Telangana

News July 13, 2024

మహబూబ్ నగర్: నేటి ముఖ్య వార్తలు!!

image

♥గద్వాల:ముగ్గురు విద్యార్థులకు పాముకాటు
♥గండీడ్:ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
♥KTRను కలిసిన గద్వాల్ భారాస నేతలు
♥గద్వాలలో బీటెక్ స్టూడెంట్ SUICIDE’
♥ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొహర్రం సందడి
♥6 గ్యారెండీలపై అధికారుల ప్రత్యేక ఫోకస్
♥ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యేలు
♥డ్రగ్స్ నియంత్రణపై పోలీసుల ప్రత్యేక నిఘా
♥మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు:SIలు
♥నూతన పాఠశాలలో చేరిన టీచర్లకు ఘన సన్మానం

News July 13, 2024

ఏటూరునాగారంలో ఘోర ప్రమాదం.. పరారీలో కంటైనర్ డ్రైవర్

image

ఏటూరునాగారం మండలం జాతీయ రహదారిలోని హైవే ట్రీట్ వద్ద శనివారం రాత్రి ఆటో, కంటైనర్ ఢీకొనగా<<13623871>> ముగ్గురు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమైన కంటైనర్ వాహనాన్ని ప్రమాద స్థలం వద్ద డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. కాగా వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ వద్ద స్థానికులు కంటైనర్‌ను పట్టుకున్నారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు వాజేడు ఎస్సై హరీశ్ తెలిపారు.

News July 13, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి ముఖ్యాంశాలు.!

image

◆ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షం
◆ మంచిర్యాలో రైలు కిందపడి యువకుడి మృతి
◆ బేలలో 20 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత
◆ నిర్మల్ జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ◆ తాంసిలో పిడుగుపాటుకు 12 మేకలు మృతి
◆ మంచిర్యాల: చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ ◆ నిర్మల్: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
◆ ఆదిలాబాద్‌లో నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్
◆ ఆసిఫాబాద్‌లో ఐదుగురు జూదరుల అరెస్ట్.

News July 13, 2024

హుజూరాబాద్: బీరు సీసాలో పురుగు!

image

హుజూరాబాద్ పట్టణంలోని వైన్ షాపులో ఓ వ్యక్తి బీరు తాగుతుండగా పురుగు వచ్చింది. గమనించి అతడు ఒక్కసారిగా వాంతి చేసుకున్నాడు. వెంటనే ఆ బీరును పట్టుకెళ్లి వైన్ షాపులో చూపించగా సదరు షాపు నిర్వాహకుడు దాని బదులు వేరే బీర్ ఇచ్చాడు. ఈ విషయం హుజూరాబాద్ పట్టణంలో వైరల్‌గా మారింది.

News July 13, 2024

HNK: బాలికల గురుకులంలో కొండ చిలువల కలకలం

image

HNK జిల్లా పరకాల మండలం మల్లక్కపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కొండ చిలువ పిల్లలు కనిపించడం కలకలం రేపింది. శనివారం గురుకులంలో కొండ చిలువ పాములను చూసిన విద్యార్థినులు ఆందోళన చెందారు. అటవీ అధికారులకు సమాచారం అందించగా.. మొత్తం 12 కొండ చిలువ పిల్లలను గురుకులంలో గుర్తించారు. ఆరు పాములను చంపేసినట్లు సమాచారం. పిచ్చి చెట్లను తొలగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

News July 13, 2024

HYD: అమ్మ మాట.. అంగన్వాడి బాట షెడ్యూల్..!

image

✓ జులై 15,16వ తేదీల్లో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి అంగన్వాడీల్లో చేర్చాలని కోరుతారు. ✓18న ఇంటింటికి వెళ్లి రెండున్నర ఏళ్ల చిన్నారులను గుర్తిస్తారు. ✓19న స్వచ్ఛ అంగన్వాడీ పేరిట కేంద్రాలను శుభ్రం చేసి, మొక్కలు నాటుతారు. ✓20న ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు.

News July 13, 2024

HYD: అమ్మ మాట.. అంగన్వాడి బాట షెడ్యూల్..!

image

✓ జులై 15,16వ తేదీల్లో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి అంగన్వాడీల్లో చేర్చాలని కోరుతారు. ✓18న ఇంటింటికి వెళ్లి రెండున్నర ఏళ్ల చిన్నారులను గుర్తిస్తారు. ✓19న స్వచ్ఛ అంగన్వాడీ పేరిట కేంద్రాలను శుభ్రం చేసి, మొక్కలు నాటుతారు. ✓20న ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు.

News July 13, 2024

HYDలో ‘అమ్మ మాట..అంగన్వాడి బాట’

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంగన్వాడి కేంద్రాల్లోనే జరగనుంది. జూలై 15 నుంచి 20 వరకు ‘అమ్మ మాట అంగన్వాడి బాట’ పేరిట ప్రత్యేక ప్రోగ్రాం జరగనుంది. ప్రస్తుతం రెండున్నర ఏళ్ల పిల్లలు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకెలు, ఆట పాటలతో కూడిన విద్య అందించడమే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లక్ష్యంగా జిల్లాల అధికారులు తెలిపారు.

News July 13, 2024

HYDలో ‘అమ్మ మాట..అంగన్వాడి బాట’

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంగన్వాడి కేంద్రాల్లోనే జరగనుంది. జూలై 15 నుంచి 20 వరకు ‘అమ్మ మాట అంగన్వాడి బాట’ పేరిట ప్రత్యేక ప్రోగ్రాం జరగనుంది. ప్రస్తుతం రెండున్నర ఏళ్ల పిల్లలు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకెలు, ఆట పాటలతో కూడిన విద్య అందించడమే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లక్ష్యంగా జిల్లాల అధికారులు తెలిపారు.

News July 13, 2024

ఒకటో తేదీ చెల్లింపులు ఉత్త మాట: హరీశ్‌రావు

image

ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తుందని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. దీంతో ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నామన్న మాటలు కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయ‌ని తెలిపారు. మోడల్ స్కూల్ టీచర్ల‌కు గత 7 నెలల నుంచి ఏ నెలలో కూడా 1వ తేదీన వేతనాలు చెల్లించలేదని మండిపడ్డారు.