంలో ఎంపీలుగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో పోరు ఆసక్తిగా మారింది.

News March 27, 2024

కరవును రాజకీయం చేయొద్దు: మంత్రి పొన్నం

image

బీఆర్ఎస్ కరవు, వర్షపాతానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరవుకి కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణం కాదని, అది ప్రకృతి ప్రభావం అని పేర్కొన్నారు. ప్రకృతిలో ఏర్పడ్డ ఇబ్బందులకు ఎవరూ బాధ్యులు కారన్నారు. వేసవిలో తాగునీరు, సాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

News March 27, 2024

సూర్యాపేట: BRSను TRSగా మార్చండి.. KTRకు EX.MLA రిక్వస్ట్..

image

బీఆర్ఎస్ పేరును తిరిగి TRSగా మార్చాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా తాజాగా పోస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్యవాదుల దాడిని అరికట్టాలన్నా, ప్రాంతీయతత్వం బతకాలన్నా.. బీఆర్ఎస్ పేరు నుంచి టీఆర్ఎస్‌గా మారాల్సిన అవసరం చాలా ఉందంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.

News March 27, 2024

MBNR: పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే గడువు

image

మహబూబ్ నగర్ స్థానికసంస్థల MLC ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్ల జాబితాపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. చివరి ప్రయత్నంగా ఓటర్ల సమీకరణాలను సరి చూసుకుంటున్నారు. MLCఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు మన్నె జీవన్ రెడ్డి(కాంగ్రెస్) నవీన్ కుమార్‌రెడ్డి(BRS)ఇప్పుడు తమకున్న ఓటర్ల బలాబలాలపై దృష్టి సారించారు.

News March 27, 2024

ప్రజలు వడదెబ్బ తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: DHMO

image

ప్రస్తుతం ఎండలు విపరీతంగా పెరుగుతున్నందున ఖమ్మం జిల్లాలోని ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలతి సూచించారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించాలని, చల్లని నీటితో శరీరాన్ని తుడవాలని , వ్యక్తికి వీలైనంత గాలి తగిలే విధంగా జాగ్రత్త వహించాలన్నారు. సాధ్యమైనంతవరకు ఎండలో బయటకు వెళ్లడం ఆపివేయాలన్నారు.

News March 27, 2024

వరంగల్ మార్కెట్‌కి మళ్లీ వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మళ్లీ 3 రోజులు వరుస సెలవులు రానున్నాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. నేడు, రేపు మాత్రమే మార్కెట్ ఓపెన్ ఉండనుంది. కావున, రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్లో క్రయ విక్రయాలు కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 27, 2024

ఖమ్మం: ఉద్యోగ వేట.. గ్రంథాలయ బాట

image

ఇటీవల విడుదలైన ఉద్యోగ ప్రకటనలతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వ కొలువులు సాధించేందుకు కసరత్తు ప్రారంభించారు. తొలి ప్రయత్నంలోనే సాధించాలని కొందరు, ఈసారైనా కల నెరవేర్చుకోవాలని మరికొందరు పోటీ పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు గ్రంథాలయాల్లో సాధన చేస్తున్నారు. అక్కడి వసతులను ఉపయోగించుకుని అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు శ్రమిస్తున్నారు.

News March 27, 2024

జగిత్యాలలో మత్తులో మైనర్ల హంగామా!

image

జగిత్యాలలోని మహాలక్ష్మినగర్ బైపాస్ దగ్గర మంగళవారం సాయంత్రం మత్తులో ఉన్న నలుగురు మైనర్లు హంగామా సృష్టించారు. విచిత్రంగా ప్రవర్తిస్తూ ఇళ్ల ముందు నిలిపిన బైకులను తన్ని కింద పడేశారు. కేకలు వేస్తూ రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికులు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారికి ఫిర్యాదు చేయగా వారిని పట్టుకోవడానికి వచ్చిన సిబ్బందిపై దాడికి యత్నించారు. ఒకరిని పట్టుకోగా ముగ్గురు పారిపోయారు.

News March 27, 2024

నేషనల్ సైక్లింగ్ పోటీలకు ఆదిలాబాద్ బిడ్డ ఎంపిక

image

నేరడిగొండ మండలం మర్లపల్లికి చెందిన జాదవ్ కిరణ్ జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల రామాయంపేటలో జరిగిన రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అండర్-18 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని సాధించారు. ఈనెల 28 నుంచి 31 వరకు హరియాణాలో నిర్వహించే జాతీయస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

News March 27, 2024

HYD: ఇనుప రాడ్డు మెడకు గుచ్చుకొని వ్యక్తి మృతి

image

ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన HYD KPHB PS పరిధిలో జరిగింది. SI సుమన్ తెలిపిన వివరాలు.. బాలానగర్‌ వాసి పవన్(35) ఫ్యాబ్రికేషన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. KPHB రోడ్ నం.1లోని ఐరిస్ షోరూమ్ షట్టర్ మరమ్మతులు చేసేందుకు వచ్చాడు. నిచ్చెన వేసుకుని మరమ్మతులు చేస్తుండగా షట్టర్ రాడ్డు హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై కింద ఇనుప రాడ్డుపై పడటంతో అది మెడకు గుచ్చుకొని మృతిచెందాడు.

error: Content is protected !!