Telangana

News March 27, 2024

ఇల్లంతకుంటలో గుండెపోటుతో విద్యార్థి మృతి !

image

సిరిసిల్ల: గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో జరిగింది. గ్రామానికి చెందిన ఎల్లంకి సాయితేజ(14) 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండె వ్యాధితో సాయి బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

News March 27, 2024

నిజామాబాద్ జిల్లాలో కుష్ఠి వ్యాధి విస్తరిస్తోంది..!

image

ఉమ్మడి జిల్లాలో కుష్ఠి వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. NZBజిల్లాలో గతేడాది సెప్టెంబరులో చేపట్టిన సర్వేలో 214 మంది అనుమానితులను గుర్తించి 15 మందిలో వ్యాధిని గుర్తించారు. తాజాగా జరిగిన సర్వేలో 462 మందిని అనుమానితులను గుర్తించగా వీరికి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంది. 6నెలల్లోనే అనుమానితుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కాగా వ్యాధిని నివారణకు జిల్లా వైద్యాశాఖ చర్యలు చేపట్టింది.

News March 27, 2024

పాలమూరులో ‘ఫోన్ ట్యాపింగ్’ ప్రకంపనలు.?

image

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆ మరకలు మహబూబ్‌నగర్‌ను అంటుకోగా.. హాట్‌ టాపిక్‌గా మారింది. తన ఫోన్‌తో పాటు జిల్లాలోని అప్పటి విపక్ష నాయకులు, బడా వ్యాపారులు, రియల్టర్ల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని.. ఇందులో ఓ మాజీ మంత్రితో పాటు పలువురు పోలీస్‌ అధికారుల ప్రమేయం ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు.

News March 27, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు..!

image

✒దేవరకద్ర: నేడు ఉల్లి వేలం
✒ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ కలకలం
✒MLC ఎన్నికలు.. కొనసాగుతున్న సైలెంట్ పిరియడ్
✒ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై, త్రాగునీటి సమస్యలపై అధికారుల ఫోకస్
✒రంజాన్ వేళలు:-
ఇఫ్తార్(బుధ)-6:35,సహార్(గురు)-4:51
✒’ELECTION EFFECT’..కొనసాగుతున్న తనిఖీలు
✒ఉమ్మడి జిల్లాలో శుభకార్యాలకు ఎలక్షన్ కోడ్ కష్టాలు
✒MBNR:ఓటు నమోదుపై 5KM రన్
✒MLC ఎన్నికలు.. పకడ్బందీగా ఏర్పాట్లు

News March 27, 2024

కాజీపేట రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడు మృతి

image

కాజీపేట రైల్వే స్టేషన్లోని ఒకటో నెంబరు ప్లాట్ ఫాంపై లిఫ్టు వద్ద గుర్తు తెలియని ప్రయాణికుడు మృతి చెందినట్లు జీఆర్పీ అధికారి కమలాకర్ తెలిపారు. అనారోగ్యం కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో అతను మరణించినట్లు చెప్పారు. అతడి వయసు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని, నీలిరంగు చొక్కా, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు.

News March 27, 2024

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్‌పై తర్జనభజన

image

కాంగ్రెస్ భువనగిరి ఎంపీ టికెట్ ఎవరికివ్వాలన్న దానిపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే ఈ టికెట్ తనకు ఇవ్వాలని, ఏడాదిన్నరనుంచి నియోజకవర్గంలో పని చేస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పట్టు పడుతుండగా, వివిధ సర్వేల తరువాత అధిష్టానం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మిని పోటీలో నిలపాలని ఆయనపై ఒత్తిడి తెస్తోంది. ఇదిలా ఉంటే కొత్తగా బీసీ అంశం తెరపైకి వచ్చింది.

News March 27, 2024

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

image

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన కూనవరం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాయిగూడెం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో సోయం సాంబయ్య ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 27, 2024

NLG: పాతాళానికి గంగమ్మ..

image

వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా నీటి నిల్వలు పడిపోయిన జిల్లాల జాబితాలో NLG కూడా చేరింది. జిల్లాలోని పలు మండలాల్లో ప్రస్తుతం 15 నుంచి 16 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ప్రధానంగా చందంపేట మండలంలో 16 మీటర్ల లోతుకు భూగర్భ జలం పడిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో 8 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా.. ఇప్పుడు 16 మీటర్ల పడిపోవడంతో ఆందోళన కలిగిస్తుంది.

News March 27, 2024

NLG: లక్షలు ఖర్చు చేస్తున్నా.. అందని వైద్యం!

image

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని మాదిరిగా తయారైంది NLG జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి తీరు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో శస్త్ర చికిత్సలు స్థానికంగా ఉండే జనరల్ ఆస్పత్రుల్లోనే జరగాలని ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసి పరికరాలను ఏర్పాటు చేసింది. కానీ NLG ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాళ్ళ చిప్పల మార్పిడి లాంటి శస్త్ర చికిత్సలను వైద్యులు పక్కన పెట్టారు. దీంతో బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు.

News March 27, 2024

మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరంలో సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు టీఎస్ఆర్డీసీ సెట్-2024ను ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయా విద్యాసంస్థలు తెలిపాయి. ప్రవేశ పరీక్ష కోసం ఏప్రిల్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని మర్కల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాధిక తెలిపారు.

error: Content is protected !!