India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జడ్చర్ల నియోజకవర్గంలో నేడు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ పర్యటిస్తున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. బాలానగర్ నుంచి గంగాపూర్ వరకు రూ.56 కోట్లతో నిర్మించనున్న డబుల్ రోడ్డు, రాజాపూర్ నుంచి రంగారెడ్డిగూడ వయా మల్లేపల్లి, ఇదిగానిపల్లి, కల్లేపల్లి మీదుగా రూ.30కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని కోరారు.

భారతీయ సనాతన ధర్మంలో మహిళలకు అత్యున్నతమైన స్థానం కల్పించినట్లు ప్రముఖ ఆధ్యాత్మిక వక్త సత్యవాణి పేర్కొన్నారు. సదాశివపేటలో వీరశైవ సమాజం, ఆధ్వర్యంలో శివ పంచాక్షరి జపయజ్ఞ సామూహిక ఇష్ట లింగార్చన మహోత్సవం నిర్వహిస్తున్నారు. సృష్టిలో మహిళా మూర్తులకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. సమాజ అధ్యక్షులు చీల మల్లన్న, విశ్వనాథం, శ్రీశైలం, వీరేశం, బసవరాజు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సూచించారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం వరకు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల వల్ల రోడ్లు కొట్టుకుపోవడం, ఉద్యాన పంటల నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

గుజరాత్కు చెందిన పరుశురాం, రజనీత్ భాయ్పాల్తో పాటు మరో ఐదుగురు 2022లో అర్మడా బజార్ అనే షాపింగ్ మార్ట్ను స్థాపించారు. పాలకుర్తిలో ఫ్రాంచైజీ ఏర్పాటు చేస్తామని చెప్పి పాలకుర్తికి చెందిన ఓ ముగ్గురి దగ్గర రూ.30 లక్షలు తీసుకొని ఫ్రాంచైజీ పెట్టకుండా ఢిల్లీకి పారిపోయారని బాధితులు వాపోయారు. వారి ఫిర్యాదుతో పాలకుర్తి పోలీసులు ప్రధాన నిందితుడు భీమ్ సింగ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.

కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావు నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని ప్రయాణికుడు ఫిట్స్ సమస్యతో బాధపడుతుండగా గమనించిన ఆయన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.

సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల శివారులోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డితో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలు, పరిపాలనపై పెడితే బాగుంటుందన్నారు.

ఈ నెల 16న ఖమ్మానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు రానున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటనలో తెలిపారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా ఖమ్మం వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నగరంలోని వివిసి ఫంక్షన్ హాల్ (మామిళ్లగూడెం) నందు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.

ఒకప్పుడు పల్లె వెలుగుల బస్సుల రాకపోకలతో గ్రామీణ ప్రాంతాలు కళకళలాడేవి. ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ గ్రామీణ ప్రాంతాలను విస్మరిస్తుండడంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్తిగా బస్సులను కుదించడంతో అటు ప్రజలు, రైతులు ఇటు కళాశాల, స్కూల్ విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. బస్సులు రాకపోవడంతో శాలిగౌరారం మండలంలో అనేక మంది విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పారు.

HYDకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం లష్కర్గూడ సభలో ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో రంగారెడ్డి జిల్లా ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవుతదన్నారు. నగరానికి ORR, ఎయిర్పోర్టు, ఐటీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. డ్రగ్స్, గంజాయి తెచ్చుడు తప్పా BRS చేసిందేమీ లేదన్నారు. దీనిపై మీ కామెంట్?

HYDకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం లష్కర్గూడ సభలో ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో రంగారెడ్డి జిల్లా ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవుతదన్నారు. నగరానికి ORR, ఎయిర్పోర్టు, ఐటీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. డ్రగ్స్, గంజాయి తెచ్చుడు తప్పా BRS చేసిందేమీ లేదన్నారు. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.